టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్కు రీమేక్ సినిమాల పట్ల మక్కువ గురించి తెలిసిందే. ఆయన కెరీర్లో రీమేక్ సినిమాలు పదుల సంఖ్యలో కనిపిస్తాయి. అందులో ఘనవిజయాలందుకున్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ‘ఎఫ్-2’ తర్వాత ఆయన వరుసగా రెండు రీమేక్ మూవీస్ చేశారు. అందులో ఒకటి ‘నారప్ప’ రెండు నెలల కిందటే అమేజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆయన చేసిన మరో రీమేక్ మూవీ ‘దృశ్యం-2’ కూడా ఓటీటీ బాటే పట్టినట్లు ముందు వార్తలొచ్చాయి. కానీ ఈ మధ్య నిర్మాత సురేష్ బాబు ఆలోచన మారిందని.. థియేట్రికల్ రిలీజ్కు ఈ సినిమాను రెడీ చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంలో అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. సోమవారం ‘దృశ్యం-2’ ఫస్ట్ లుక్ లాంచ్ అని, అప్పుడే ఈ సినిమా విడుదల విషయంలోనూ స్పష్టత ఇస్తారని వార్తలొచ్చాయి.
కానీ తీరా చూస్తే ఫస్ట్ లుక్ లాంచ్ వాయిదా పడింది. కానీ ఈ సినిమా గురించి మరో అప్డేట్ ఇచ్చారు. ‘దృశ్యం-2’కు సెన్సార్ పూర్తయిందని వెల్లడించారు. ఫస్ట్ కాపీ రెడీ చేసి సెన్సార్ చేయించేశారంటే ఇక విడుదలే తరువాయి అన్నది స్పష్టమైపోయింది. కానీ రిలీజ్ ఎప్పుడు, ఎలా అన్నదే సస్పెన్స్గా మారింది. ఓటీటీ రిలీజ్ అయితే నేరుగా డేట్ ఇచ్చేసేవాళ్లు. ఎందులో రిలీజ్ అనేది చెప్పేసే వాళ్లు. ఇలా సెన్సార్ చేసి ఆగారు అంటే థియేట్రికల్ రిలీజే ఉండొచ్చని తెలుస్తోంది.
ఐతే ఏపీలో టికెట్ల రేట్ల వ్యవహారంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో.. దాని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. త్వరలోనే చిరు బృందంతో కలిసి సురేష్ బాబు కూడా ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపబోతున్నారు. అందులో ఏం తేలుతుందన్నదాన్ని బట్టి ‘దృశ్యం-2’కు రిలీజ్ డేట్ ఇస్తారేమో. పరిస్థితులు సానుకూలంగా ఉంటే దసరాకే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on September 20, 2021 2:33 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…