తెలుగు సినిమా నడతను మార్చి ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుల్లో కృష్ణవంశీ ఒకడు. క్రియేటివ్ డైరెక్టర్గా గొప్ప పేరు సంపాదించిన కృష్ణవంశీ.. గత దశాబ్ద కాలంలో తన స్థాయికి తగ్గ సినిమాలు తీయలేకపోయాడు. చందమామనే చివరగా ఆయన్నుంచి వచ్చిన హిట్ మూవీ. ఆ తర్వాత వచ్చిన సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన కొన్నేళ్ల విరామం తర్వాత రంగమార్తాండ అనే సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. నానా పటేకర్ నటించిన మరాఠి చిత్రం నటసామ్రాట్కు ఇది రీమేక్.
ఐతే మొదలుపెట్టి రెండేళ్లు కావస్తున్నా ఈ చిత్రం ఇంకా పూర్తి కాలేదు. అందుకు కరోనా మాత్రమే కాక వేరే కారణాలు కూడా ఉన్నాయి. చాన్నాళ్ల నుంచి అసలు ఈ సినిమా గురించి అప్డేట్ అన్నదే లేదు. షూటింగ్ ఏ దశలో ఉన్నదీ కూడా వెల్లడి కాలేదు. రిలీజ్ గురించి కూడా సమాచారం లేదు.
ఐతే కృష్ణవంశీ తాజాగా రంగమార్తాండ గురించి అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాను డిసెంబరులో రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఐతే చిత్ర వర్గాల సమాచారం ప్రకారం రంగమార్తాండ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని.. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే యోచనలో నిర్మాత ఉన్నారని తెలుస్తోంది. ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఏమంత బజ్ లేదు. కృష్ణవంశీ ట్రాక్ రికార్డు అందుకు ముఖ్య కారణం. అలాగే స్టార్ ఆకర్షణ లేకపోవడం కూడా సినిమాకు మైనస్.
ఈ నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ కోసం ఆశించిన ఆఫర్లేమీ రావట్లేదని.. దీంతో బడ్జెట్ మీద ఓ మోస్తరు లాభానికి ఓటీటీ ఆఫర్ వస్తే సినిమాను అమ్మేద్దామని చూస్తున్నారని అంటున్నారు. సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలోనే డీల్ క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. మరి ఈ సినిమాను కొని రిలీజ్ చేసే ఓటీటీ ఏదో చూడాలి.
This post was last modified on September 22, 2021 10:13 am
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…