ఐశ్వర్య రాజేష్.. సినిమాల్లో అడుగు పెట్టింది, ఒక స్థాయి అందుకుంది కోలీవుడ్లోనే అయినా.. ఈమె అచ్చమైన తెలుగమ్మాయి. నిన్నటి తరం నటుడు రాజేష్ తనయురాలే ఈ ఐశ్వర్య. ఐతే తండ్రి పేరున్న నటుడే అయినా సరే.. ఐశ్వర్య జీవితం పూల పాన్పు కాదు. ఐశ్వర్యకు ఎనిమిదేళ్ల వయసుండగానే రాజేష్ అనారోగ్యంతో చనిపోవడం పెద్ద విషాదం.
కుటుంబం కోసం రాజేష్ ఎలాంటి ఆస్తిపాస్తులూ మిగల్చలేదట. రాజేష్ సతీమణికి అసలు చదువే రాదట. ఇలాంటి సమయంలో కుటుంబ పోషణ అంతా ఆమెపై పడితే.. వీరి కుటుంబం ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, విషాదాల్ని తట్టుకుని నిలబడిందట. తాజాగా టెడెక్స్ వేదికగా ఐశ్వర్య తన జీవిత అనుభవాల్ని పంచుకుంది. అందులో ఆమె చెప్పిన విషయాలు తెలుసుకుంటే కన్నీళ్లు రాకమానవు.
తండ్రి మరణానంతరం తమ పరిస్థితి దిగువ మధ్య తరగతి స్థాయికి పడిపోయిందని.. ఆ సమయంలో తన తల్లి చీరలు తెచ్చి అమ్మి కొంత కాలం కుటుంబాన్ని పోషించిందని.. తర్వాత ఎల్ఐసీ ఏజెంట్గా మారిందని ఐశ్వర్య చెప్పింది. తన అన్నలు కాస్త పెద్ద వాళ్లయి కుటుంబ బాధ్యత తీసుకుంటున్న సమయంలో రెండేళ్ల వ్యవధిలో తమ కుటుంబంలో మరో రెండు విషాదాలు చోటు చేసుకున్నట్లు ఐశ్వర్య వెల్లడించింది.
తనకు 13 ఏళ్ల వయసుండగా.. తన పెద్దన్న చనిపోయాడని.. ఓ అమ్మాయిని ప్రేమించి గొడవ జరిగాక అతను చనిపోయాడని.. అతడి మరణం మిస్టరీగా ఉండిపోయిందని ఆమె తెలిపింది. ఇక తన రెండో అన్న హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదివి ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడని.. 40 వేలు జీతమని.. ఇక తమ కష్టాలు తీరాయని అనుకుంటే అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఐశ్వర్య వెల్లడించింది.
ఇలా కొన్నేళ్ల వ్యవధిలో ముగ్గురు కుటుంబ సభ్యుల్ని కోల్పోయి తమ కుటుంబం కుంగిపోయిందని.. తర్వాత తాను ఇంటర్మీడియట్ చదువుతూనే పార్ట్ టైం ఉద్యోగం చేయడం మొదలుపెట్టానని.. తర్వాత టీవీ సీరియల్స్లో, ఆపై సినిమాల్లో చాలా కష్టపడి.. ఎన్నో అవమానాలు ఎదుర్కొని అవకాశాలు సంపాదించి.. చివరికి ఇప్పుడు నిలదొక్కుకున్నానని ఐశ్వర్య వెల్లడించింది.
This post was last modified on May 28, 2020 9:10 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…