టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. శర్వా నటించిన ‘పడి పడి లేచే మనసు’, ‘రణరంగం’, ‘జాను’ లాంటి సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ‘శ్రీకారం’ సినిమా పర్వాలేదనిపించినా.. శర్వానంద్ రేంజ్ లో లేదనే మాటలు వినిపించాయి. ప్రస్తుతం శర్వానంద్ ఆశలన్నీ కూడా ‘మహాసముద్రం’ సినిమాపైనే ఉన్నాయి. అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాతో పాటు దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందిస్తోన్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాలో నటిస్తున్నాడు శర్వానంద్. ఈ ఏడాది చివరికల్లా ఈ సినిమాను పూర్తి చేయనున్నారు. దీని తరువాత శర్వానంద్ ఎవరితో సినిమా చేయబోతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం చాలా రోజులుగా దర్శకుడిగా ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అప్పుడెప్పుడో ఆయన దర్శకత్వంలో ‘ఏగన్’ అనే సినిమా వచ్చింది.
ఆ తరువాత మళ్లీ ఆయన మెగాఫోన్ పట్టుకోలేదు. ఇంతకాలానికి శర్వానంద్ హీరోగా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కి వక్కంతం వంశీ కథ-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. చాలా కాలంగా రాజు సుందరం-శర్వానంద్ ల మధ్య ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయట. ఫైనల్ గా శర్వా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది.
This post was last modified on September 21, 2021 2:25 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…