ఉన్నట్లుండి సమంత వెర్సస్ పూజా హెగ్డే ఇష్యూ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. వీళ్లిద్దరి మధ్య అసలు విభేదాలు పొడసూపుతాయని ఎవ్వరూ ఊహించలేదు. టీవీలో ‘మజిలీ’ సినిమా చూస్తూ సమంత ఏమంత అందంగా లేదంటూ పూజా ఇన్స్టాగ్రామ్ పోస్టులో కామెంట్ చేసిందన్నది ఆమె మీద వచ్చిన ఆరోపణ. ఐతే తన అకౌంట్ను ఎవరో హ్యాక్ చేసి ఇలా కామెంట్ పెట్టారని పూజా వివరణ ఇచ్చింది. ఆ పోస్టును డెలీట్ చేసింది. అంతటితో వ్యవహారం సద్దుమణిగిందనే అనుకున్నారంతా. కానీ ఇది హ్యాకర్ల పని కాదని.. పూజానే కామెంట్ పెట్టి విమర్శలు రావడంతో డెలీట్ చేసిందని సమంత ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఐతే ఈ ఇష్యూను సమంత, ఆమె సన్నిహితులు సీరియస్గా తీసుకుని కౌంటర్లు వేస్తుండటంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగేలా కనిపిస్తోంది.
సమంత.. ఆమె స్నేహితురాళ్లయిన దర్శకురాలు నందిని రెడ్డి, గాయని చిన్మయి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. వీళ్ల మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణల తాలూకు స్క్రీన్ షాట్లు ప్రముఖంగా దర్శనమిస్తున్నాయి. వాళ్లు పూజా మీద ముగ్గురూ పరోక్షంగా కౌంటర్లు వేశారు. ముందుగా నందిని రెడ్డి.. ‘వాట్ ద హ్యాక్.. లవ్ యు టూ’ అంటూ సమంతనుద్దేశించి ట్వీట్ వేసింది. ఇక్కడ హ్యాక్ అనే పదం వాడటం పూజాకు కౌంటర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తర్వాత చిన్మయి లైన్లోకి వచ్చి.. ‘‘ప్లీస్ లవ్ మి టూ.. ఐయామ్ నీడీ.. పి.ఎస్: మై అకౌంట్ ఈజ్ నాట్ హ్యాక్డ్’ అంటూ మెసేజ్ పెట్టింది.
చివర్లో సమంత.. ‘‘జోక్స్ ఆన్ హ్యాకింగ్ ఆర్ సస్పెండెడ్ అంటిల్ ఫర్దర్ నోటీస్’’ అంటూ పంచ్ వేసింది. వీళ్లు ముగ్గురూ ఇంకొన్ని మెసేజ్లు కూడా పెట్టారు. అన్నింట్లోనూ పూజా ‘హ్యాకింగ్’ స్టేట్మెంట్ మీద కౌంటర్లు ఉన్నాయి. దీన్ని బట్టి వాళ్లందరూ పూజా కావాలనే పోస్టు పెట్టిందని భావిస్తున్నట్లుగా అనిపిస్తోంది. తెలుగులో పూజా ఫస్ట్ రిలీజ్ ‘ఒక లైలా కోసం’లో చైతూ హీరో కాగా.. అఖిల్ కొత్త చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో ఆమే కథానాయిక అనే విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.
This post was last modified on May 29, 2020 2:10 am
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…