7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన అమ్మాయి సరయు. ఈ ఛానెల్లో ఆమె చేసే వీడియోల్లో బూతులు వింటే చెవులు చిల్లులు పడిపోతాయి. ఈ వీడియోలు చూసిన అమ్మాయేంటి ఇలా బూతులు మాట్లాడ్డమేంటి అంటూ అభ్యంతరాలు చెప్పిన వాళ్లున్నారు. అలాగే ఆ వీడియోలను ఎంజాయ్ చేసిన వాళ్లూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
ఎలాగైతేనేం సరయు అయితే బాగా పాపులర్ అయింది. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే అవకాశం కూడా దక్కించుకుంది. కానీ అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకోలేక వారం తిరిగేసరికే ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడామె.. వరుసగా యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిస్తోంది. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది సరయు.
తాను ఒక వ్యక్తితో ఏడేళ్లు రిలేషన్షిప్లో ఉన్నట్లు చెప్పిన సరయు.. అతను డబ్బుల కోసం వేధించడంతో పెళ్లి రద్దు చేసుకున్నట్లు సరయు చెప్పడం గమనార్హం. ”ఒక వ్యక్తితో ఏడేళ్లు రిలేషన్లో ఉన్నాను. అది మా ఇంట్లో వాళ్లకు, అబ్బాయి ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. తనతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నా కెరీర్ను కూడా పక్కన పెట్టాను. ఆ బంధంలో అతడికి నేనివ్వాల్సినదాంట్లో 100 పర్సెంట్ ఇచ్చేశాను. నేను వర్జిన్ కూడా కాదు. మేమిద్దరం పెళ్లి చేసుకుందామనుకున్నాం, కట్నం విషయంలో గొడవ తలెత్తి చివర్లో పెళ్లి ఆగిపోయింది.
ముందు 25 లక్షలు అడిగారు, తర్వాత అర కోటి అన్నారు. తర్వాత కోటి డిమాండ్ చేశారు. చివరికి సగం ఆస్తి అడిగారు. ఇప్పటి నుంచే ఇలా చేస్తే పెళ్లయ్యాక ఇంకెన్ని అడుగుతారో, ఇంకెలా ఉంటారో అని భయమేసి ఆ పెళ్లి రద్దు చేసుకున్నాను. నువ్వు నాకు తగినవాడివి కాదని అతడి ముఖం మీదే చెప్పేశాను” అని సరయు తెలిపింది.
This post was last modified on September 28, 2021 7:03 am
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తామే విజయం దక్కించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు…