Movie News

ఆ హీరోయిన్ జీవితంలో అన్ని కష్టాలా?

ఐశ్వర్య రాజేష్.. సినిమాల్లో అడుగు పెట్టింది, ఒక స్థాయి అందుకుంది కోలీవుడ్లోనే అయినా.. ఈమె అచ్చమైన తెలుగమ్మాయి. నిన్నటి తరం నటుడు రాజేష్‌ తనయురాలే ఈ ఐశ్వర్య. ఐతే తండ్రి పేరున్న నటుడే అయినా సరే.. ఐశ్వర్య జీవితం పూల పాన్పు కాదు. ఐశ్వర్యకు ఎనిమిదేళ్ల వయసుండగానే రాజేష్ అనారోగ్యంతో చనిపోవడం పెద్ద విషాదం.

కుటుంబం కోసం రాజేష్ ఎలాంటి ఆస్తిపాస్తులూ మిగల్చలేదట. రాజేష్ సతీమణికి అసలు చదువే రాదట. ఇలాంటి సమయంలో కుటుంబ పోషణ అంతా ఆమెపై పడితే.. వీరి కుటుంబం ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, విషాదాల్ని తట్టుకుని నిలబడిందట. తాజాగా టెడెక్స్ వేదికగా ఐశ్వర్య తన జీవిత అనుభవాల్ని పంచుకుంది. అందులో ఆమె చెప్పిన విషయాలు తెలుసుకుంటే కన్నీళ్లు రాకమానవు.

తండ్రి మరణానంతరం తమ పరిస్థితి దిగువ మధ్య తరగతి స్థాయికి పడిపోయిందని.. ఆ సమయంలో తన తల్లి చీరలు తెచ్చి అమ్మి కొంత కాలం కుటుంబాన్ని పోషించిందని.. తర్వాత ఎల్ఐసీ ఏజెంట్‌గా మారిందని ఐశ్వర్య చెప్పింది. తన అన్నలు కాస్త పెద్ద వాళ్లయి కుటుంబ బాధ్యత తీసుకుంటున్న సమయంలో రెండేళ్ల వ్యవధిలో తమ కుటుంబంలో మరో రెండు విషాదాలు చోటు చేసుకున్నట్లు ఐశ్వర్య వెల్లడించింది.

తనకు 13 ఏళ్ల వయసుండగా.. తన పెద్దన్న చనిపోయాడని.. ఓ అమ్మాయిని ప్రేమించి గొడవ జరిగాక అతను చనిపోయాడని.. అతడి మరణం మిస్టరీగా ఉండిపోయిందని ఆమె తెలిపింది. ఇక తన రెండో అన్న హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదివి ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడని.. 40 వేలు జీతమని.. ఇక తమ కష్టాలు తీరాయని అనుకుంటే అతను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఐశ్వర్య వెల్లడించింది.

ఇలా కొన్నేళ్ల వ్యవధిలో ముగ్గురు కుటుంబ సభ్యుల్ని కోల్పోయి తమ కుటుంబం కుంగిపోయిందని.. తర్వాత తాను ఇంటర్మీడియట్ చదువుతూనే పార్ట్ టైం ఉద్యోగం చేయడం మొదలుపెట్టానని.. తర్వాత టీవీ సీరియల్స్‌లో, ఆపై సినిమాల్లో చాలా కష్టపడి.. ఎన్నో అవమానాలు ఎదుర్కొని అవకాశాలు సంపాదించి.. చివరికి ఇప్పుడు నిలదొక్కుకున్నానని ఐశ్వర్య వెల్లడించింది.

This post was last modified on May 28, 2020 9:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

39 minutes ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

1 hour ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

2 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

3 hours ago

బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…

3 hours ago

నిర్మాతల మధ్య ముదురుతున్న వివాదం

తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల‌ను న‌డిపించే ఎగ్జిబిట‌ర్ల‌కు, నిర్మాత‌ల‌కు మధ్య పీట‌ముడి గ‌ట్టిగానే బిగుసుకునేలా క‌నిపిస్తోంది. అద్దె విధానం ప‌క్క‌న పెట్టి…

3 hours ago