Movie News

కాస్ట్లీ బంగ్లా కొన్న స్టార్ కపుల్!

బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ అలీబాగ్ ఏరియాలో రూ.22 కోట్ల విలువైన బంగ్లాను కొన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 13న ఈ ప్రాపర్టీను రిజిస్టర్ చేయించారు. రూ.1.32 కోట్లను స్టాంప్ డ్యూటీగా చెల్లించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ బయటకొచ్చింది. సౌత్ ముంబైలోని కోస్టల్ టౌన్ అలీబాగ్ లో ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ స్టార్లకు ఆస్తులు ఉన్నాయి. సంపన్న కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ఈ ఏరియాలో బంగ్లాలను కొనగలరు.

ఇప్పుడు దీపికా, రణవీర్ కు కూడా ఈ కొనుగోలుతో అక్కడ అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం దీపికా, రణవీర్ కలిసి ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు. 2010లో దీపికా ఈ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ జంట కొత్తిల్లు కొనేసింది. వీరి కొత్త బంగ్లా ఏకంగా 2.25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందట. అందులో కొంత నిర్మాణం జరిగిన ఏరియా కాగా.. మిగిలిందని ఖాళీ ప్రదేశమని తెలుస్తోంది.

బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్ గా మారారు ఈ భార్యాభర్తలు. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో, హీరోయిన్లుగా వీరు రికార్డులు సృష్టిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన ’83’ సినిమా ఎప్పుడో పూర్తయింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతోంది. ప్రస్తుతం రణవీర్ ‘సర్కస్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో దీపికా క్యామియో రోల్ పోషిస్తుంది. మరోపక్క షారుఖ్ నటిస్తోన్న ‘పఠాన్’ సినిమాలో దీపికా హీరోయిన్ గా నటిస్తోంది.

This post was last modified on September 15, 2021 2:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

7 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

7 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

8 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

9 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

10 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

11 hours ago