Movie News

అక్షయ్‌ కుమార్‌కు ఒళ్లు మండించిన వార్త

ఎప్పుడూ చాలా కూల్‌గా కనిపించే బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. మీడియాతో మాట్లాడినా.. అభిమానులతో ముచ్చటించినా అతను కూల్‌గానే కనిపిస్తాడు. అలాంటి వాడికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది ఓ వార్త. ఆ వార్త రాసిన వెబ్ సైట్‌ మీద తన కోపాన్నంతా ప్రదర్శిస్తూ.. వాళ్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని అతను హెచ్చరికలు జారీ చేశాడు.

లాక్ డౌన్ టైంలో ముంబయిలోనే ఉండిపోయిన తన సోదరి అల్కా భాటియా, ఆమె ఇద్దరు పిల్లల్ని తిరిగి ఢిల్లీ పంపించేందుకు అక్షయ్ ప్రత్యేకంగా ఒక విమానాన్నే బుక్ చేశాడంటూ ఓ ప్రముఖ వెబ్ సైట్ వార్త రాసింది. ఇది చూసి అక్షయ్ కోపం తెచ్చుకున్నాడు. తనపై ఇలాంటి అవాస్తవాలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు.

‘‘నా సోదరి, ఆమె పిల్లల కోసం ప్రత్యేకంగా ఓ విమానాన్ని బుక్ చేశానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అది పూర్తి అబద్ధం. లాక్ డౌన్ ప్రారంభమైన నాటి నుంచి నా సోదరి ఎలాంటి ప్రయాణాలు చేయలేదు. ఆమెకు ఒక్కరే సంతానం. కానీ ఈ వార్తలో ఇద్దరని రాశారు. ఈ వార్త మొత్తం ఇలాగే సాగింది. ఇలాంటి అవాస్తవాలు రాస్తే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది’’ అని అక్షయ్ హెచ్చరికలు జారీ చేశాడు.

అక్షయ్ స్పందన చూశాక సదరు వెబ్ సైట్ ఆ వార్తను తొలగించింది. కరోనా ప్రభావం మొదలయ్యాక ఎంతో పెద్ద మనసుతో స్పందించిన బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ ముందుంటాడు. అతను ప్రధానమంత్రి సహాయ నిధికి ఏకంగా రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించాడు. అలాగే ముంబయిలో వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది కోసం కూడా విరాళం అందజేశాడు. ఇంకా ముంబయిలో కొన్ని సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టాడు. తాను ఇంత చేస్తుంటే తన గురించి అవాస్తవాలు ప్రచురించడంతో అతడికి కోపం వచ్చింది.

This post was last modified on June 1, 2020 11:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

8 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

11 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

39 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago