Political News

అక్టోబ‌రు 2 ముహూర్తం: జ‌గ‌న్ స‌ర్కారుపై ప‌వ‌న్ నిర‌స‌న‌

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మ‌ళ్లీ త‌న పాత‌రూట్‌లోకి వ‌చ్చేశారా? కూర్చున్నా.. నిల్చున్నా.. ఆయ‌న ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారా? ఇక‌, వైసీపీ స‌ర్కారుకు చుక్క‌లు చూపించాల‌ని నిర్ణ‌యించుకున్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఇదే పంథాను కొన‌సాగించ‌నున్నారా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. అక్టోబ‌రు 2న మ‌హాత్మా గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర స‌ర్కారుపై నిర‌స‌న తెలిపేందుకు ప‌వ‌న్ స్వ‌యంగా రంగంలోకి దిగుతున్నారు. త‌నే దిగితే.. ఇక‌, త‌న వెంట‌న జ‌న‌సైనికులు కూడా భారీ సంఖ్య‌లో క్యూక‌ట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మొత్తంగా తాజా ప‌రిణామంపై జ‌న‌సేన‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

విష‌యంలోకి వెళ్తే.. మండ‌ల, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కొన్ని చోట్ల స‌త్తా చాటింది. కొన్ని చోట్ల ఊహించ‌ని విధంగా దూసు కుపోయింది. దీంతో.. జ‌న‌సేన‌లోనూ అంత‌ర్మ‌థ‌నం ఏర్ప‌డింది. ప‌వ‌న్ క‌నుక కొద్దిగా పుంజుకుంటే.. ఇక తిరుగులేద‌ని.. ఆ పార్టీలో సీనియ‌ర్లు.. భావిస్తున్నారు. ఇక‌, ఇదే విష‌యంపై ప్ర‌ధాన మీడియాలోనూ క‌థ‌నాలు వ‌చ్చాయి. గ‌త ఎన్నిక‌ల్ త‌ర్వాత‌.. ప‌వ‌న్ పెద్ద‌గా ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చింది లేదు. కేవలం తిరుప‌తి ఉప ఎన్నిక త‌ర్వాత‌.. ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఈ క్ర‌మంలో వ‌చ్చిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితంతో మున్ముందు పుంజుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని జ‌న‌సేన అంచ‌నా వేసింది.

ఈ క్ర‌మంలో ప‌వ‌న్‌.. ఏమ‌నుకున్నారో.. ఏమో.. ఆ వెంట‌నే.. అంటే.. మండ‌ల ప‌రిష‌త్ ఫ‌లితాలు వెల్లడైన రెండో రోజు నుంచే ప‌వ‌న్ త‌న దూకుడు ప్రారంభించారు. ఏపీ స‌ర్కారుపై నిశిత విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించారు. ఏ వేదిక దొరికితే .. ఆ వేదిక‌పై గ‌ళం వినిపించారు. స్వ‌యంగా పార్టీ ఆఫీస్‌లో మీటింగ్ పెట్టి.. త‌మ ఫ‌లితాల‌ను విశ్లేషిస్తూ.. వైసీపీని విమ‌ర్శించారు. ఇక‌, త‌ర్వాత ట్వీట్‌లోనూ.. భారీ ఎత్తున ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, రిప‌బ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌లోనూ కుమ్మేశారు. ఇక‌, ఇప్పుడు మ‌రో రూపంలో క్షేత్ర‌స్థాయిలో ప‌వ‌న్ దూకుడు చూపించేందుకు రెడీ అయ్యారు.

అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో కల్యాణ్ శ్రమదానం రూపంలో నిర‌స‌న వ్య‌క్తం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రహదారుల మరమ్మతు కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ రోడ్డు మరమ్మతు పనులతో పాటు అనంతపురం జిల్లా కొత్తచెరువు రోడ్డు పనుల్లో ఆయన పాల్గొననున్నట్లు ట్వీటర్ ద్వారా వెల్లడించారు. వాస్త‌వానికి ఏపీలో ర‌హ‌దారులు బాగోలేవ‌ని.. ప్ర‌భుత్వం వాటివైపు క‌న్నెత్తి కూడా చూడ‌డం లేద‌ని.. దీంతో ప్ర‌మాదాలు చోటు చేసుకుని నిండు జీవితాలు నాశ‌నం అవుతున్నాయ‌ని.. ప‌వ‌న్ త‌ర‌చుగా ఆరోపిస్తున్నారు. ఇటీవ‌ల ట్విట్ట‌ర్‌లోనూ రోడ్ల ఉద్య‌మం చేప‌ట్టారు. ఈక్ర‌మంలో తాజాగా ప‌వ‌న్ తీసుకున్న నిర్ణ‌యం.. ఎలాంటి వేడి పుట్టిస్తుందో చూడాలి.

This post was last modified on September 27, 2021 6:32 pm

Share

Recent Posts

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

33 minutes ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

2 hours ago

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

3 hours ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

5 hours ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

6 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

7 hours ago