తెలుగు సినిమాల్లో పరభాషా నటుల ఆధిపత్యం గురించి కోట శ్రీనివాసరావు లాంటి పెద్దోళ్లు అప్పుడప్పుడూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఫలానా పాత్రకు ఫలానా నటుడే సూటవుతాడు అనుకున్నపుడు వేరే భాషల నుంచి మంచి ఆర్టిస్టులను తెచ్చుకోవడంలో తప్పు లేదు కానీ.. ఇక్కడ మనవాళ్లు బ్రహ్మాండంగా నటించగల పాత్రలను కూడా పర భాషా నటులతో చేయించడాన్ని కోట లాంటి వాళ్లు తప్పుబడుతుంటారు.
ఐతే మన దగ్గరున్న మంచి నటీనటులను ఉపయోగించుకోవాలని దర్శకులు గట్టిగా అనుకుంటే తప్ప మన వాళ్లకు సరైన న్యాయం జరగదు. ఐతే పలాస 1976 సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి.. ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కరుణ్ కుమార్ మాత్రం ఈ విషయంలో చాలా పట్టుదలతోనే ఉన్నట్లున్నారు. ఇప్పటిదాకా చేసిన రెండు సినిమాల్లో తెలుగు ఆర్టిస్టులకు పెద్ద పీట వేశారాయన. ఈ రెండు చిత్రాల్లో హీరోయిన్లుగా నటించిన నక్షత్ర, ఆనంది తెలుగమ్మాయిలే. అలాగే విలన్ పాత్రలూ తెలుగు వాళ్లతోనే చేయించారు.
ఇక ముందు కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తానని.. తన సినిమాలో తెలుగు నటీనటులతోనే తెరకెక్కుతాయని ఆయన డేరింగ్ స్టేట్మెట్ ఇవ్వడం విశేషం. శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాన్ని 100 శాతం తెలుగు నటీనటులతోనే మొదలుపెట్టామని.. ఐతే ఇందులో ఒక విలన్గా నటించిన ఆర్టిస్టుకి కరోనా రావడంతో అతడి స్థానాన్ని వేరే భాషకు చెందిన నటుడితో భర్తీ చేయాల్సి వచ్చిందని, ఇప్పటిదాకా తన చిత్రాల్లో 99 శాతం తెలుగు ఆర్టిస్టులే నటించారని కరుణ్ కుమార్ అన్నారు.
ఇకముందు కూడా తెలుగు వాళ్లతోనే సినిమాలు తీస్తానని ఆయన ప్రకటించారు. మామూలుగా తూర్పుగోదావరి జిల్లా నేపథ్యంలో సినిమా అంటే ఒక టెంప్లేట్ స్టయిల్లో ఉండేవని.. ఐతే శ్రీదేవి సోడా సెంటర్లో అలా కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే కమ్యూనిటీస్ వాళ్ల మధ్య ఉండే భావోద్వేగాల మధ్య కథ నడుస్తుందని.. ఆ కథలో భాగంగా ఈ ప్రేమ కథ ఉంటుందని.. కానీ తూర్పు గోదావరి వారిలో కూడా అన్ని రకాల ఎమోషన్లు, భావోద్వేగాలు, వివక్ష, రాజకీయాలు, ఘోరమైన ఉదంతాలు ఉంటాయని ఈ సినిమాలో చూపించినట్లు కరుణ్ కుమార్ వెల్లడించాడు.
This post was last modified on August 26, 2021 11:02 am
పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…
మనకు డెవిల్ అంటే ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ సినిమా గుర్తొస్తుంది కానీ ఇటీవలే కన్నడలో విడుదలైన భారీ…
మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఫలితాన్ని విశ్వంభర క్యాష్ చేసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం అభిమానులను బాధ…
గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు…
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సువార్తీకుడు కేఏ పాల్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ…
తమ్ముడు తమ్ముడే.. రాజకీయం రాజకీయమే.. బీజేపీ విషయంలో ఇది అక్షరాలా నిజం. తనకు అవకాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…