‘యన్.టి.ఆర్’ లాంటి ఆల్ టైం డిజాస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా చేసే అవకాశం దక్కించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు విలక్షణ దర్శకుడు క్రిష్. ‘యన్.టి.ఆర్’ సినిమా విషయంలో అనేక పరిమితుల మధ్య పని చేయడం వల్ల తేడా కొట్టింది కానీ.. క్రిష్ పనితీరు పట్ల ఇండస్ట్రీలో నమ్మకానికి ఇది రుజువు.
గతంలో నందమూరి బాలకృష్ణతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాను గొప్పగా తీర్చదిద్ది తన ప్రత్యేకతను చాటుకున్న పవన్.. మరోసారి హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో చేసిన సినిమానే ‘హరిహర వీరమల్లు’. గత ఏడాది రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ ఆ హైప్ అంతా కొన్ని రోజులే ఉంది. తర్వాత ఈ సినిమా గురించి జనాలు పట్టించుకోవడం మానేశారు. సినిమా మొదలైనపుడు, ఆ తర్వాత కూడా ఇదే పరిస్థితి. మొదట్నుంచి కొంచెం లో బజ్ కనిపిస్తోందీ చిత్రానికి.
‘హరి హర మల్లు’ తర్వాత సెట్స్ మీదికి వెళ్లిన ‘భీమ్లా నాయక్’కు ఉన్న హైపే వేరు. లేటుగా మొదలైనా.. అందులోనూ రీమేక్ మూవీ అయినా కూడా ‘భీమ్లా నాయక్’ పవన్ అభిమానుల్లో ఒక మాస్ హిస్టీరియాను క్రియేట్ చేసింది. నిజానికి కంటెంట్ పరంగా చూస్తే ‘హరి హర వీరమల్లు’ ఇంకా బెటర్గానే ఉంటుందనిపిస్తోంది. పైగా పవన్ చేస్తున్న తొలి హిస్టారిక్ మూవీ ఇది. పవన్ స్థాయికి ఈ చిత్రానికి ‘బాహుబలి’కి దగ్గరగా బజ్ రావాలి. కానీ క్రిష్ అండ్ టీం ముందు నుంచి మెయింటైన్ చేస్తున్న లో ప్రొఫైల్ వల్ల దీనికి హైప్ రావట్లేదు.
ఈ రోజు ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. దానికి అనుకున్నంతగా రెస్పాన్స్ లేదు. ఫస్ట్ లుక్ లాంగ్ షాట్లో, అంత ఆకర్షణీయంగా లేకపోవడంతో దీని గురించి సోషల్ మీడియాలో పెద్దగా డిస్కషనే లేదు. మరి సెప్టెంబరు 2న అయినా క్రిష్ అండ్ టీం ఏదైనా క్రేజీ అప్డేట్ ఇవ్వడం, అలాగే హైప్ పెంచేందుకు తరచుగా కాస్త హడావుడి చేయడం చాలా అవసరం. ఈ చిత్రం మీద రూ.150 కోట్ల దాకా బడ్జెట్ పెట్టినపుడు అందుకు తగ్గట్లే హైప్ తీసుకురావడం కూడా చాలా అవసరమే కదా.
This post was last modified on August 17, 2021 3:20 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…