Movie News

నలిగిపోతున్న టాలీవుడ్ పెద్దలు

ప్రాడెక్ట్ ఏదైనా సరే.. దాని ఉత్పత్తిదారుడే ఎంత ధర ఉండాలన్నది నిర్ణయిస్తారు. కానీ తాము తీసే సినిమాలకు టికెట్ రేటు ఎంత ఉండాలన్నది తమ చేతుల్లో లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ నిర్మాతలు. టికెట్ల ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల లోలోన తీవ్ర ఆగ్రహం, ఆవేదనతో ఉన్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితితో పడిపోయామంటూ అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ గొడవ మొదలైంది ‘వకీల్ సాబ్’ సినిమాతో అన్న సంగతి తెలిసిందే.

ఇంతకుముందెన్నడూ లేని విధంగా సరిగ్గా ఆ సినిమా రిలీజయ్యే టైంకే టికెట్ల ధరలకు సంబంధించి పాత జీవోలను బయటికి తీసి ఏపీ అంతటా థియేటర్ల మీద దాడులు జరపడం.. టికెట్ల రేట్ల మీద నియంత్రణ తీసుకురావడం తెలిసిందే. ప్రభుత్వం ఎంత సమర్థించుకున్నా, కవర్ చేసే ప్రయత్నం చేసినా.. పవన్ లక్ష్యంగానే ఆ చర్యలు చేపట్టారన్న విషయం స్పష్టమైపోయింది.

ఇన్నాళ్లూ మౌనం వహించిన పవన్ కళ్యాణ్.. మొన్నటి ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఓపెన్ అయిపోయాడు. టికెట్ల ధరలు, ఇతర సమస్యల విషయంలో వైసీపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో ఎటాక్ చేశాడు. అప్పట్నుంచి సినీ పెద్దల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. దిల్ రాజు సహా కొందరు సినీ పెద్దల మనోగతాన్ని అర్థం చేసుకుని, వారి నిస్సహాయతను చూసే పవన్ గళం విప్పాడన్నది స్పష్టం. తన దగ్గరికి కొందరు నిర్మాతలు వచ్చి మొర పెట్టుకుంటే, దీని గురించి మాట్లాడమంటేనే తాను ఆ రోజు అలా మాట్లాడానని పవన్ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం.

నిర్మాతలు కోరుకున్నదే పవన్ చేసినా.. బహిరంగంగా అతడికి మద్దతు పలకలేని పరిస్థితి. పైగా పవన్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లుగా ఫిలిం ఛాంబర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇటు చిరంజీవి.. అటు మిగతా సినీ పెద్దలు పవన్ వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దని, వాటికి తాము వ్యతిరేకం అని తనతో అన్నట్లుగా మంత్రి పేర్ని నాని ప్రెస్ ముందు వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో ఇండస్ట్రీ పెద్దల ఆంతర్యం ఏమిటో అంతుబట్టకుండా ఉంది. వాళ్ల మనసుల్లో ఉన్నది ఒకటి.. బయటికి మాట్లాడుతున్నది ఒకటి.. వాళ్ల గురించి పవన్ చెప్పేదొకటి.. మంత్రి మాట్లాడేది మరొకటి.. మొత్తంగా ఈ వ్యవహారంలో వారి ఇమేజ్ బాగా డ్యామేజ్ అవుతుండటంతో లోలోన నలిగిపోతున్నట్లు కనిపిస్తోంది.

This post was last modified on September 30, 2021 2:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago