టాలీవుడ్లో చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకునే కథానాయకుల్లో అల్లు అర్జున్ ఒకడు. తండ్రి అండ, ఆయన్నుంచి అందిపుచ్చుకున్న లక్షణాలు బన్నీకి ప్లస్ అనడంలో సందేహం లేదు. అందుకే టాలీవుడ్లో మరే స్టార్ హీరోకూ లేని సక్సెస్ రేట్ బన్నీకి ఉంది. ‘నా పేరు సూర్య’తో పెద్ద డిజాస్టర్ ఎదుర్కొన్నాక బన్నీ ఎంత ఆచితూచి వ్యవహరించాడో.. తర్వాత ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యాడో తెలిసిందే.
ఇప్పుడు సుకుమార్తో అతను చేస్తున్న ‘పుష్ప’ కచ్చితంగా బ్లాక్బస్టర్ అవుతుందనే అంచనాలున్నాయి. దీని తర్వాత బన్నీ ‘ఐకాన్’ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఇది ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న సినిమా. ఒక దశలో ఇది రద్దవుతుందనే ప్రచారం జరిగింది కానీ.. ఆ ప్రచారానికి తెరదించుతూ బన్నీ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీని తర్వాతి చిత్రానికి కూడా బన్నీ పచ్చ జెండా ఊపినట్లు తాజా సమాచారం.
తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్తో అల్లు అర్జున్ జత కట్టబోతున్న సంగతి తెలిసిందే. స్పైడర్, సర్కార్ దర్బార్ చిత్రాలతో చేదు అనుభవం ఎదుర్కొన్న మురుగదాస్కు కోలీవుడ్లో ఆశించిన అవకాశాలు లేవు. విజయ్తో అనుకున్న సినిమా అనూహ్యంగా క్యాన్సిల్ అయింది. తర్వాత మరే పెద్ద స్టార్ మురుగతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. ఈ స్థితిలో బన్నీ అతణ్ని నమ్మాడు. ఐతే స్క్రిప్టు విషయంలో మాత్రం బన్నీ అంత ఈజీగా ఓకే చెప్పడన్న సంగతి తెలిసిందే.
బన్నీ కోసం ఇంతకముందు మురుగదాస్ ఒకట్రెండు లైన్స్ చెప్పినా ఫలితం లేకపోయింది. చివరికి ఇప్పుడు ఐకాన్ స్టార్ కోసం మురుగదాస్ ఒక సైన్స్ ఫిక్షన్ కథను చెప్పాడట. ‘సెవన్త్ సెన్స్’ తరహా కథ ఇదని.. ఐతే దానికంటే మెరుగ్గా స్క్రిప్టు రెడీ అవుతోందని.. లైన్ విని బన్నీ ఓకే చెప్పాడని.. ప్రస్తుతం పూర్తి స్థాయిలో స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో మురుగదాస్ ఉన్నాడని.. ఇంకో ఏడాది తర్వాత ఈ సినిమా పట్టాలెక్కతుందని.. ఇది పాన్ ఇండియా సినిమా అని అంటున్నారు.
This post was last modified on October 3, 2021 5:33 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…