ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సమయం దగ్గర పడింది. సరిగ్గా ఇంకో వారం రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అధ్యక్ష పదవికి ఇండిపెండెంట్గా బరిలో నిలిచిన సీవీఎల్ నరసింహారావు, జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ వేసిన బండ్ల గణేష్ ఒకరి తర్వాత ఒకరు పోటీ నుంచి తప్పుకోవడంతో పోటీ రెండు వర్గాల మధ్య కేంద్రీకృతం అయింది. ఒకవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్.. ఇంకోవైపు మంచు విష్ణు బృందం బరిలో మిగిలాయి.
ఇప్పుడు ఇండస్ట్రీలోని నటీనటులు మెజారిటీ ఈ రెండు ప్యానెళ్లలో ఎవరి వైపు ఉన్నారన్నది తేలాల్సి ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి ‘మా’ ఎన్నికలు రాజకీయ రంగు పులుముకోవడం విశేషం. పవన్ కళ్యాణ్, జనసేన మద్దతుదారులంతా పరోక్షంగా ప్రకాష్ రాజ్కు మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక మంచు విష్ణు ఫ్యామిలీకి వైకాపాతో ఉన్న కనెక్షన్, ఇటీవల జగన్కు మద్దతుగా విష్ణు వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీ మద్దతుదారులు అతడి వైపు నిలిచే అవకాశముంది.
కాగా తెలుగుదేశం మద్దతుదారులు ఎవరి వైపు నిలుస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ విషయంలో మంచు విష్ణు ఎడ్జ్ తెచ్చుకున్నాడనే అభిప్రాయం కలుగుతోంది. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ మద్దతు అతను సంపాదించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు వారం ముంగిట బాలయ్యను కలిశాడు విష్ణు. మంచు హీరోకు బాలయ్య ఆల్ ద బెస్ట్ చెబుతున్నట్లుగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి.
మంచు ఫ్యామిలీ రాజకీయ ఉద్దేశాలన్ని పక్కన పెడితే బాలయ్యతో వాళ్లకు ముందు నుంచి సాన్నిహిత్యం ఉంది. ఈ సాన్నిహిత్యంతోనే వారి బేనర్లో ఒకప్పుడు ‘ఊకొడతారా ఉలిక్కి పడతారా’ అనే సినిమా చేశాడు బాలయ్య. చిరంజీవి పట్ల బాలయ్యకున్న వ్యతిరేకత దృష్ట్యా కూడా మంచు విష్ణుకు బాలయ్య మద్దతు ఇస్తుండొచ్చనిపిస్తోంది. అలాగని టీడీపీ మద్దతుదారులందరూ మంచు విష్ణుకు ఓటేస్తారని అనుకోలేం. జగన్ సర్కారు ఇండస్ట్రీని ఉద్దేశపూర్వంగా ఇబ్బంది పెడుతోందన్న అభిప్రాయం ఇక్కడి జనాల్లో బలంగా ఉన్న నేపథ్యంలో ఆ కోపంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్ వైపు చాలామంది నిలిచే అవకాశాలు లేకపోలేదు. మరి వచ్చే ఆదివారం జరిగే ఎన్నికల్లో ‘మా’ సభ్యుల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on October 3, 2021 2:52 pm
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…
ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…
జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…