Movie News

పవన్ డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్!

తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘పంజా’ అనే సినిమాను తెరకెక్కించారు దర్శకుడు విష్ణవర్ధన్. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో దర్శకుడి మరో ఛాన్స్ రాలేదు. దీంతో టాలీవుడ్ కి దూరమయ్యాడు. ఇప్పుడు మరోసారి ఆయన టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. రీసెంట్ గా విష్ణువర్ధన్ బాలీవుడ్ లో ‘షేర్షా’ అనే సినిమాను తెరకెక్కించారు. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో తెలుగు సినిమా నిర్మాతల దృష్టి విష్ణువర్ధన్ పై పడింది.

అతడు ‘పంజా’ అనే భారీ డిజాస్టర్ సినిమా ఇచ్చాడని మర్చిపోయారు. ‘షేర్షా’ లాంటి హిట్టు సినిమా తీయడంతో మరోసారి ఆయన్ను టాలీవుడ్ కి తీసుకురావాలనుకుంటున్నారు. హీరోని కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తో విష్ణువర్ధన్ సినిమా చేయబోతున్నారట. అయితే నిర్మాత ఎవరనేది మాత్రం ఇంకా డిస్కషన్ జరుగుతోంది.

నిజానికి విష్ణువర్ధన్ దగ్గర ఓ నిర్మాతకు సంబంధించిన పాత అడ్వాన్స్ ఉంది. వైష్ణవ్ తేజ్ డేట్ లు వేరే నిర్మాత దగ్గర ఉన్నాయి. దానికి వలన నిర్మాతగా ఎవరు ఫిక్స్ అవుతారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయం పక్కన పెడితే.. ‘పంజా’ డైరెక్టర్ మళ్లీ ఇంతకాలానికి తెలుగులో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరి ఈసారైనా ఇండస్ట్రీ హిట్ అందుకుంటారేమో చూడాలి!

This post was last modified on September 14, 2021 12:07 pm

Share

Recent Posts

పిఠాపురంలో ఎవ్వ‌రికి ఛాన్స్ లేద‌బ్బా.. !

సామాజికంగా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌రంగా.. నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క‌…

1 hour ago

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

2 hours ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

2 hours ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

3 hours ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

4 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

4 hours ago