మన ప్రేక్షకుల అభిరుచి ఎంతగా మారినా సరే.. పాటలు, ఫైట్ల విషయంలో మోజు మాత్రం తగ్గదు. ఇప్పటికీ పాటలు.. ఫైట్ల కోసం సినిమాలు చూసే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వాటిని ఎంత కొత్తగా తీర్చిదిద్దుతారన్నది కీలకం. గత కొన్నేళ్లలో వచ్చిన సినిమాల్లో యాక్షన్ ఘట్టాల విషయంలో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచిన చిత్రంగా కేజీఎఫ్ను చెప్పుకోవాలి.
ఈ సినిమాలో యాక్షన్ సీన్లను దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఆ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఛత్రపతి గుర్తుకొచ్చింది. అంతే కాక ఈ సినిమాలో ప్రభాస్ నటించి ఉంటే ఎలా ఉండేదన్న ఊహ కూడా చాలామందిలో కలిగింది. ఐతే ప్రశాంత్-ప్రభాస్ కలయిక కోసం ఎక్కువగా ఎదురు చూడాల్సిన అవసరం లేకపోయింది.
కేజీఎఫ్ః చాప్టర్-2 పూర్తి కాగానే ప్రభాస్తో జట్టు కట్టేశాడు ప్రశాంత్. వీరి కలయికలో సలార్ సినిమా ఈ ఏడాది ఆరంభంలోనే మొదలైన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుని.. మూడో షెడ్యూల్లోకి అడుగు పెడుతోంది సలార్. ఐతే ఈ మూడు షెడ్యూళ్లనూ పూర్తిగా యాక్షన్ ఘట్టాలకే కేటాయించారట. తొలి రెండు షెడ్యూళ్లలో ఫైట్లు మాత్రమే తీసిన ప్రశాంత్.. ఇప్పుడు కొత్త షెడ్యూల్నూ యాక్షన్ సీన్లే తీస్తున్నాడట.
సినిమాలో అత్యంత కీలకమైనవి, కష్టంతో కూడుకున్నవి యాక్షన్ ఘట్టాలేనట. అందుకే వాటినే ముందు తీసేసి.. మిగతా టాకీ పార్ట్ తర్వాత తీసేలా ప్లాన్ చేసుకున్నాడట. ప్రభాస్ ఈ సన్నివేశాల కోసం చాలానే కష్టపడుతున్నట్లు సమాచారం. ప్రశాంత్ సినిమాలో ప్రభాస్ యాక్షన్ ఘట్టాలు ఎలా ఉంటాయో అన్న ఊహే ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తోంది. మరి ఈ అంచనాలను ప్రశాంత్-ప్రభాస్ ఏమేర అందుకుంటారో చూడాలి.
This post was last modified on September 13, 2021 10:12 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…