Movie News

పవన్ ప్రొడక్షన్ హౌస్ పై త్రివిక్రమ్ ఫోకస్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. పవన్ నటిస్తోన్న ‘భీమ్లా నాయక్’ సినిమా కోసం.. మహేష్ తో తను చేయాల్సిన సొంత సినిమా పనులను పక్కన పెట్టేశాడు త్రివిక్రమ్. ‘భీమ్లా నాయక్’ సినిమా సెట్ లో త్రివిక్రమ్ ఉండాల్సిందేనని పవన్ పట్టుబట్టాడు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన చాలా వ్యవహారాలను త్రివిక్రమ్ సెటిల్ చేస్తుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కి అప్పగించినట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ని మళ్లీ ట్రాక్ లో పెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు. ప్రస్తుతం ఓటీటీల డిమాండ్ బాగా పెరిగింది. వాటికోసం చిన్న సినిమాలు చేయాలని.. అలానే రామ్ చరణ్ తో ఓ భారీ సినిమాల చేయాలని.. నితిన్ తో మరో సినిమా ఇలా ఇవన్నీ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారు పవన్. కానీ అవి ముందుకు కదలడం లేదు. నటుడిగా పవన్ బిజీగా ఉండడంతో నిర్మాణ బాధ్యతలు చూసుకునేవారు లేరు.

ఇప్పుడు ఆ బాధ్యతలను కూడా త్రివిక్రమ్ చేతుల్లో పెట్టారట. కథ వినడంతో పాటు దర్శకులను సెలెక్ట్ చేయడం, ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే పనులన్నీ త్రివిక్రమ్ చూసుకోవాల్సి ఉంటుంది. మహేష్ బాబు సినిమాను మొదలుపెట్టకముందే.. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కోసం ఓ కథను సెట్ చేసి.. షూటింగ్ మొదలుపెట్టించాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారు. మరి ఆ ప్రాజెక్ట్ లో త్రివిక్రమ్ కి వాటా ఉంటుందా..? లేక పవన్ సోలోగా సినిమాను నిర్మిస్తారా అనేది చూడాలి!

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

32 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

38 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

52 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago