బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ అలీబాగ్ ఏరియాలో రూ.22 కోట్ల విలువైన బంగ్లాను కొన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 13న ఈ ప్రాపర్టీను రిజిస్టర్ చేయించారు. రూ.1.32 కోట్లను స్టాంప్ డ్యూటీగా చెల్లించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ బయటకొచ్చింది. సౌత్ ముంబైలోని కోస్టల్ టౌన్ అలీబాగ్ లో ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ స్టార్లకు ఆస్తులు ఉన్నాయి. సంపన్న కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ఈ ఏరియాలో బంగ్లాలను కొనగలరు.
ఇప్పుడు దీపికా, రణవీర్ కు కూడా ఈ కొనుగోలుతో అక్కడ అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం దీపికా, రణవీర్ కలిసి ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు. 2010లో దీపికా ఈ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ జంట కొత్తిల్లు కొనేసింది. వీరి కొత్త బంగ్లా ఏకంగా 2.25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందట. అందులో కొంత నిర్మాణం జరిగిన ఏరియా కాగా.. మిగిలిందని ఖాళీ ప్రదేశమని తెలుస్తోంది.
బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్ గా మారారు ఈ భార్యాభర్తలు. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో, హీరోయిన్లుగా వీరు రికార్డులు సృష్టిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన ’83’ సినిమా ఎప్పుడో పూర్తయింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతోంది. ప్రస్తుతం రణవీర్ ‘సర్కస్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో దీపికా క్యామియో రోల్ పోషిస్తుంది. మరోపక్క షారుఖ్ నటిస్తోన్న ‘పఠాన్’ సినిమాలో దీపికా హీరోయిన్ గా నటిస్తోంది.
This post was last modified on September 15, 2021 2:01 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…