తెలుగు సినిమాల్లో పరభాషా నటుల ఆధిపత్యం గురించి కోట శ్రీనివాసరావు లాంటి పెద్దోళ్లు అప్పుడప్పుడూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఫలానా పాత్రకు ఫలానా నటుడే సూటవుతాడు అనుకున్నపుడు వేరే భాషల నుంచి మంచి ఆర్టిస్టులను తెచ్చుకోవడంలో తప్పు లేదు కానీ.. ఇక్కడ మనవాళ్లు బ్రహ్మాండంగా నటించగల పాత్రలను కూడా పర భాషా నటులతో చేయించడాన్ని కోట లాంటి వాళ్లు తప్పుబడుతుంటారు.
ఐతే మన దగ్గరున్న మంచి నటీనటులను ఉపయోగించుకోవాలని దర్శకులు గట్టిగా అనుకుంటే తప్ప మన వాళ్లకు సరైన న్యాయం జరగదు. ఐతే పలాస 1976 సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి.. ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కరుణ్ కుమార్ మాత్రం ఈ విషయంలో చాలా పట్టుదలతోనే ఉన్నట్లున్నారు. ఇప్పటిదాకా చేసిన రెండు సినిమాల్లో తెలుగు ఆర్టిస్టులకు పెద్ద పీట వేశారాయన. ఈ రెండు చిత్రాల్లో హీరోయిన్లుగా నటించిన నక్షత్ర, ఆనంది తెలుగమ్మాయిలే. అలాగే విలన్ పాత్రలూ తెలుగు వాళ్లతోనే చేయించారు.
ఇక ముందు కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తానని.. తన సినిమాలో తెలుగు నటీనటులతోనే తెరకెక్కుతాయని ఆయన డేరింగ్ స్టేట్మెట్ ఇవ్వడం విశేషం. శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాన్ని 100 శాతం తెలుగు నటీనటులతోనే మొదలుపెట్టామని.. ఐతే ఇందులో ఒక విలన్గా నటించిన ఆర్టిస్టుకి కరోనా రావడంతో అతడి స్థానాన్ని వేరే భాషకు చెందిన నటుడితో భర్తీ చేయాల్సి వచ్చిందని, ఇప్పటిదాకా తన చిత్రాల్లో 99 శాతం తెలుగు ఆర్టిస్టులే నటించారని కరుణ్ కుమార్ అన్నారు.
ఇకముందు కూడా తెలుగు వాళ్లతోనే సినిమాలు తీస్తానని ఆయన ప్రకటించారు. మామూలుగా తూర్పుగోదావరి జిల్లా నేపథ్యంలో సినిమా అంటే ఒక టెంప్లేట్ స్టయిల్లో ఉండేవని.. ఐతే శ్రీదేవి సోడా సెంటర్లో అలా కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే కమ్యూనిటీస్ వాళ్ల మధ్య ఉండే భావోద్వేగాల మధ్య కథ నడుస్తుందని.. ఆ కథలో భాగంగా ఈ ప్రేమ కథ ఉంటుందని.. కానీ తూర్పు గోదావరి వారిలో కూడా అన్ని రకాల ఎమోషన్లు, భావోద్వేగాలు, వివక్ష, రాజకీయాలు, ఘోరమైన ఉదంతాలు ఉంటాయని ఈ సినిమాలో చూపించినట్లు కరుణ్ కుమార్ వెల్లడించాడు.
This post was last modified on August 26, 2021 11:02 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…