బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ అలీబాగ్ ఏరియాలో రూ.22 కోట్ల విలువైన బంగ్లాను కొన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 13న ఈ ప్రాపర్టీను రిజిస్టర్ చేయించారు. రూ.1.32 కోట్లను స్టాంప్ డ్యూటీగా చెల్లించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ బయటకొచ్చింది. సౌత్ ముంబైలోని కోస్టల్ టౌన్ అలీబాగ్ లో ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ స్టార్లకు ఆస్తులు ఉన్నాయి. సంపన్న కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ఈ ఏరియాలో బంగ్లాలను కొనగలరు.
ఇప్పుడు దీపికా, రణవీర్ కు కూడా ఈ కొనుగోలుతో అక్కడ అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం దీపికా, రణవీర్ కలిసి ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు. 2010లో దీపికా ఈ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ జంట కొత్తిల్లు కొనేసింది. వీరి కొత్త బంగ్లా ఏకంగా 2.25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందట. అందులో కొంత నిర్మాణం జరిగిన ఏరియా కాగా.. మిగిలిందని ఖాళీ ప్రదేశమని తెలుస్తోంది.
బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్ గా మారారు ఈ భార్యాభర్తలు. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో, హీరోయిన్లుగా వీరు రికార్డులు సృష్టిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన ’83’ సినిమా ఎప్పుడో పూర్తయింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతోంది. ప్రస్తుతం రణవీర్ ‘సర్కస్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో దీపికా క్యామియో రోల్ పోషిస్తుంది. మరోపక్క షారుఖ్ నటిస్తోన్న ‘పఠాన్’ సినిమాలో దీపికా హీరోయిన్ గా నటిస్తోంది.
This post was last modified on September 15, 2021 2:01 pm
ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఏదో ఫ్లోలో కొన్నిసార్లు నోరు జారుతుంటారు. కొందరిని హర్ట్ చేసేలా మాట్లాడతారు. ఐతే తాము…
ఏపీలో రాజకీయాలు ఊపందుకున్న నేపథ్యంలో సంచలనాలు కూడా అదే రేంజ్లో తెరమీదికి వస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన పార్టీలన్నీ కూడా.. పెద్ద…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే బూతులు. మంత్రులూ, ఎమ్మెల్యేలు తేడా లేకుండా విపక్ష నాయకుల మీద బూతులతో విరుచుకుపడే తీరు రాజకీయాలంటేనే…
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేగింది. వైసీపీ వర్సెస్ బీజేపీ కార్యకర్త ల మధ్య…
నారా రోహిత్ చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా ప్రతినిధి-2. ఒకప్పుడు తీరిక లేకుండా సినిమాలు చేస్తూ ఒకే సమయంలో…
రాయ్ బరేలీ నుండి పోటీకి దిగుతుంది అనుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ ఎందుకు పోటీ చేయలేదు…