జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడిన పవన్తో పోసాని మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. పవన్ వ్యక్తిత్వాన్ని, నిజాయతీని నిలదీయడానికి ముందుకొచ్చిన పోసాని.. తన విమర్శల ప్రవాహాన్ని రెండోరోజు కూడా కొనసాగించారు. పవన్ ఓ సైకో అని, ఆయనకి తన మీద పగ ఉందని పోసాని అన్నారు. ఆ పగకి కారణమంటూ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను కూడా బయటపెట్టారు.
నైట్ షెడ్యూల్ జరుగుతున్నప్పుడు ఓసారి పవన్ షూటింగ్కి రాలేదట. ఎప్పుడూ ఆరింటికే ఇంటికెళ్లిపోయే పోసాని, పెద్ద హీరో కదా అని తొమ్మిదింటి వరకు వెయిట్ చేశారట. అయినా పవన్ రాకపోయేసరికి ఇంటికెళ్లిపోయారట. పదిన్నరకి భోజనం చేస్తుంటే పవన్ ఫోన్ చేసి ఇంటికెలా వెళ్లిపోతావ్, నేనొచ్చేవరకు ఆగాలి కదా అంటూ అరిచారట. మీరెప్పుడో పదింటికొస్తే నేను ఉండాలా, నేనూ ఆర్టిస్టునే అని తాను సీరియస్ అయ్యానని, దాంతో ఆ సినిమా నుంచి తనని వెంటనే తీసేశారని చెప్పారు పోసాని.
‘ముప్ఫయ్యేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు శత్రువులంటూ ఎవరూ లేరు. పవన్ మీద కూడా నేను కోపం పెట్టుకోలేదు. కానీ ఆయనే, ఆ సంఘటన జరిగినప్పటి నుంచి నామీద కోపం పెంచుకున్నారు’ అని చెప్పారు పోసాని. ఇప్పుడు పవన్ గురించి ఇలా మాట్లాడుతున్నందుకు ఇండస్ట్రీ తనను బ్యాన్ చేసినా పర్లేదని, తాను ఒక్క మాట కూడా అననని, అక్షయ పాత్రల్లాంటి నిర్మాతల పుణ్యంతోనే మేం అన్నం తింటున్నామని ఆయన అన్నారు.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…