మొత్తానికి రేటింగ్స్ పడిపోయి కనుమరుగైపోయినట్లుగా కనిపించిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోను జూనియర్ ఎన్టీఆర్ బాగానే నిలబెడుతున్నాడు. ఎవరు మీలో కోటీశ్వరులుగా పేరు మార్చుకుని స్టార్ మా నుంచి జెమిని టీవీలోకి వచ్చిన ఈ షోను తారక్ ఆరంభ ఎపిసోడ్ నుంచి విజయవంతంగా నడిపిస్తున్నాడు. అంతకంతకూ పెరుగుతున్న దీని రేటింగ్సే తారక్ పనితనానికి నిదర్శనం. ఆరంభ ఎపిసోడ్లో రామ్ చరణ్తో సూపర్ హిట్ ఎపిసోడ్ తర్వాత తారక్.. మామూలు కంటెస్టెంట్లతోనే షోను బాగానే నడిపిస్తున్నాడు.
ఐతే ఎప్పుడూ సామాన్యులతోనే ఎపిసోడ్లను నడిపిస్తే బోర్ కొట్టక మానదు. ఆకర్షణ పెంచాలి. సెలబ్రెటీలను తీసుకురావాలి. ఈ దిశగా జెమిని టీవీ అదిరిపోయే ప్లానింగే చేసింది. ఈ సోమవారం ఇద్దరు టాప్ డైరెక్టర్లతో షో నడిపించబోతోంది. ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, తారక్కు అత్యంత సన్నిహితులు అయిన రాజమౌళి, కొరటాల శివలు.. ఎవరు మీలో కోటీశ్వరులు షోకు విచ్చేశారు. ఇప్పటికే వీరితో షూట్ కూడా పూర్తయింది. ఈ నెల 20న, సోమవారం రాత్రి 8 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ మేరకు ప్రోమో కూడా రిలీజ్ చేశారు. తనకు ఆప్తులైన రాజమౌళి, శివలతో తారక్ బాగానే రచ్చ చేశాడని ఈ ప్రోమోను బట్టి అర్థమవుతోంది.
వాళ్లు కంటెస్టెంట్ల సీట్లో కూర్చోగానే.. లైట్స్ ఆన్, రోల్ కెమెరా, యాక్షన్ అంటూ ఆర్డర్లివ్వడం.. తారక్ షాకవ్వడం.. మధ్యలో వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని జవాబు చెప్పే ప్రయత్నం చేయగా.. ఇది రూల్స్కు విరుద్ధం అంటూ క్వశ్చన్ క్యాన్సిల్ చేయబోవడం.. చివర్లో ఈ లొకేషన్ నాది, డైరెక్షన్ నాది, ఇక్కడ నేనే బాస్ అంటూ తారక్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం.. ఇలా ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంది. ఇది చూస్తే ఈ షోకే ఆకర్షణగా నిలిచే బ్లాక్బస్టర్ ఎపిసోడ్ చూడబోతున్నామని స్పష్టమవుతోంది.
This post was last modified on September 17, 2021 10:31 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…