మొత్తానికి రేటింగ్స్ పడిపోయి కనుమరుగైపోయినట్లుగా కనిపించిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోను జూనియర్ ఎన్టీఆర్ బాగానే నిలబెడుతున్నాడు. ఎవరు మీలో కోటీశ్వరులుగా పేరు మార్చుకుని స్టార్ మా నుంచి జెమిని టీవీలోకి వచ్చిన ఈ షోను తారక్ ఆరంభ ఎపిసోడ్ నుంచి విజయవంతంగా నడిపిస్తున్నాడు. అంతకంతకూ పెరుగుతున్న దీని రేటింగ్సే తారక్ పనితనానికి నిదర్శనం. ఆరంభ ఎపిసోడ్లో రామ్ చరణ్తో సూపర్ హిట్ ఎపిసోడ్ తర్వాత తారక్.. మామూలు కంటెస్టెంట్లతోనే షోను బాగానే నడిపిస్తున్నాడు.
ఐతే ఎప్పుడూ సామాన్యులతోనే ఎపిసోడ్లను నడిపిస్తే బోర్ కొట్టక మానదు. ఆకర్షణ పెంచాలి. సెలబ్రెటీలను తీసుకురావాలి. ఈ దిశగా జెమిని టీవీ అదిరిపోయే ప్లానింగే చేసింది. ఈ సోమవారం ఇద్దరు టాప్ డైరెక్టర్లతో షో నడిపించబోతోంది. ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, తారక్కు అత్యంత సన్నిహితులు అయిన రాజమౌళి, కొరటాల శివలు.. ఎవరు మీలో కోటీశ్వరులు షోకు విచ్చేశారు. ఇప్పటికే వీరితో షూట్ కూడా పూర్తయింది. ఈ నెల 20న, సోమవారం రాత్రి 8 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ మేరకు ప్రోమో కూడా రిలీజ్ చేశారు. తనకు ఆప్తులైన రాజమౌళి, శివలతో తారక్ బాగానే రచ్చ చేశాడని ఈ ప్రోమోను బట్టి అర్థమవుతోంది.
వాళ్లు కంటెస్టెంట్ల సీట్లో కూర్చోగానే.. లైట్స్ ఆన్, రోల్ కెమెరా, యాక్షన్ అంటూ ఆర్డర్లివ్వడం.. తారక్ షాకవ్వడం.. మధ్యలో వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని జవాబు చెప్పే ప్రయత్నం చేయగా.. ఇది రూల్స్కు విరుద్ధం అంటూ క్వశ్చన్ క్యాన్సిల్ చేయబోవడం.. చివర్లో ఈ లొకేషన్ నాది, డైరెక్షన్ నాది, ఇక్కడ నేనే బాస్ అంటూ తారక్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం.. ఇలా ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంది. ఇది చూస్తే ఈ షోకే ఆకర్షణగా నిలిచే బ్లాక్బస్టర్ ఎపిసోడ్ చూడబోతున్నామని స్పష్టమవుతోంది.
This post was last modified on September 17, 2021 10:31 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…