Movie News

అక్షయ్‌ కుమార్‌కు ఒళ్లు మండించిన వార్త

ఎప్పుడూ చాలా కూల్‌గా కనిపించే బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. మీడియాతో మాట్లాడినా.. అభిమానులతో ముచ్చటించినా అతను కూల్‌గానే కనిపిస్తాడు. అలాంటి వాడికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది ఓ వార్త. ఆ వార్త రాసిన వెబ్ సైట్‌ మీద తన కోపాన్నంతా ప్రదర్శిస్తూ.. వాళ్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని అతను హెచ్చరికలు జారీ చేశాడు.

లాక్ డౌన్ టైంలో ముంబయిలోనే ఉండిపోయిన తన సోదరి అల్కా భాటియా, ఆమె ఇద్దరు పిల్లల్ని తిరిగి ఢిల్లీ పంపించేందుకు అక్షయ్ ప్రత్యేకంగా ఒక విమానాన్నే బుక్ చేశాడంటూ ఓ ప్రముఖ వెబ్ సైట్ వార్త రాసింది. ఇది చూసి అక్షయ్ కోపం తెచ్చుకున్నాడు. తనపై ఇలాంటి అవాస్తవాలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు.

‘‘నా సోదరి, ఆమె పిల్లల కోసం ప్రత్యేకంగా ఓ విమానాన్ని బుక్ చేశానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అది పూర్తి అబద్ధం. లాక్ డౌన్ ప్రారంభమైన నాటి నుంచి నా సోదరి ఎలాంటి ప్రయాణాలు చేయలేదు. ఆమెకు ఒక్కరే సంతానం. కానీ ఈ వార్తలో ఇద్దరని రాశారు. ఈ వార్త మొత్తం ఇలాగే సాగింది. ఇలాంటి అవాస్తవాలు రాస్తే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది’’ అని అక్షయ్ హెచ్చరికలు జారీ చేశాడు.

అక్షయ్ స్పందన చూశాక సదరు వెబ్ సైట్ ఆ వార్తను తొలగించింది. కరోనా ప్రభావం మొదలయ్యాక ఎంతో పెద్ద మనసుతో స్పందించిన బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ ముందుంటాడు. అతను ప్రధానమంత్రి సహాయ నిధికి ఏకంగా రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించాడు. అలాగే ముంబయిలో వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది కోసం కూడా విరాళం అందజేశాడు. ఇంకా ముంబయిలో కొన్ని సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టాడు. తాను ఇంత చేస్తుంటే తన గురించి అవాస్తవాలు ప్రచురించడంతో అతడికి కోపం వచ్చింది.

This post was last modified on June 1, 2020 11:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago