కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది దసరా సీజన్ వాషౌట్ అయిపోయింది. నిరుడు ఆ సీజన్లో థియేటర్లు మూతపడి ఉండటంతో సినిమాలేవీ రిలీజ్ కాలేదు. ఈ ఏడాది ఈ సీజన్ మీద భారీ అంచనాలే పెట్టుకున్నారు ప్రేక్షకులు. కానీ ఆచార్య, అఖండ లాంటి భారీ చిత్రాలు ఆశలు రేకెత్తించి.. చివరికి రేసు నుంచి తప్పుకున్నాయి.
కొన్ని రోజుల ముందు వరకు అయితే ఈ పండక్కి ఒక్క ‘మహా సముద్రం’ మాత్రమే ఖరారైంది. కానీ గత వారం వ్యవధిలో రెండు కొత్త సినిమాలు పండుగ రేసులోకి వచ్చాయి. అందులో ఒకటి.. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ, నిర్మాణంలో తెరకెక్కిన ‘పెళ్ళిసంద-డి’. ఇప్పుడు మరో చిత్రం దసరా రేసులో నిలిచింది. అదే.. వరుడు కావలెను. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా కొత్త దర్శకురాలు సౌజన్య రూపొందించిన చిత్రమిది. దీనికి ఈ రోజే రిలీజ్ డేట్ ఇచ్చారు. అక్టోబరు 15న ‘వరుడు కావాలెను’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
దసరా పండక్కి ముందు వారం కొండపొలం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రాబోతున్న సంగతి తెలిసిందే. వాటి సందడి కొనసాగుతుండగానే ‘మహాసముద్రం’, ‘పెళ్ళిసంద-డి’, ‘వరుడు కావలెను’ థియేటర్లలోకి దిగబోతున్నాయి. ‘మహా సముద్రం’ అక్టోబరు 14కు ఖరారు కాగా.. తర్వాతి రోజు ‘వరుడు కావలెను’ రిలీజ్ కానుంది. ఇక ‘పెళ్ళి సంద-డి’ డేట్ తేలాల్సి ఉంది. దసరా బరిలో ఉన్న చిత్రాల్లో అత్యంత అంచనాలున్నది ‘మహా సముద్రం’ అనడంలో సందేహం లేదు. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ భూపతి రూపొందించిన ఈ చిత్రంలో శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్, జగపతిబాబు, రావు రమేష్ లాంటి ఆకర్షణీయ తారాగణం ఉన్నారు.
ఇటీవలే రిలీజైన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచింది. ఇక ‘వరుడు కావలెను’ విషయానికొస్తే దసరా పండక్కి కరెక్ట్గా సరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది. ఎటొచ్చీ ఓల్డ్ స్కూల్ మూవీలా కనిపిస్తున్న ‘పెళ్ళి సంద-డి’నే వీటి పోటీని ఎలా తట్టుకుని నిలబడుతుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on September 25, 2021 2:29 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…