కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత థియేటర్లు తెరుచుకోవడం అయితే తెరుచుకున్నాయి కానీ.. అనుకున్నంతగా సందడి అయితే లేదు. తొలి రెండు వారాల్లో చిన్న స్థాయి సినిమాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. క్రేజీ సినిమాలు చాలానే విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత మంచి ఫలితం రాదేమో అన్న సందేహంతో చాలామంది నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారు.
నారప్ప, మ్యాస్ట్రో, టక్ జగదీష్ లాంటి క్రేజీ సినిమాలు ఓటీటీ బాట పట్టడం కూడా ఇందులో భాగమే. మిగతా చిత్రాలను థియేటర్లలోనే రిలీజ్ చేద్దామని చూస్తున్నారు కానీ.. లోలోన సందేహాలు వెంటాడుతున్నాయి. ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ, సెకండ్ షోలకు అనుమతి లేకపోవడం కూడా ఈ భయానికి కారణమే. ఐతే ఈ వారం దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత.. తన భాగస్వామ్యంలో తెరకెక్కిన ‘పాగల్’ చిత్రాన్ని థియేటర్లలోకి దించేస్తుండటంతో టాలీవుడ్లో వేడి మొదలైనట్లే కనిపిస్తోంది.
తర్వాతి వారాల నుంచి క్రేజీ సినిమాలు ఒక్కొక్కటిగా వరుస కట్టేసేలా ఉన్నాయి. ఇప్పటికే ఆగస్టు 19వ తేదీకి శ్రీ విష్ణు సినిమా ‘రాజ రాజ చోర’ ఖరారైంది. అదే రోజు శ్రీముఖి చిత్రం ‘క్రేజీ అంకుల్స్’ కూడా రాబోతోంది. తర్వాతి వారానికి తాజాగా సుధీర్ బాబు చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’ను ఖాయం చేశారు. ఇది మంచి అంచనాలున్న సినిమానే. ఇక సెప్టెంబరు 3న మారుతి చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’ని రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం.
ఈ నెలాఖరుకి అప్పటికి రెండు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తాయని, ఏపీలో టికెట్ల రేట్ల గొడవా తెగిపోతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే సెప్టెంబరులో మరిన్ని క్రేజీ సినిమాలు విడుదలయ్యే అవకాశముంది. గోపీచంద్ చిత్రం ‘సీటీమార్’ను సెప్టెంబరు రెండో వారానికి ఫిక్స్ చేసినట్లుగా చెబుతున్నారు. నాగచైతన్య-సాయిపల్లవిల కాంబినేషన్లో శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లవ్ స్టోరి’ని కూడా సెప్టెంబరు ప్రథమార్ధంలోనే రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.
This post was last modified on August 12, 2021 3:33 pm
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…