ప్రాడెక్ట్ ఏదైనా సరే.. దాని ఉత్పత్తిదారుడే ఎంత ధర ఉండాలన్నది నిర్ణయిస్తారు. కానీ తాము తీసే సినిమాలకు టికెట్ రేటు ఎంత ఉండాలన్నది తమ చేతుల్లో లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ నిర్మాతలు. టికెట్ల ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల లోలోన తీవ్ర ఆగ్రహం, ఆవేదనతో ఉన్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితితో పడిపోయామంటూ అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ గొడవ మొదలైంది ‘వకీల్ సాబ్’ సినిమాతో అన్న సంగతి తెలిసిందే.
ఇంతకుముందెన్నడూ లేని విధంగా సరిగ్గా ఆ సినిమా రిలీజయ్యే టైంకే టికెట్ల ధరలకు సంబంధించి పాత జీవోలను బయటికి తీసి ఏపీ అంతటా థియేటర్ల మీద దాడులు జరపడం.. టికెట్ల రేట్ల మీద నియంత్రణ తీసుకురావడం తెలిసిందే. ప్రభుత్వం ఎంత సమర్థించుకున్నా, కవర్ చేసే ప్రయత్నం చేసినా.. పవన్ లక్ష్యంగానే ఆ చర్యలు చేపట్టారన్న విషయం స్పష్టమైపోయింది.
ఇన్నాళ్లూ మౌనం వహించిన పవన్ కళ్యాణ్.. మొన్నటి ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఓపెన్ అయిపోయాడు. టికెట్ల ధరలు, ఇతర సమస్యల విషయంలో వైసీపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో ఎటాక్ చేశాడు. అప్పట్నుంచి సినీ పెద్దల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. దిల్ రాజు సహా కొందరు సినీ పెద్దల మనోగతాన్ని అర్థం చేసుకుని, వారి నిస్సహాయతను చూసే పవన్ గళం విప్పాడన్నది స్పష్టం. తన దగ్గరికి కొందరు నిర్మాతలు వచ్చి మొర పెట్టుకుంటే, దీని గురించి మాట్లాడమంటేనే తాను ఆ రోజు అలా మాట్లాడానని పవన్ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం.
నిర్మాతలు కోరుకున్నదే పవన్ చేసినా.. బహిరంగంగా అతడికి మద్దతు పలకలేని పరిస్థితి. పైగా పవన్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లుగా ఫిలిం ఛాంబర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇటు చిరంజీవి.. అటు మిగతా సినీ పెద్దలు పవన్ వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దని, వాటికి తాము వ్యతిరేకం అని తనతో అన్నట్లుగా మంత్రి పేర్ని నాని ప్రెస్ ముందు వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో ఇండస్ట్రీ పెద్దల ఆంతర్యం ఏమిటో అంతుబట్టకుండా ఉంది. వాళ్ల మనసుల్లో ఉన్నది ఒకటి.. బయటికి మాట్లాడుతున్నది ఒకటి.. వాళ్ల గురించి పవన్ చెప్పేదొకటి.. మంత్రి మాట్లాడేది మరొకటి.. మొత్తంగా ఈ వ్యవహారంలో వారి ఇమేజ్ బాగా డ్యామేజ్ అవుతుండటంతో లోలోన నలిగిపోతున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on September 30, 2021 2:46 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…