బాహుబలి సినిమాను ముందు ఒక చిత్రంగా తీయాలనే మొదలుపెట్టారు. కానీ మేకింగ్ మధ్యలో రాజమౌళి ఆలోచన మారింది. ఈ కథ పరిధి పెద్దదని.. బడ్జెట్, మార్కెట్ లాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఆ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాడు. ముందు ఈ నిర్ణయం ఎంత వరకు కరెక్ట్ అని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు కానీ.. చివరికి జక్కన్న ప్లాన్ అద్భుతంగా వర్కవుట్ అయింది. రెండు భాగాలూ అద్భుత విజయాన్ని సాధించి సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి.
ఐతే బాహుబలి లాంటి భారీ చిత్రాలను అలా రెండు భాగాలు చేయడం ఓకే కానీ.. ఈ మధ్య పుష్ప అనే రెగ్యులర్ మూవీని కూడా 2 పార్ట్స్గా తీయడానికి సుకుమార్ సంకల్పించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమాను సైతం ఒక చిత్రంగా తీయడానికి సంకల్పించారు. కానీ మేకింగ్ మధ్యలో ఆలోచన మారిపోయింది. అది కూడా రెండు భాగాలైంది. ఫస్ట్ పార్ట్ షూటింగ్ చివరి దశలో ఉంది. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 17న తొలి భాగాన్ని రిలీజ్ చేయబోతున్నారు.
ఇప్పుడు సౌత్లో మరో క్రేజీ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఆ చిత్రమే.. విక్రమ్. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందిస్తున్న సినిమా ఇది. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి విలక్షణ, మేటి నటులు ఇందులో విలన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఒక భాగంగా తీయాలనే మొదలుపెట్టారు. కానీ దీని పరిధి కూడా ఎక్కువే కావడం, ఫస్ట్ పార్ట్ నిడివి దాదాపు నాలుగు గంటలు వస్తుండటంతో ఇప్పుడు చిత్ర బృందం ఆలోచనలు మారుతున్నట్లు సమాచారం. దీన్ని రెండు భాగాలుగా తీసి, రిలీజ్ చేయడానికి అవసరమైన కంటెంట్ ఉందని.. అలా చేస్తే కమర్షియల్గా కూడా బాగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారట. దీనిపై లోకేష్, కమల్ మధ్య చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని.. ఈ మేరకు ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం.
This post was last modified on October 3, 2021 10:17 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…