Movie News

ఓటీటీలోపవన్ సినిమా.. రూమర్లకు చెక్ పెట్టిన ప్రొడ్యూసర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇందులో రానా కూడా నటిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే-మాటలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కానీ ఉన్నట్టుండి ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఓటీటీ నుంచి ఈ సినిమాకి మంచి డీల్ వచ్చిందని.. సో నిర్మాతలు డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది.

దీంతో అలెర్ట్ అయిన చిత్రయూనిట్ వెంటనే ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రనిర్మాత నాగవంశీ ట్విట్టర్ వేదికగా మరోసారి సినిమా రిలీజ్ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను జనవరి 12, 2022లో థియేటర్లో మాత్రమే విడుదల చేస్తామని.. అహంకారానికి.. ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధాన్ని చూడడానికి సిద్ధంగా ఉండండి అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ తో ఓటీటీ రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.

నిజానికి ఇప్పటికే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్ రికార్డ్ మొత్తానికి అమ్మేశారు. మిగిలిన శాటిలైట్, డిజిటల్ ఇతర హక్కులను రూ.70 కోట్ల రేంజ్ లో అమ్మడానికి చూస్తున్నారు. ఇక థియేట్రికల్ హక్కులు రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి దాదాపు రూ.80 కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇంత బిజినెస్ జరుగుతోన్న సినిమాను ఓటీటీకి ఇచ్చే ఛాన్స్ లేదని తేల్చి చెప్పేసింది చిత్రబృందం.

This post was last modified on September 27, 2021 6:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తండ్రి భావోద్వేగం.. 20 కోట్ల మంది మనసుల్ని దోచేసింది

సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం…

40 minutes ago

చంద్ర‌బాబు గారూ… నంది అవార్డులు ప్ర‌క‌టించండి సార్

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

3 hours ago

‘ఉస్తాద్‌’లో ఐటెం సాంగ్ ఎందుకు లేదు?

స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్‌గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…

3 hours ago

సాయిపల్లవిపై ఎందుకింత నెగెటివిటీ?

గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…

5 hours ago

బాబు కొత్త నిర్ణయం… వారి పరిస్థితి ఏమిటి?

రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని.. దీనికి మ‌హిళ‌లు కూడా సిద్ధంగా ఉండాల‌ని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ…

5 hours ago

అనిల్ యానిమేషన్ మూవీ భవిష్యత్ కోసమా

టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాపే లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇద్దరినీ పోల్చడం  సబబు కాకపోయినా ఇండస్ట్రీలో…

6 hours ago