కొందరు దర్శకులు చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో ఎన్ని సూపర్ హిట్లు ఇచ్చినా సరే.. వాళ్లు పెద్ద స్టార్లను ఎలా డీల్ చేస్తారో అన్న సందేహాలు కలుగుతాయి. అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాకు రెడీ అయినపుడు ఇలాగే సందేహించారు. ఐతే అతను అలాంటి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబును అభిమానులు మెచ్చేలా ప్రెజెంట్ చేశాడు. మహేష్ నమ్మకాన్ని నిలబెడుతూ సూపర్ హిట్ డెలివర్ చేశాడు.
ఇప్పుడు మహేష్ మరో మీడియం రేంజ్ దర్శకుడితో సినిమాకు రెడీ అయ్యాడు. అతనే పరశురామ్. వీరి కలయికలో ‘సర్కారు వారి పాట’ పేరుతో కొత్త సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఐతే అనిల్ మీడియం రేంజ్ సినిమాలే చేసినా.. వరుసగా బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. కానీ పరశురామ్ పరిస్థితి అలా కాదు.
పరశురామ్ కెరీర్ సక్సెస్ రేట్ మరీ గొప్పగా ఏమీ లేదు. చివరగా తీసిన ‘గీత గోవిందం’ ఒక్కటే బ్లాక్ బస్టర్. అంతకుముందు శ్రీరస్తు శుభమస్తు, సోలో, యువత లాంటి ఓ మోస్తరు హిట్లే ఇచ్చాడు. అతను పని చేసిన పెద్ద స్టార్ అంటే రవితేజనే. ‘గీత గోవిందం’ కూడా మరీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా ఏమీ కాదు. కాలం కలిసొచ్చి అంచనాల్ని మించి ఆడేసింది.
మహేష్ కూడా ముందు అతడి కథ నచ్చినా కూడా హోల్డ్లో పెట్టాడు. వంశీ పైడిపల్లి సినిమా క్యాన్సిల్ అయ్యాకే అతడికి అవకాశమిచ్చాడు. ఈ నేపథ్యంలో పరశురామ్పై మహేష్ అభిమానులకు సందేహాలు నెలకొన్నాయి. ఐతే మహేష్ సినిమాకు పరశురామ్ పెట్టిన టైటిల్, దీని ప్రి లుక్ చూశాక మాత్రం చాలా వరకు వారి సందేహాలు తొలగిపోయాయి.
ఆసక్తికరమైన టైటిల్ పెట్టి.. ప్రి లుక్లో మహేష్ బాబును కొత్తగా చూపించడం.. అతణ్ని తాము కోరుకునేలా మాస్ స్టయిల్లో ప్రెజెంట్ చేయబోతున్నట్లు సంకేతాలివ్వడంతో అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. టైటిల్, ప్రి లుక్ వరకు అయితే పరశురామ్ టెస్ట్ పాసైనట్లే. అతడిపై అభిమానులకు గురి కుదరినట్లే. పెద్ద స్టార్తో సినిమా చేసే అవకాశం వచ్చింది కాబట్టి అతను కసితో పని చేసి బ్లాక్ బస్టర్ డెలివర్ చేస్తాడనే ఆశతో ఉన్నారు.
This post was last modified on June 1, 2020 11:56 pm
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…