కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత థియేటర్లు తెరుచుకోవడం అయితే తెరుచుకున్నాయి కానీ.. అనుకున్నంతగా సందడి అయితే లేదు. తొలి రెండు వారాల్లో చిన్న స్థాయి సినిమాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. క్రేజీ సినిమాలు చాలానే విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత మంచి ఫలితం రాదేమో అన్న సందేహంతో చాలామంది నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారు.
నారప్ప, మ్యాస్ట్రో, టక్ జగదీష్ లాంటి క్రేజీ సినిమాలు ఓటీటీ బాట పట్టడం కూడా ఇందులో భాగమే. మిగతా చిత్రాలను థియేటర్లలోనే రిలీజ్ చేద్దామని చూస్తున్నారు కానీ.. లోలోన సందేహాలు వెంటాడుతున్నాయి. ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ, సెకండ్ షోలకు అనుమతి లేకపోవడం కూడా ఈ భయానికి కారణమే. ఐతే ఈ వారం దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత.. తన భాగస్వామ్యంలో తెరకెక్కిన ‘పాగల్’ చిత్రాన్ని థియేటర్లలోకి దించేస్తుండటంతో టాలీవుడ్లో వేడి మొదలైనట్లే కనిపిస్తోంది.
తర్వాతి వారాల నుంచి క్రేజీ సినిమాలు ఒక్కొక్కటిగా వరుస కట్టేసేలా ఉన్నాయి. ఇప్పటికే ఆగస్టు 19వ తేదీకి శ్రీ విష్ణు సినిమా ‘రాజ రాజ చోర’ ఖరారైంది. అదే రోజు శ్రీముఖి చిత్రం ‘క్రేజీ అంకుల్స్’ కూడా రాబోతోంది. తర్వాతి వారానికి తాజాగా సుధీర్ బాబు చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’ను ఖాయం చేశారు. ఇది మంచి అంచనాలున్న సినిమానే. ఇక సెప్టెంబరు 3న మారుతి చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’ని రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం.
ఈ నెలాఖరుకి అప్పటికి రెండు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తాయని, ఏపీలో టికెట్ల రేట్ల గొడవా తెగిపోతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే సెప్టెంబరులో మరిన్ని క్రేజీ సినిమాలు విడుదలయ్యే అవకాశముంది. గోపీచంద్ చిత్రం ‘సీటీమార్’ను సెప్టెంబరు రెండో వారానికి ఫిక్స్ చేసినట్లుగా చెబుతున్నారు. నాగచైతన్య-సాయిపల్లవిల కాంబినేషన్లో శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లవ్ స్టోరి’ని కూడా సెప్టెంబరు ప్రథమార్ధంలోనే రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…