తమిళ ఫిలిం ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్గా ఎదిగిన నటుల్లో ఆర్య ఒకడు. కొన్ని డబ్బింగ్ సినిమాలతో ఆర్య మన ప్రేక్షకులకు బాగానే పరిచయం. తెలుగులో అల్లు అర్జున్ సినిమా ‘వరుడు’ విలన్ క్యారెక్టర్ కూడా చేయడం తెలిసిందే. ఈ మధ్యనే అతను ‘సార్పట్ట’ అనే సినిమాతో పెద్ద హిట్టు కొట్టాడు. ఐతే ఈ సంతోషంలో ఉన్న ఆర్య.. ఒక వివాదంలో చిక్కకుని పోలీసుల విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ శ్రీలంకకు చెందిన ఓ యువతి కేసు పెట్టడం గమనార్హం. ఇదేమీ అల్లాటప్పా కేసులాగా కనిపించడం లేదు. ఈ కేసు విచారణలో భాగంగా ఆర్య.. తాజాగా చెన్నై సిటీ కమిషనర్ కార్యాలయంలో విచారణకు కూడా హాజరయ్యాడు. అంత పెద్ద స్టార్ మీద ఎవరో విదేశీ అమ్మాయి పెళ్లి చేసుకుంటానని కేసు పెట్టడమేంటో.. ఈ కేసులో ఆర్య విచారణకు కూడా హాజరు కావడం ఏంటో అర్థం కాక తమిళ జనాలు తలలు పట్టుకుంటున్నారు.
కోలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం శ్రీలంకకు చెందిన విద్జా అనే అమ్మాయి జర్మనీలో ఉంటోంది. తనను ఆర్య పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఆన్ లైన్ ద్వారా అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్యతో చేసిన చాటింగ్ను స్ర్కీన్షాట్గా తీసి విడుదల చేసింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి జర్మనీ నుంచి చెన్నై పోలీసులకు సమాచారం రావడంతో ఆర్యను చెన్నై కమిషనర్ కార్యాలయానికి పిలిచి మూడు గంటల సేపు పోలీసులు విచారించారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ కేసు విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసుపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలసిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది.
ఐతే ఆర్య పేరుతో ఇంకెవరో విద్జాను మోసం చేసి ఉంటాడని.. కోట్ల పారితోషకం తీసుకుంటూ, కోలీవుడ్లో ఒక స్థాయిలో ఉన్న ఆర్య.. పెళ్లి పేరుతో ఓ విదేశీ అమ్మాయి నుంచి డబ్బులు తీసుకోవడం ఏంటని అంటున్నారు నెటిజన్లు. ఆర్యకు హీరోయిన్ సాయేషాతో పెళ్లి కూడా అయిన సంగతి తెలిసిందే.
This post was last modified on August 11, 2021 5:49 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…