ప్రాడెక్ట్ ఏదైనా సరే.. దాని ఉత్పత్తిదారుడే ఎంత ధర ఉండాలన్నది నిర్ణయిస్తారు. కానీ తాము తీసే సినిమాలకు టికెట్ రేటు ఎంత ఉండాలన్నది తమ చేతుల్లో లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ నిర్మాతలు. టికెట్ల ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల లోలోన తీవ్ర ఆగ్రహం, ఆవేదనతో ఉన్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితితో పడిపోయామంటూ అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ గొడవ మొదలైంది ‘వకీల్ సాబ్’ సినిమాతో అన్న సంగతి తెలిసిందే.
ఇంతకుముందెన్నడూ లేని విధంగా సరిగ్గా ఆ సినిమా రిలీజయ్యే టైంకే టికెట్ల ధరలకు సంబంధించి పాత జీవోలను బయటికి తీసి ఏపీ అంతటా థియేటర్ల మీద దాడులు జరపడం.. టికెట్ల రేట్ల మీద నియంత్రణ తీసుకురావడం తెలిసిందే. ప్రభుత్వం ఎంత సమర్థించుకున్నా, కవర్ చేసే ప్రయత్నం చేసినా.. పవన్ లక్ష్యంగానే ఆ చర్యలు చేపట్టారన్న విషయం స్పష్టమైపోయింది.
ఇన్నాళ్లూ మౌనం వహించిన పవన్ కళ్యాణ్.. మొన్నటి ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఓపెన్ అయిపోయాడు. టికెట్ల ధరలు, ఇతర సమస్యల విషయంలో వైసీపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో ఎటాక్ చేశాడు. అప్పట్నుంచి సినీ పెద్దల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. దిల్ రాజు సహా కొందరు సినీ పెద్దల మనోగతాన్ని అర్థం చేసుకుని, వారి నిస్సహాయతను చూసే పవన్ గళం విప్పాడన్నది స్పష్టం. తన దగ్గరికి కొందరు నిర్మాతలు వచ్చి మొర పెట్టుకుంటే, దీని గురించి మాట్లాడమంటేనే తాను ఆ రోజు అలా మాట్లాడానని పవన్ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం.
నిర్మాతలు కోరుకున్నదే పవన్ చేసినా.. బహిరంగంగా అతడికి మద్దతు పలకలేని పరిస్థితి. పైగా పవన్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లుగా ఫిలిం ఛాంబర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇటు చిరంజీవి.. అటు మిగతా సినీ పెద్దలు పవన్ వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దని, వాటికి తాము వ్యతిరేకం అని తనతో అన్నట్లుగా మంత్రి పేర్ని నాని ప్రెస్ ముందు వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో ఇండస్ట్రీ పెద్దల ఆంతర్యం ఏమిటో అంతుబట్టకుండా ఉంది. వాళ్ల మనసుల్లో ఉన్నది ఒకటి.. బయటికి మాట్లాడుతున్నది ఒకటి.. వాళ్ల గురించి పవన్ చెప్పేదొకటి.. మంత్రి మాట్లాడేది మరొకటి.. మొత్తంగా ఈ వ్యవహారంలో వారి ఇమేజ్ బాగా డ్యామేజ్ అవుతుండటంతో లోలోన నలిగిపోతున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on September 30, 2021 2:46 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…