టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్కు రీమేక్ సినిమాల పట్ల మక్కువ గురించి తెలిసిందే. ఆయన కెరీర్లో రీమేక్ సినిమాలు పదుల సంఖ్యలో కనిపిస్తాయి. అందులో ఘనవిజయాలందుకున్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ‘ఎఫ్-2’ తర్వాత ఆయన వరుసగా రెండు రీమేక్ మూవీస్ చేశారు. అందులో ఒకటి ‘నారప్ప’ రెండు నెలల కిందటే అమేజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆయన చేసిన మరో రీమేక్ మూవీ ‘దృశ్యం-2’ కూడా ఓటీటీ బాటే పట్టినట్లు ముందు వార్తలొచ్చాయి. కానీ ఈ మధ్య నిర్మాత సురేష్ బాబు ఆలోచన మారిందని.. థియేట్రికల్ రిలీజ్కు ఈ సినిమాను రెడీ చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంలో అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. సోమవారం ‘దృశ్యం-2’ ఫస్ట్ లుక్ లాంచ్ అని, అప్పుడే ఈ సినిమా విడుదల విషయంలోనూ స్పష్టత ఇస్తారని వార్తలొచ్చాయి.
కానీ తీరా చూస్తే ఫస్ట్ లుక్ లాంచ్ వాయిదా పడింది. కానీ ఈ సినిమా గురించి మరో అప్డేట్ ఇచ్చారు. ‘దృశ్యం-2’కు సెన్సార్ పూర్తయిందని వెల్లడించారు. ఫస్ట్ కాపీ రెడీ చేసి సెన్సార్ చేయించేశారంటే ఇక విడుదలే తరువాయి అన్నది స్పష్టమైపోయింది. కానీ రిలీజ్ ఎప్పుడు, ఎలా అన్నదే సస్పెన్స్గా మారింది. ఓటీటీ రిలీజ్ అయితే నేరుగా డేట్ ఇచ్చేసేవాళ్లు. ఎందులో రిలీజ్ అనేది చెప్పేసే వాళ్లు. ఇలా సెన్సార్ చేసి ఆగారు అంటే థియేట్రికల్ రిలీజే ఉండొచ్చని తెలుస్తోంది.
ఐతే ఏపీలో టికెట్ల రేట్ల వ్యవహారంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో.. దాని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. త్వరలోనే చిరు బృందంతో కలిసి సురేష్ బాబు కూడా ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపబోతున్నారు. అందులో ఏం తేలుతుందన్నదాన్ని బట్టి ‘దృశ్యం-2’కు రిలీజ్ డేట్ ఇస్తారేమో. పరిస్థితులు సానుకూలంగా ఉంటే దసరాకే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on September 20, 2021 2:33 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…