పోయినేడాది కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ పుంజుకున్న తీరు దేశానికే ఆదర్శంగా నిలిచింది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించగా.. ఆ తర్వాత సంక్రాంతి సినిమాలతో సందడి మరో స్థాయికి చేరుకుంది. ఇక తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేదు. విషయం ఉన్న సినిమాలు అంచనాలను మించి ఆడేశాయి. ఐతే కరోనా సెకండ్ వేవ్ తర్వాత మాత్రం థియేటర్లలో సందడి కనిపించట్లేదు. మీడియం రేంజ్ సినిమాలు కాకుండా చిన్న చిత్రాలతో ఈసారి ఇండస్ట్రీ రీస్టార్ట్ కావడంతో పెద్దగా హంగామా లేకపోయింది.
తొలి వారం రిలీజైన తిమ్మరసు, ఇష్క్ చిత్రాలకు ఆశించిన ఓపెనింగ్స్ రాలేదు. ఉన్నంతలో ‘తిమ్మరసు’కు టాక్ పర్వాలేదు. ‘ఇష్క్’ డిజాస్టర్ టాక్తో మొదలై వీకెండ్లోనే వాషౌట్ అయిపోయింది. ‘తిమ్మరసు’ ఓ మోస్తరు వసూళ్లతో ముందుకు సాగింది. కానీ ఫైనల్గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్కు కొంచెం దూరంలోనే ఆగిపోయినట్లు కనిపిస్తోంది. తక్కువ బడ్జెట్లో తీసినా.. టాక్ పాజిటివ్గానే ఉన్నా ఈ సినిమా పరిస్థితి ఇలా తయారైంది.
తిమ్మరసు, ఇష్క్తో పాటు రిలీజైన మిగతా సినిమాల గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఇక గత శుక్రవారం అరడజను సినిమాల దాకా రిలీజయ్యాయి. వీటిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఒక్క ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మాత్రమే. దీనికి మంచి బజ్ వచ్చినా.. సినిమాలో విషయంలో లేకపోవడంతో సందడంతా వీకెండ్కే పరిమితం అయింది. దీంతో పాటుగా రిలీజైన మెరిసే మెరిసే, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, మ్యాడ్ లాంటి చిత్రాల గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ఇవి ప్రేక్షకుల దృష్టిలోనే పడలేదు.
వారాంతం తర్వాత ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సహా అన్ని సినిమాల థియేటర్లూ ఖాళీగా కనిపిస్తున్నాయి. థియేటర్ల మెయింటైనెన్స్ ఖర్చులు కూడా కష్టమైన పరిస్థితి. ఈ వారాంతంలో కూడా అరడజను సినిమాల దాకా రిలీజవుతున్నాయి కానీ.. వాటిలో ‘పాగల్’ ఒకదానికే క్రేజ్ కనిపిస్తోంది. ఇదైనా టాలీవుడ్ కోరుకుంటున్న ఊపును తీసుకొస్తుందేమో చూడాలి.
This post was last modified on August 11, 2021 11:23 am
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…