మన ప్రేక్షకుల అభిరుచి ఎంతగా మారినా సరే.. పాటలు, ఫైట్ల విషయంలో మోజు మాత్రం తగ్గదు. ఇప్పటికీ పాటలు.. ఫైట్ల కోసం సినిమాలు చూసే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వాటిని ఎంత కొత్తగా తీర్చిదిద్దుతారన్నది కీలకం. గత కొన్నేళ్లలో వచ్చిన సినిమాల్లో యాక్షన్ ఘట్టాల విషయంలో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచిన చిత్రంగా కేజీఎఫ్ను చెప్పుకోవాలి.
ఈ సినిమాలో యాక్షన్ సీన్లను దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఆ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఛత్రపతి గుర్తుకొచ్చింది. అంతే కాక ఈ సినిమాలో ప్రభాస్ నటించి ఉంటే ఎలా ఉండేదన్న ఊహ కూడా చాలామందిలో కలిగింది. ఐతే ప్రశాంత్-ప్రభాస్ కలయిక కోసం ఎక్కువగా ఎదురు చూడాల్సిన అవసరం లేకపోయింది.
కేజీఎఫ్ః చాప్టర్-2 పూర్తి కాగానే ప్రభాస్తో జట్టు కట్టేశాడు ప్రశాంత్. వీరి కలయికలో సలార్ సినిమా ఈ ఏడాది ఆరంభంలోనే మొదలైన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుని.. మూడో షెడ్యూల్లోకి అడుగు పెడుతోంది సలార్. ఐతే ఈ మూడు షెడ్యూళ్లనూ పూర్తిగా యాక్షన్ ఘట్టాలకే కేటాయించారట. తొలి రెండు షెడ్యూళ్లలో ఫైట్లు మాత్రమే తీసిన ప్రశాంత్.. ఇప్పుడు కొత్త షెడ్యూల్నూ యాక్షన్ సీన్లే తీస్తున్నాడట.
సినిమాలో అత్యంత కీలకమైనవి, కష్టంతో కూడుకున్నవి యాక్షన్ ఘట్టాలేనట. అందుకే వాటినే ముందు తీసేసి.. మిగతా టాకీ పార్ట్ తర్వాత తీసేలా ప్లాన్ చేసుకున్నాడట. ప్రభాస్ ఈ సన్నివేశాల కోసం చాలానే కష్టపడుతున్నట్లు సమాచారం. ప్రశాంత్ సినిమాలో ప్రభాస్ యాక్షన్ ఘట్టాలు ఎలా ఉంటాయో అన్న ఊహే ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తోంది. మరి ఈ అంచనాలను ప్రశాంత్-ప్రభాస్ ఏమేర అందుకుంటారో చూడాలి.
This post was last modified on September 13, 2021 10:12 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…