సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే టాలీవుడ్ నటుల్లో రాహుల్ రామకృష్ణ ఒకడు. ఏదో సినిమా కబుర్లు చెప్పి ఊరుకోకుండా చాలా స్వేచ్ఛగా తన భావాలు వెల్లడిస్తుంటాడు రాహుల్. చాలా మంది సినిమా వాళ్లు సోషల్ మీడియాలో రాజకీయాలు, వివాదాస్పద అంశాల జోలికి అస్సలు వెళ్లరు కానీ.. రాహుల్ చాలా దూకుడుగా వివిధ అంశాల మీద కామెంట్లు కూడా చేస్తుంటాడు.
సినిమాల విషయంలోనూ టెంప్లేంట్ స్టయిల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా కామెంట్లు, పోస్టులు పెడుతుంటాడు. ఈ క్రమంలోనే తాను ప్రధాన పాత్ర పోషించిన ‘నెట్’ వెబ్ ఫిలిం గురించి రాహుల్ ఒక కామెంట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ‘‘మా సినిమాకి గు..లో దమ్ముంది’’ అని రాహుల్ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. దీనిపై నెటిజన్లు చాలామంది విమర్శలు గుప్పించారు.
ట్విట్టర్లో బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయాలని.. యూత్ను ప్రభావితం చేసే రాహుల్ లాంటి వాళ్లు ఇలా బూతులు మాట్లాడి తప్పుదోవ పట్టించుకూడదని కామెంట్లు చేశారు. నెటిజన్లు ఓ రేంజిలో తనపై ఎటాక్ చేయడంతో రాహుల్ స్పందించాడు. అతనేమీ ట్వీట్ డెలీట్ చేయలేదు. తన కామెంట్ పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. తనపై విమర్శలు చేసిన వాళ్లకు చురుక్కుమనేలా ఇంకో ట్వీట్ వేశాడు. ‘‘అంటే ట్విట్టర్లో అందరూ పతిత్తులే అన్నమాట’’ అని అతను కామెంట్ చేయడం విశేషం.
రాహుల్ దమ్మున్న కామెంట్ పెట్టాడని ప్రశంసలు కురిపిస్తే.. మళ్లీ అతణ్ని ఎటాక్ చేసే వాళ్లు తమ శైలిలోనే కామెంట్లు పెట్టారు. ఐతే ఈ కామెంట్తో ‘నెట్’కు రావాల్సిన పబ్లిసిటీ అయితే వచ్చేసింది. మా సినిమా బాగుంటుంది చూడండి.. అంటే ఈ రోజుల్లో జనాలు ఏం పట్టించుకుంటారు? ఇలా ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేస్తే ఒక డిస్కషన్ ఉంటుంది. సినిమాకు కావాల్సిన పబ్లిసిటీ వస్తుంది. ఆ విషయంలో రాహుల్ విజయవంతం అయినట్లే.
This post was last modified on August 30, 2021 6:05 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…