కొందరు దర్శకులు చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో ఎన్ని సూపర్ హిట్లు ఇచ్చినా సరే.. వాళ్లు పెద్ద స్టార్లను ఎలా డీల్ చేస్తారో అన్న సందేహాలు కలుగుతాయి. అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాకు రెడీ అయినపుడు ఇలాగే సందేహించారు. ఐతే అతను అలాంటి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబును అభిమానులు మెచ్చేలా ప్రెజెంట్ చేశాడు. మహేష్ నమ్మకాన్ని నిలబెడుతూ సూపర్ హిట్ డెలివర్ చేశాడు.
ఇప్పుడు మహేష్ మరో మీడియం రేంజ్ దర్శకుడితో సినిమాకు రెడీ అయ్యాడు. అతనే పరశురామ్. వీరి కలయికలో ‘సర్కారు వారి పాట’ పేరుతో కొత్త సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఐతే అనిల్ మీడియం రేంజ్ సినిమాలే చేసినా.. వరుసగా బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. కానీ పరశురామ్ పరిస్థితి అలా కాదు.
పరశురామ్ కెరీర్ సక్సెస్ రేట్ మరీ గొప్పగా ఏమీ లేదు. చివరగా తీసిన ‘గీత గోవిందం’ ఒక్కటే బ్లాక్ బస్టర్. అంతకుముందు శ్రీరస్తు శుభమస్తు, సోలో, యువత లాంటి ఓ మోస్తరు హిట్లే ఇచ్చాడు. అతను పని చేసిన పెద్ద స్టార్ అంటే రవితేజనే. ‘గీత గోవిందం’ కూడా మరీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా ఏమీ కాదు. కాలం కలిసొచ్చి అంచనాల్ని మించి ఆడేసింది.
మహేష్ కూడా ముందు అతడి కథ నచ్చినా కూడా హోల్డ్లో పెట్టాడు. వంశీ పైడిపల్లి సినిమా క్యాన్సిల్ అయ్యాకే అతడికి అవకాశమిచ్చాడు. ఈ నేపథ్యంలో పరశురామ్పై మహేష్ అభిమానులకు సందేహాలు నెలకొన్నాయి. ఐతే మహేష్ సినిమాకు పరశురామ్ పెట్టిన టైటిల్, దీని ప్రి లుక్ చూశాక మాత్రం చాలా వరకు వారి సందేహాలు తొలగిపోయాయి.
ఆసక్తికరమైన టైటిల్ పెట్టి.. ప్రి లుక్లో మహేష్ బాబును కొత్తగా చూపించడం.. అతణ్ని తాము కోరుకునేలా మాస్ స్టయిల్లో ప్రెజెంట్ చేయబోతున్నట్లు సంకేతాలివ్వడంతో అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. టైటిల్, ప్రి లుక్ వరకు అయితే పరశురామ్ టెస్ట్ పాసైనట్లే. అతడిపై అభిమానులకు గురి కుదరినట్లే. పెద్ద స్టార్తో సినిమా చేసే అవకాశం వచ్చింది కాబట్టి అతను కసితో పని చేసి బ్లాక్ బస్టర్ డెలివర్ చేస్తాడనే ఆశతో ఉన్నారు.
This post was last modified on June 1, 2020 11:56 pm
కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది, రెండు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్ బస్టర్ గా…
సరిగ్గా వచ్చే వారం ఇదే రోజు ది ప్యారడైజ్ ప్రీమియర్లు పడబోతున్నాయి. సాయంత్రం రాత్రి కలిపి రెండు షోలు ప్లాన్…
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీ విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా బుధవారం…
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 ఏళ్ల తర్వాత.. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని రాజాం నియోజకవర్గం పరిధి లో…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దేశంలోని కాంగ్రెస్ పార్టీ హామీలను కాపీ కొడుతున్నాడా అంటే ఔననే చెబుతున్నాడు కర్ణాటక…
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ అప్రతిహాత విజయాలతో దూసుకొని వెళుతున్న నేపథ్యంలో ఈ సారి ఆయన పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా…