Movie News

‘పుష్ప’రాజ్ ఫిక్సయ్యాడు


భారీ సినిమాలు ప్లాన్ చేయడం ఈజీయే కానీ పూర్తి చేయడం మాత్రం అంత ఈజీ కాదు. ఎంత పక్కాగా ప్లాన్ చేసినా మధ్యలో ఊహించని విపత్తులు వస్తే అడుగడుగునా ఆలస్యమే. అల్లు అర్జున్, సుకుమార్‌‌ల ‘పుష్ప’ విషయంలోనూ అది జరిగింది. కరోనా, లాక్‌డౌన్‌ కారణాలతో ఈ మూవీ లేటవుతూ వచ్చింది.

ఎట్టకేలకి 90 శాతం షూటింగ్ పూర్తయ్యాక క్రిస్మస్‌కి సినిమాని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే మిగతా పార్ట్‌ తీస్తున్నప్పుడు భారీ వర్షాలతో మరోసారి అంతరాయం ఏర్పడింది. దాంతో అనుకున్న సమయానికి రావడం కష్టమేనంటూ ప్రచారం మొదలైంది. పైగా చిరంజీవి ‘ఆచార్య’ను కూడా అప్పటికే తీసుకు రావాలనుకుంటున్నారు కాబట్టి ఈ మూవీ క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకుంటోందనే గుసగుసలూ వినిపించాయి. కానీ అది నిజం కాదని, పుష్పరాజ్‌ డిసెంబర్‌‌లో రావడానికి ఫిక్సయ్యాడని తేల్చేశారు మేకర్స్.

‘పుష్ప’ చిత్రాన్ని డిసెంబర్‌‌ 17న ప్యాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయనున్నట్టు కన్‌ఫర్మ్ చేశారు. మొదట బన్నీ లుక్‌.. తర్వాత టీజర్‌‌.. ఆపైన పాట.. రీసెంట్‌గా రష్మిక పోస్టర్‌‌.. ఇలా ఒక్కో అప్‌డేట్‌తో అంచనాలను పెంచుకుంటూ పోతున్నాడు సుకుమార్. ఆల్రెడీ ‘రంగస్థలం’తో తాను రా అండ్ రస్టిక్ ఫిల్మ్స్‌ ఎలా తీయగలనో చూపించి ఉన్నాడు కాబట్టి ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఎక్కువయ్యాయి.

బన్నీ స్మగ్లర్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అతన్ని పట్టుకోవాలని చూసే ఫారెస్ట్ ఆఫీసర్‌‌గా నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడు. అది కూడా ఈ సినిమాకి అడిషనల్ క్రేజ్‌ని తీసుకొచ్చింది. పైగా బన్నీ చేస్తున్న ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ కూడా కాబట్టి అంచనాలు ఆ రేంజ్‌లో ఉండటం కామనే!

This post was last modified on October 2, 2021 10:55 am

Share

Recent Posts

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

20 minutes ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

57 minutes ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

1 hour ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

4 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

5 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

13 hours ago