‘యన్.టి.ఆర్’ లాంటి ఆల్ టైం డిజాస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా చేసే అవకాశం దక్కించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు విలక్షణ దర్శకుడు క్రిష్. ‘యన్.టి.ఆర్’ సినిమా విషయంలో అనేక పరిమితుల మధ్య పని చేయడం వల్ల తేడా కొట్టింది కానీ.. క్రిష్ పనితీరు పట్ల ఇండస్ట్రీలో నమ్మకానికి ఇది రుజువు.
గతంలో నందమూరి బాలకృష్ణతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాను గొప్పగా తీర్చదిద్ది తన ప్రత్యేకతను చాటుకున్న పవన్.. మరోసారి హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో చేసిన సినిమానే ‘హరిహర వీరమల్లు’. గత ఏడాది రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ ఆ హైప్ అంతా కొన్ని రోజులే ఉంది. తర్వాత ఈ సినిమా గురించి జనాలు పట్టించుకోవడం మానేశారు. సినిమా మొదలైనపుడు, ఆ తర్వాత కూడా ఇదే పరిస్థితి. మొదట్నుంచి కొంచెం లో బజ్ కనిపిస్తోందీ చిత్రానికి.
‘హరి హర మల్లు’ తర్వాత సెట్స్ మీదికి వెళ్లిన ‘భీమ్లా నాయక్’కు ఉన్న హైపే వేరు. లేటుగా మొదలైనా.. అందులోనూ రీమేక్ మూవీ అయినా కూడా ‘భీమ్లా నాయక్’ పవన్ అభిమానుల్లో ఒక మాస్ హిస్టీరియాను క్రియేట్ చేసింది. నిజానికి కంటెంట్ పరంగా చూస్తే ‘హరి హర వీరమల్లు’ ఇంకా బెటర్గానే ఉంటుందనిపిస్తోంది. పైగా పవన్ చేస్తున్న తొలి హిస్టారిక్ మూవీ ఇది. పవన్ స్థాయికి ఈ చిత్రానికి ‘బాహుబలి’కి దగ్గరగా బజ్ రావాలి. కానీ క్రిష్ అండ్ టీం ముందు నుంచి మెయింటైన్ చేస్తున్న లో ప్రొఫైల్ వల్ల దీనికి హైప్ రావట్లేదు.
ఈ రోజు ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. దానికి అనుకున్నంతగా రెస్పాన్స్ లేదు. ఫస్ట్ లుక్ లాంగ్ షాట్లో, అంత ఆకర్షణీయంగా లేకపోవడంతో దీని గురించి సోషల్ మీడియాలో పెద్దగా డిస్కషనే లేదు. మరి సెప్టెంబరు 2న అయినా క్రిష్ అండ్ టీం ఏదైనా క్రేజీ అప్డేట్ ఇవ్వడం, అలాగే హైప్ పెంచేందుకు తరచుగా కాస్త హడావుడి చేయడం చాలా అవసరం. ఈ చిత్రం మీద రూ.150 కోట్ల దాకా బడ్జెట్ పెట్టినపుడు అందుకు తగ్గట్లే హైప్ తీసుకురావడం కూడా చాలా అవసరమే కదా.
This post was last modified on August 17, 2021 3:20 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…