పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ లాంటి విలక్షణ దర్శకుడితో పవన్ సినిమా చేయడమే ఆశ్చర్యం అంటే.. వీళ్లిద్దరి కలయికలో ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా రావడం ఇంకా ఆశ్చర్యం. ఈ సినిమా మొదలైనపుడు పెద్దగా అంచనాల్లేవు కానీ.. దీని ఫస్ట్ టీజర్ చూడగానే అంచనాలు పెరిగిపోయాయి.
ఇది పవన్ కెరీర్లో ఒక బాహుబలి అవుతుందన్న ఆశలు కలిగాయి. ఈ సినిమా మీద ఇంకా అంచనాలు పెంచే మాటలు చెప్పాడు క్రిష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో. ఈ సినిమా ప్రేక్షకులకు షాకిచ్చేలా ఉంటుందని క్రిష్ చెప్పాడు. ఇదొక షాకర్.. ఇలాంటి సినిమా నేనూ చేయలేదు.. ఇప్పటిదాకా తెలుగులో రానే లేదు అని క్రిష్ ధీమాగా చెప్పడం విశేషం.
చరిత్రలో ఉన్న కొన్ని ఉదంతాలు, పాత్రలను తీసుకుని.. వాటికి తనదైన కథాకథనాలు జోడించి హరిహర వీరమల్లు సినిమాను రూపొందించినట్లు క్రిష్ తెలిపాడు. ఇలాంటి సినిమాలో పవన్ కళ్యాణ్ నటించడం అన్నిటికంటే ప్రత్యేకమైన విషయం అని.. వీరమల్లు పాత్రలో పవన్ను చూడగానే తాను చాలా ఎగ్జైట్ అయిపోయానని క్రిష్ అన్నాడు.
ఇప్పటిదాకా హరిహర వీరమల్లు షూటింగ్ సగం పూర్తయిందని.. సినిమా ఆరంభ సన్నివేశం నుంచి సీక్వెన్స్లో సినిమా తీస్తూ ముందుకెళ్తున్నామని.. ఇంటర్వెల్ ముంగిట చిన్న సన్నివేశం మినహా ఫస్ట్ హాఫ్ వరకు సినిమా పూర్తయిందని.. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలవుతుందని క్రిష్ చెప్పాడు. ఈ సినిమా చేస్తుండగా, మధ్యలో బ్రేక్ తీసుకుని కొండపొలం సినిమా చేయడానికి పవన్, నిర్మాత ఎ.ఎం.రత్నం అంగీకరించడం గొప్ప విషయమని, ఇందుకు వారికి కృతజ్ఞుడనని క్రిష్ అన్నాడు. హరిహర వీరమల్లు వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
This post was last modified on October 7, 2021 6:59 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…