Political News

‘జ‌గ‌న్ పాల‌న‌లో డ్ర‌గ్గాంధ్ర‌ప్ర‌దేశ్‌’

టీడీపీ శ్రీకాకుళం ఎంపీ.. యువ నాయ‌కుడు.. కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు.. ఏపీ ప్రభుత్వంపైనా.. సీఎం జగ‌న్‌పైనా నిప్పులు చెరిగారు. ఏపీని డ్ర‌గ్గాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మార్చారంటూ.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంపీ రామ్మోహ‌న్‌.. ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై నిప్పులు చెరిగారు. సీఎం జ‌గ‌న్ వైఖ‌రితో .. యువ‌త మ‌త్తు ప‌దార్థాల‌కు బానిస‌య్యే ప్ర‌మాదం పొంచిఉంద‌ని.. ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. డ్ర‌గ్స్‌ మాఫియాకు రాష్ట్రం.. కేంద్ర బిందువుగా మారడం బాధాకరమమని రామ్మోహన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

పరిపాలన అంటే యువతకు హెరాయిన్‌ ఇవ్వడమా అని నిలదీశారు. 22 వేల కోట్ల రూపాయ‌ల‌కు సంబంధించిన హెరాయిన్‌ వ్యవహారంలో ఏపీలో మూలాలు ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయ‌ని.. వైసీపీకి సంబంధించిన వ్య‌క్తిని అరెస్టు చేశార‌ని.. దీనికి వైసీపీకి మ‌ధ్య ఉన్న సంబంధాల్లో వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్ర‌జ‌లు దీనిపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంటే.. డీజీపీ ఏమీ లేద‌ని చెప్ప‌డం.. బాధ్య‌తారాహిత్యం కాదా? అని నిల‌దీశారు. ఆశా ట్రేడింగ్ కంపెనీ ఎవ‌రి పేరుతో న‌మోదైందో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. డీజీపీ స‌హా రాష్ట్ర పోలీసులు ఎవ‌రి ప్ర‌యోజ‌నం కోసం ప‌నిచేస్తున్నార‌ని.. ఈ విష‌యంలో డీజీపీనే స్వ‌యంగా స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని ఎంపీ డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఇంత జ‌రుగుతున్న ముఖ్య‌మంత్రి ఈ విష‌యంలో ఎందుకు మౌనంగా ఉన్నారో.. చెప్పాల‌న్నా రు. 2020 నేర గ‌ణాంకాల లెక్క‌ల ప్ర‌కారం మ‌హిళ‌ల‌పై బౌతిక దాడులు జ‌రుగుతున్న రాష్ట్రాల్లో దేశంలో ఏపీ నెంబ‌ర్ 1గా ఉంద‌న్నారు. ఏదో చేస్తారని.. జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు అధికారం అప్ప‌గిస్తే.. మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రుగుతున్నా.. చూస్తూ ఊరుకున్నారు.

యువ‌త‌కు హెరాయిన్ ఇస్తున్నారు.. అన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారా అని నిలదీశా రు. యువతకు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ప్రతి పక్షాలకు ప్రశ్నించే హక్కు లేదా అని ఎంపీ రామ్మోహన్ నిలదీశారు.

This post was last modified on September 25, 2021 2:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విజయ్ గెలిస్తే… వైసీపీకి ఒరిగేదేంటి?

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…

55 minutes ago

రజినీ వదిలేస్తే.. విజయ్ వాడుకున్నాడు..

తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…

58 minutes ago

అక్కడ కూడా కాంగ్రెస్ లో సీఎం సీటు పంచాయతీ!

కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……

1 hour ago

ఒక రోజుకే ప్రేక్షకులు మర్చిపోయారు

సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.…

1 hour ago

స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి.. దీదీ కోటలో బీజేపీ మ్యాజిక్!

పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట…

2 hours ago

బీజేపీ కూటమితో విజ‌య్ క‌లుస్తారా?.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విజ‌య్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…

3 hours ago