మొత్తానికి రేటింగ్స్ పడిపోయి కనుమరుగైపోయినట్లుగా కనిపించిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోను జూనియర్ ఎన్టీఆర్ బాగానే నిలబెడుతున్నాడు. ఎవరు మీలో కోటీశ్వరులుగా పేరు మార్చుకుని స్టార్ మా నుంచి జెమిని టీవీలోకి వచ్చిన ఈ షోను తారక్ ఆరంభ ఎపిసోడ్ నుంచి విజయవంతంగా నడిపిస్తున్నాడు. అంతకంతకూ పెరుగుతున్న దీని రేటింగ్సే తారక్ పనితనానికి నిదర్శనం. ఆరంభ ఎపిసోడ్లో రామ్ చరణ్తో సూపర్ హిట్ ఎపిసోడ్ తర్వాత తారక్.. మామూలు కంటెస్టెంట్లతోనే షోను బాగానే నడిపిస్తున్నాడు.
ఐతే ఎప్పుడూ సామాన్యులతోనే ఎపిసోడ్లను నడిపిస్తే బోర్ కొట్టక మానదు. ఆకర్షణ పెంచాలి. సెలబ్రెటీలను తీసుకురావాలి. ఈ దిశగా జెమిని టీవీ అదిరిపోయే ప్లానింగే చేసింది. ఈ సోమవారం ఇద్దరు టాప్ డైరెక్టర్లతో షో నడిపించబోతోంది. ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, తారక్కు అత్యంత సన్నిహితులు అయిన రాజమౌళి, కొరటాల శివలు.. ఎవరు మీలో కోటీశ్వరులు షోకు విచ్చేశారు. ఇప్పటికే వీరితో షూట్ కూడా పూర్తయింది. ఈ నెల 20న, సోమవారం రాత్రి 8 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ మేరకు ప్రోమో కూడా రిలీజ్ చేశారు. తనకు ఆప్తులైన రాజమౌళి, శివలతో తారక్ బాగానే రచ్చ చేశాడని ఈ ప్రోమోను బట్టి అర్థమవుతోంది.
వాళ్లు కంటెస్టెంట్ల సీట్లో కూర్చోగానే.. లైట్స్ ఆన్, రోల్ కెమెరా, యాక్షన్ అంటూ ఆర్డర్లివ్వడం.. తారక్ షాకవ్వడం.. మధ్యలో వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని జవాబు చెప్పే ప్రయత్నం చేయగా.. ఇది రూల్స్కు విరుద్ధం అంటూ క్వశ్చన్ క్యాన్సిల్ చేయబోవడం.. చివర్లో ఈ లొకేషన్ నాది, డైరెక్షన్ నాది, ఇక్కడ నేనే బాస్ అంటూ తారక్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం.. ఇలా ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంది. ఇది చూస్తే ఈ షోకే ఆకర్షణగా నిలిచే బ్లాక్బస్టర్ ఎపిసోడ్ చూడబోతున్నామని స్పష్టమవుతోంది.
This post was last modified on September 17, 2021 10:31 am
పాకిస్తాన్ తో భారత యుద్ధం అంతకంతకూ భీకరంగా మారుతోంది. తొలుత ఉగ్రదాడి, ఆ తర్వాత కవ్వింపు చర్యలకు దిగిన పాక్..…
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేసినట్టు…
ఒక హిట్టు లేదా ఫ్లాపుని బట్టి డైరెక్టర్ సత్తాని అంచనా వేయలేం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోలు ఇలాంటి విషయాల్లో…
నిన్నటి వరకు భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించుకోవాలని.. రెండు దేశాలు తమకు అత్యంత ముఖ్యమైన దేశాలని.. మిత్రదేశాలుగా…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం తిరుపతి జిల్లాలో పర్యటించిన సంగతి…
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మొదలై రెండు రోజులు కూడా ముగియలేదు…అప్పుడే పాకిస్తాన్ తన అపజయాన్ని అంగీకరించే దిశగా సాగుతోంది.…