Movie News

‘మా’ భవనం అసలెందుకు అమ్మేశారు?


మూవీ ఆర్టిస్ట్ట్ అసోసియేషన్ (మా)కు సొంత భవనం లేకపోవడం మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. మహా మహులు ఉన్న ఈ సంఘం కనీసం సొంతంగా ఒక భవనం కట్టుకోకపోవడమో.. లేదా కొనుక్కోకపోవడమో ఎందుకు చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐతే నిజానికి ‘మా’కు ఎప్పుడూ భవనం లేకుండా ఏమీ లేదు. గతంలో ‘మా’కు ఒక సొంత భవనం కాదు కానీ.. ఒక ఫ్లాట్ ఉండేది. అదొక పెంట్ హౌస్. రూ.70 లక్షలకు పైగా ఖర్చు చేసి ఆ ఇంటిని కొన్నారట.

ఐతే తర్వాత దాన్ని తక్కువ ధరకు అమ్మేయడం వివాదాస్పదం అయింది. దీని గురించి ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో సీనియర్ నటుడు మోహన్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కువ మొత్తానికి బిల్డింగ్ కొని.. తర్వాత దాన్ని తక్కువ ధరకు అమ్మేయడం ఏంటంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీని మీద మరింతగా వివాదం రాజుకోవడం.. టీవీ చర్చల్లో దీని గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుతుండటంతో.. ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా లైన్లోకి వచ్చారు. శివాజీ రాజా కార్యదర్శిగా ఉన్నపుడే బిల్డింగ్ అమ్మేయడం జరిగిందని ఒకప్పటి ‘మా’ అధ్యక్షుడు నాగబాబు పేర్కొనడంతో శివాజీ రాజా దీనిపై వివరణ ఇచ్చారు. రూ.70 లక్షలకు పైగా ఖర్చు చేసి ‘మా’ కోసం బిల్డింగ్ తీసుకోవడం వాస్తవమే అని.. తర్వాత దాని మరమ్మతులకు కొన్ని లక్షలు ఖర్చయ్యాయని.. కానీ ఆ తర్వాత ఆ భవనంతో సమస్యలు తలెత్తాయని శివాజీ రాజా చెప్పాడు.

ఆ భవనం ప్రైమ్ ఏరియాలో లేదని.. కింద మురుగు కాలువ ఉండటం సమస్యగా మారిందని.. ఖాళీగా ఉన్నపుడు రెంట్‌కు ఇస్తే సరైన ఆదాయం కూడా రాలేదని.. దీని వల్ల పెద్దగా ప్రయోజనం లేదని భావించి మురళీ మోహన్ సహా ‘మా’లోని కీలక వ్యక్తుల సలహా తీసుకుని తక్కువ రేటుకు అమ్మేసిన మాట వాస్తవమే అని.. ఐతే అప్పుడు ఈ నిర్ణయాన్ని అభినందించారని.. దీని మీద ఇప్పుడు వివాదం చేయడం తగదని శివాజీ రాజా పేర్కొన్నారు.

Satya

Recent Posts

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

6 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

33 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

33 minutes ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

1 hour ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

1 hour ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

2 hours ago