బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ అలీబాగ్ ఏరియాలో రూ.22 కోట్ల విలువైన బంగ్లాను కొన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 13న ఈ ప్రాపర్టీను రిజిస్టర్ చేయించారు. రూ.1.32 కోట్లను స్టాంప్ డ్యూటీగా చెల్లించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ బయటకొచ్చింది. సౌత్ ముంబైలోని కోస్టల్ టౌన్ అలీబాగ్ లో ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ స్టార్లకు ఆస్తులు ఉన్నాయి. సంపన్న కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ఈ ఏరియాలో బంగ్లాలను కొనగలరు.
ఇప్పుడు దీపికా, రణవీర్ కు కూడా ఈ కొనుగోలుతో అక్కడ అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం దీపికా, రణవీర్ కలిసి ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు. 2010లో దీపికా ఈ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ జంట కొత్తిల్లు కొనేసింది. వీరి కొత్త బంగ్లా ఏకంగా 2.25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందట. అందులో కొంత నిర్మాణం జరిగిన ఏరియా కాగా.. మిగిలిందని ఖాళీ ప్రదేశమని తెలుస్తోంది.
బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్ గా మారారు ఈ భార్యాభర్తలు. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో, హీరోయిన్లుగా వీరు రికార్డులు సృష్టిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన ’83’ సినిమా ఎప్పుడో పూర్తయింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతోంది. ప్రస్తుతం రణవీర్ ‘సర్కస్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో దీపికా క్యామియో రోల్ పోషిస్తుంది. మరోపక్క షారుఖ్ నటిస్తోన్న ‘పఠాన్’ సినిమాలో దీపికా హీరోయిన్ గా నటిస్తోంది.
This post was last modified on September 15, 2021 2:01 pm
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి…
తమిళనాడు రాజకీయాల్లో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. సభా వేదికపై ఉన్న 98 ఏళ్ల…