7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన అమ్మాయి సరయు. ఈ ఛానెల్లో ఆమె చేసే వీడియోల్లో బూతులు వింటే చెవులు చిల్లులు పడిపోతాయి. ఈ వీడియోలు చూసిన అమ్మాయేంటి ఇలా బూతులు మాట్లాడ్డమేంటి అంటూ అభ్యంతరాలు చెప్పిన వాళ్లున్నారు. అలాగే ఆ వీడియోలను ఎంజాయ్ చేసిన వాళ్లూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
ఎలాగైతేనేం సరయు అయితే బాగా పాపులర్ అయింది. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే అవకాశం కూడా దక్కించుకుంది. కానీ అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకోలేక వారం తిరిగేసరికే ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడామె.. వరుసగా యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిస్తోంది. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది సరయు.
తాను ఒక వ్యక్తితో ఏడేళ్లు రిలేషన్షిప్లో ఉన్నట్లు చెప్పిన సరయు.. అతను డబ్బుల కోసం వేధించడంతో పెళ్లి రద్దు చేసుకున్నట్లు సరయు చెప్పడం గమనార్హం. ”ఒక వ్యక్తితో ఏడేళ్లు రిలేషన్లో ఉన్నాను. అది మా ఇంట్లో వాళ్లకు, అబ్బాయి ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. తనతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నా కెరీర్ను కూడా పక్కన పెట్టాను. ఆ బంధంలో అతడికి నేనివ్వాల్సినదాంట్లో 100 పర్సెంట్ ఇచ్చేశాను. నేను వర్జిన్ కూడా కాదు. మేమిద్దరం పెళ్లి చేసుకుందామనుకున్నాం, కట్నం విషయంలో గొడవ తలెత్తి చివర్లో పెళ్లి ఆగిపోయింది.
ముందు 25 లక్షలు అడిగారు, తర్వాత అర కోటి అన్నారు. తర్వాత కోటి డిమాండ్ చేశారు. చివరికి సగం ఆస్తి అడిగారు. ఇప్పటి నుంచే ఇలా చేస్తే పెళ్లయ్యాక ఇంకెన్ని అడుగుతారో, ఇంకెలా ఉంటారో అని భయమేసి ఆ పెళ్లి రద్దు చేసుకున్నాను. నువ్వు నాకు తగినవాడివి కాదని అతడి ముఖం మీదే చెప్పేశాను” అని సరయు తెలిపింది.
This post was last modified on September 28, 2021 7:03 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…