మెగాస్టార్ పెద్ద మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నిలదొక్కుకోవడానికి చాలానే కష్టపడ్డాడు. హీరోగా అతడి తొలి చిత్రం ‘రేయ్’ పరిస్థితి ఏమైందో తెలిసిందే. సినిమా మొదలైన మూడేళ్లకు కూడా విడుదలకు నోచుకోని పరిస్థితుల్లో తేజు హీరోగా ఇంకో సినిమా మొదలుకావడం.. ముందు అదే రిలీజ్ కావడం తెలిసిందే. ఆ సినిమా హిట్టవడంతో తేజు కెరీర్ గాడిన పడింది. ఆ తర్వాత అతను పడుతూ లేస్తూ హీరోగా కొనసాగుతున్నాడు.
మధ్యలో అరడజను ఫ్లాపులతో అతను అల్లాడిపోతుంటే.. చిత్రలహరి, ప్రతి రోజూ పండగే బాగా ఆడి అతడికి ఉపశమనాన్నిచ్చాయి. తర్వాత ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు తేజు నుంచి ‘రిపబ్లిక్’ అనే సీరియస్ మూవీ వస్తోంది. ‘ప్రస్థానం’ దర్శకుడు దేవా కట్టా రూపొందించిన ఈ చిత్రం అక్టోబరు 1న విడుదల కానున్నట్లు ఇటీవలే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.
ఐతే తేజు వచ్చిన వారానికే అతడి తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటం విశేషం. అన్నలా ఇబ్బంది పడకుండా తొలి చిత్రం ‘ఉప్పెన’తో భారీ విజయాన్నందుకుని యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న వైష్ణవ్.. తొలి చిత్రం విడుదలకు ముందే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ ఇందులో కథానాయిక. ‘కొండపొలం’ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిన వైవిధ్య చిత్రమిది. పూర్తిగా అటవీ నేపథ్యంలో నడుస్తుంది. ఈ చిత్రం గత ఏడాదే షూటింగ్ పూర్తి చేసుకున్నా.. దీని గురించి ఇప్పటిదాకా అప్డేటే లేదు.
ఐతే ఇంకొన్ని రోజుల్లోనే ఈ సినిమా టైటిల్ లాంచ్ చేసి, రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారట. అక్టోబరు 8న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయంచినట్లు సమాచారం. అంటే తేజు సినిమా థియేటర్లలో ఉండగానే.. దానికి పోటీగా తమ్ముడి సినిమా బాక్సాఫీస్ బరిలో నిలుస్తుందన్నమాట.
This post was last modified on August 17, 2021 12:31 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…