పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి దర్శకుడు హరీష్ శంకర్ ఎప్పుడు మాట్లాడినా అభిమానులకు గూస్ బంప్స్ వచ్చే మాటలే చెబుతుంటాడు. పవర్ వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్న సమయంలో ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఆయన కెరీర్లో మరపురాని విజయాన్ని అందించి అభిమానులను మురిపించిన హరీష్.. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ పవన్తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ముందు నుంచి చాలా ఊరిస్తూ వస్తున్నాడు హరీష్.
పవన్కు తాను ఒక వీరాభిమానిని అని.. ఒక అభిమాని ఎలా చూడాలనుకుంటాడో అలాగే పవన్ను తన కొత్త సినిమాలో చూపించబోతున్నానని ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు హరీష్. తాజాగా గురువారం పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని పెట్టిన ట్విట్టర్ స్పేస్లో పాల్గొన్న హరీష్.. తమ కలయికలో రానున్న సినిమా గురించి అభిమానులు మరింత ఎగ్జైట్ అయ్యే మాటలు చెప్పాడు.
ఒకప్పుడు ‘గబ్బర్ సింగ్’ చేస్తున్నపుడు అభిమానులు పవన్ ఈసారి పెద్ద హిట్టు కొట్టి తీరాలని చాలా బలంగా కోరుకున్నారని.. అన్నిటికంటే సంకల్ప బలం గొప్పది అన్న మాటను రుజువు చేస్తూ ఆ చిత్రం ఘనవిజయం సాధించిందని.. ఇప్పుడు కూడా తమ కలయికలో రానున్న సినిమా గురించి ఫ్యాన్స్ అంతే ఆశలతో, అంచనాలతో ఉన్నారని హరీష్ చెప్పాడు.
అభిమానులు ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా సరే.. వాటిని అందుకునే దిశగా బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి తాను ప్రయత్నిస్తున్నానని హరీష్ చెప్పాడు. స్క్రిప్టు చాలా బాగా వచ్చిందన్న హరీష్.. ఈ సినిమా చూసి పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని థియేటర్ల నుంచి బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశాడు. సినిమా ఇంకా మొదలు కాలేదు కాబట్టి ఎక్కువ విశేషాలు రివీల్ చేయకూడదని ఆగుతున్నామని.. అభిమానులతో పంచుకోవడానికి చాలా ఉందని.. స్టెప్ బై స్టెప్ ప్రమోషన్లు చేద్దామని ఆగుతున్నామని హరీష్ తెలిపాడు. పోస్టర్లో అన్నట్లుగానే ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉండదని.. పవన్ వ్యక్తిగత ఇమేజిని కూడా దృష్టిలో ఉంచుకుని సందేశం కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని హరీష్ సంకేతాలు ఇచ్చాడు.
This post was last modified on September 3, 2021 1:05 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…