దక్షిణాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ప్రదర్శించిన సినిమా ‘ఇండియన్-2’. రెండు దశాబ్దాల కిందట సంచలన విజయం సాధించిన ‘భారతీయుడు/ఇండియన్’కు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. మూడేళ్ల కిందట దర్శకుడు శంకర్ ఈ సినిమాను అనౌన్స్ చేసినపుడు అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారు. కమల్ హాసన్నే హీరోగా పెట్టి భారీ చిత్రాలకు పెట్టింది పేరైన లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఘనంగా ఈ సినిమాను మొదలుపెట్టారు. కానీ ఏ ముహూర్తాన సినిమాను ఆరంభించారో కానీ.. మొదట్నుంచి ఈ చిత్రానికి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది.
రెండు మూడుసార్లు బ్రేకులు పడ్డాక సినిమాను పున:ప్రారంభించి జోరుగా షూటింగ్ చేస్తున్న సమయంలో చివరగా క్రేన్ ప్రమాదం వల్ల సినిమా ఆగిపోయింది. దాని చుట్టూ నెలకొన్న వివాదం, ఆ తర్వాత కరోనా ప్రభావం వల్ల సినిమా ఎంతకీ పున:ప్రారంభం కాలేదు.
ఈ సినిమా వివాదాల నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే తిరిగి సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు కనిపించకపోవడంతో శంకర్.. రామ్ చరణ్ సినిమాలోకి వచ్చేశాడు. దాని చిత్రీకరణ కూడా మొదలైపోయింది. కమల్ ఏమో విక్రమ్ సినిమాలో బిజీ అయిపోయాడు. ఈ మధ్య కమల్ మీడియాతో మాట్లాడుతూ.. వివాదాలను పరిష్కరించి సినిమాను తిరిగి మొదలుపెట్టే ప్రయత్నం చేస్తామన్నాడు. కానీ ఆ దిశగా అడుగులేమీ పడలేదు.
ఈలోపు హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అయినట్లుగా వార్తలొచ్చాయి. ఇది నిజమే అయితే ఆమె ఏడాదికి పైగానే షూటింగ్లకు దూరం కావచ్చు. బిడ్డ పుట్టాక కూడా కొంత కాలం ఆమె షూటింగ్లకు వచ్చే అవకాశం లేదు. ఆమె అందుబాటులోకి వచ్చేవరకు ‘ఇండియన్-2’ సినిమాను పున:ప్రారంభించడం కూడా కష్టమే. ఈలోపు కమల్, శంకర్ ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసి, వేరే సినిమాల మీదికి వెళ్లొచ్చు. మరి అందరికీ డేట్లు కుదిరి సినిమా ఎప్పటికి పున:ప్రారంభం అవుతుందన్నది చెప్పడం కష్టమే.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…