టీడీపీ శ్రీకాకుళం ఎంపీ.. యువ నాయకుడు.. కింజరాపు రామ్మోహన్ నాయుడు.. ఏపీ ప్రభుత్వంపైనా.. సీఎం జగన్పైనా నిప్పులు చెరిగారు. ఏపీని డ్రగ్గాంధ్రప్రదేశ్గా మార్చారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంపీ రామ్మోహన్.. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై నిప్పులు చెరిగారు. సీఎం జగన్ వైఖరితో .. యువత మత్తు పదార్థాలకు బానిసయ్యే ప్రమాదం పొంచిఉందని.. ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మాఫియాకు రాష్ట్రం.. కేంద్ర బిందువుగా మారడం బాధాకరమమని రామ్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
పరిపాలన అంటే యువతకు హెరాయిన్ ఇవ్వడమా అని నిలదీశారు. 22 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన హెరాయిన్ వ్యవహారంలో ఏపీలో మూలాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయని.. వైసీపీకి సంబంధించిన వ్యక్తిని అరెస్టు చేశారని.. దీనికి వైసీపీకి మధ్య ఉన్న సంబంధాల్లో వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. డీజీపీ ఏమీ లేదని చెప్పడం.. బాధ్యతారాహిత్యం కాదా? అని నిలదీశారు. ఆశా ట్రేడింగ్ కంపెనీ ఎవరి పేరుతో నమోదైందో చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. డీజీపీ సహా రాష్ట్ర పోలీసులు ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తున్నారని.. ఈ విషయంలో డీజీపీనే స్వయంగా స్పష్టత ఇవ్వాలని ఎంపీ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారో.. చెప్పాలన్నా రు. 2020 నేర గణాంకాల లెక్కల ప్రకారం మహిళలపై బౌతిక దాడులు జరుగుతున్న రాష్ట్రాల్లో దేశంలో ఏపీ నెంబర్ 1గా ఉందన్నారు. ఏదో చేస్తారని.. జగన్కు ప్రజలు అధికారం అప్పగిస్తే.. మహిళలపై దాడులు జరుగుతున్నా.. చూస్తూ ఊరుకున్నారు.
యువతకు హెరాయిన్ ఇస్తున్నారు.. అన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారా అని నిలదీశా రు. యువతకు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ప్రతి పక్షాలకు ప్రశ్నించే హక్కు లేదా అని ఎంపీ రామ్మోహన్ నిలదీశారు.
This post was last modified on September 25, 2021 2:27 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…