Movie News

మెగా బ్రదర్స్ బాక్సాఫీస్ వార్


మెగాస్టార్ పెద్ద మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నిలదొక్కుకోవడానికి చాలానే కష్టపడ్డాడు. హీరోగా అతడి తొలి చిత్రం ‘రేయ్’ పరిస్థితి ఏమైందో తెలిసిందే. సినిమా మొదలైన మూడేళ్లకు కూడా విడుదలకు నోచుకోని పరిస్థితుల్లో తేజు హీరోగా ఇంకో సినిమా మొదలుకావడం.. ముందు అదే రిలీజ్ కావడం తెలిసిందే. ఆ సినిమా హిట్టవడంతో తేజు కెరీర్ గాడిన పడింది. ఆ తర్వాత అతను పడుతూ లేస్తూ హీరోగా కొనసాగుతున్నాడు.

మధ్యలో అరడజను ఫ్లాపులతో అతను అల్లాడిపోతుంటే.. చిత్రలహరి, ప్రతి రోజూ పండగే బాగా ఆడి అతడికి ఉపశమనాన్నిచ్చాయి. తర్వాత ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు తేజు నుంచి ‘రిపబ్లిక్’ అనే సీరియస్ మూవీ వస్తోంది. ‘ప్రస్థానం’ దర్శకుడు దేవా కట్టా రూపొందించిన ఈ చిత్రం అక్టోబరు 1న విడుదల కానున్నట్లు ఇటీవలే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.

ఐతే తేజు వచ్చిన వారానికే అతడి తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటం విశేషం. అన్నలా ఇబ్బంది పడకుండా తొలి చిత్రం ‘ఉప్పెన’తో భారీ విజయాన్నందుకుని యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న వైష్ణవ్.. తొలి చిత్రం విడుదలకు ముందే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ ఇందులో కథానాయిక. ‘కొండపొలం’ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిన వైవిధ్య చిత్రమిది. పూర్తిగా అటవీ నేపథ్యంలో నడుస్తుంది. ఈ చిత్రం గత ఏడాదే షూటింగ్ పూర్తి చేసుకున్నా.. దీని గురించి ఇప్పటిదాకా అప్‌డేటే లేదు.

ఐతే ఇంకొన్ని రోజుల్లోనే ఈ సినిమా టైటిల్ లాంచ్ చేసి, రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారట. అక్టోబరు 8న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయంచినట్లు సమాచారం. అంటే తేజు సినిమా థియేటర్లలో ఉండగానే.. దానికి పోటీగా తమ్ముడి సినిమా బాక్సాఫీస్ బరిలో నిలుస్తుందన్నమాట.

This post was last modified on August 17, 2021 12:31 pm

Share

Recent Posts

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

23 minutes ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

59 minutes ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

1 hour ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

4 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

5 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

13 hours ago