బాహుబలి సినిమాను ముందు ఒక చిత్రంగా తీయాలనే మొదలుపెట్టారు. కానీ మేకింగ్ మధ్యలో రాజమౌళి ఆలోచన మారింది. ఈ కథ పరిధి పెద్దదని.. బడ్జెట్, మార్కెట్ లాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఆ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాడు. ముందు ఈ నిర్ణయం ఎంత వరకు కరెక్ట్ అని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు కానీ.. చివరికి జక్కన్న ప్లాన్ అద్భుతంగా వర్కవుట్ అయింది. రెండు భాగాలూ అద్భుత విజయాన్ని సాధించి సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి.
ఐతే బాహుబలి లాంటి భారీ చిత్రాలను అలా రెండు భాగాలు చేయడం ఓకే కానీ.. ఈ మధ్య పుష్ప అనే రెగ్యులర్ మూవీని కూడా 2 పార్ట్స్గా తీయడానికి సుకుమార్ సంకల్పించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమాను సైతం ఒక చిత్రంగా తీయడానికి సంకల్పించారు. కానీ మేకింగ్ మధ్యలో ఆలోచన మారిపోయింది. అది కూడా రెండు భాగాలైంది. ఫస్ట్ పార్ట్ షూటింగ్ చివరి దశలో ఉంది. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 17న తొలి భాగాన్ని రిలీజ్ చేయబోతున్నారు.
ఇప్పుడు సౌత్లో మరో క్రేజీ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఆ చిత్రమే.. విక్రమ్. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందిస్తున్న సినిమా ఇది. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి విలక్షణ, మేటి నటులు ఇందులో విలన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఒక భాగంగా తీయాలనే మొదలుపెట్టారు. కానీ దీని పరిధి కూడా ఎక్కువే కావడం, ఫస్ట్ పార్ట్ నిడివి దాదాపు నాలుగు గంటలు వస్తుండటంతో ఇప్పుడు చిత్ర బృందం ఆలోచనలు మారుతున్నట్లు సమాచారం. దీన్ని రెండు భాగాలుగా తీసి, రిలీజ్ చేయడానికి అవసరమైన కంటెంట్ ఉందని.. అలా చేస్తే కమర్షియల్గా కూడా బాగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారట. దీనిపై లోకేష్, కమల్ మధ్య చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని.. ఈ మేరకు ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం.
This post was last modified on October 3, 2021 10:17 pm
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…
ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది.…
ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…