తమిళ ఫిలిం ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్గా ఎదిగిన నటుల్లో ఆర్య ఒకడు. కొన్ని డబ్బింగ్ సినిమాలతో ఆర్య మన ప్రేక్షకులకు బాగానే పరిచయం. తెలుగులో అల్లు అర్జున్ సినిమా ‘వరుడు’ విలన్ క్యారెక్టర్ కూడా చేయడం తెలిసిందే. ఈ మధ్యనే అతను ‘సార్పట్ట’ అనే సినిమాతో పెద్ద హిట్టు కొట్టాడు. ఐతే ఈ సంతోషంలో ఉన్న ఆర్య.. ఒక వివాదంలో చిక్కకుని పోలీసుల విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ శ్రీలంకకు చెందిన ఓ యువతి కేసు పెట్టడం గమనార్హం. ఇదేమీ అల్లాటప్పా కేసులాగా కనిపించడం లేదు. ఈ కేసు విచారణలో భాగంగా ఆర్య.. తాజాగా చెన్నై సిటీ కమిషనర్ కార్యాలయంలో విచారణకు కూడా హాజరయ్యాడు. అంత పెద్ద స్టార్ మీద ఎవరో విదేశీ అమ్మాయి పెళ్లి చేసుకుంటానని కేసు పెట్టడమేంటో.. ఈ కేసులో ఆర్య విచారణకు కూడా హాజరు కావడం ఏంటో అర్థం కాక తమిళ జనాలు తలలు పట్టుకుంటున్నారు.
కోలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం శ్రీలంకకు చెందిన విద్జా అనే అమ్మాయి జర్మనీలో ఉంటోంది. తనను ఆర్య పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఆన్ లైన్ ద్వారా అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్యతో చేసిన చాటింగ్ను స్ర్కీన్షాట్గా తీసి విడుదల చేసింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి జర్మనీ నుంచి చెన్నై పోలీసులకు సమాచారం రావడంతో ఆర్యను చెన్నై కమిషనర్ కార్యాలయానికి పిలిచి మూడు గంటల సేపు పోలీసులు విచారించారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ కేసు విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసుపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలసిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది.
ఐతే ఆర్య పేరుతో ఇంకెవరో విద్జాను మోసం చేసి ఉంటాడని.. కోట్ల పారితోషకం తీసుకుంటూ, కోలీవుడ్లో ఒక స్థాయిలో ఉన్న ఆర్య.. పెళ్లి పేరుతో ఓ విదేశీ అమ్మాయి నుంచి డబ్బులు తీసుకోవడం ఏంటని అంటున్నారు నెటిజన్లు. ఆర్యకు హీరోయిన్ సాయేషాతో పెళ్లి కూడా అయిన సంగతి తెలిసిందే.
This post was last modified on August 11, 2021 5:49 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…