పోయినేడాది కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ పుంజుకున్న తీరు దేశానికే ఆదర్శంగా నిలిచింది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించగా.. ఆ తర్వాత సంక్రాంతి సినిమాలతో సందడి మరో స్థాయికి చేరుకుంది. ఇక తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేదు. విషయం ఉన్న సినిమాలు అంచనాలను మించి ఆడేశాయి. ఐతే కరోనా సెకండ్ వేవ్ తర్వాత మాత్రం థియేటర్లలో సందడి కనిపించట్లేదు. మీడియం రేంజ్ సినిమాలు కాకుండా చిన్న చిత్రాలతో ఈసారి ఇండస్ట్రీ రీస్టార్ట్ కావడంతో పెద్దగా హంగామా లేకపోయింది.
తొలి వారం రిలీజైన తిమ్మరసు, ఇష్క్ చిత్రాలకు ఆశించిన ఓపెనింగ్స్ రాలేదు. ఉన్నంతలో ‘తిమ్మరసు’కు టాక్ పర్వాలేదు. ‘ఇష్క్’ డిజాస్టర్ టాక్తో మొదలై వీకెండ్లోనే వాషౌట్ అయిపోయింది. ‘తిమ్మరసు’ ఓ మోస్తరు వసూళ్లతో ముందుకు సాగింది. కానీ ఫైనల్గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్కు కొంచెం దూరంలోనే ఆగిపోయినట్లు కనిపిస్తోంది. తక్కువ బడ్జెట్లో తీసినా.. టాక్ పాజిటివ్గానే ఉన్నా ఈ సినిమా పరిస్థితి ఇలా తయారైంది.
తిమ్మరసు, ఇష్క్తో పాటు రిలీజైన మిగతా సినిమాల గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఇక గత శుక్రవారం అరడజను సినిమాల దాకా రిలీజయ్యాయి. వీటిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఒక్క ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మాత్రమే. దీనికి మంచి బజ్ వచ్చినా.. సినిమాలో విషయంలో లేకపోవడంతో సందడంతా వీకెండ్కే పరిమితం అయింది. దీంతో పాటుగా రిలీజైన మెరిసే మెరిసే, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, మ్యాడ్ లాంటి చిత్రాల గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ఇవి ప్రేక్షకుల దృష్టిలోనే పడలేదు.
వారాంతం తర్వాత ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సహా అన్ని సినిమాల థియేటర్లూ ఖాళీగా కనిపిస్తున్నాయి. థియేటర్ల మెయింటైనెన్స్ ఖర్చులు కూడా కష్టమైన పరిస్థితి. ఈ వారాంతంలో కూడా అరడజను సినిమాల దాకా రిలీజవుతున్నాయి కానీ.. వాటిలో ‘పాగల్’ ఒకదానికే క్రేజ్ కనిపిస్తోంది. ఇదైనా టాలీవుడ్ కోరుకుంటున్న ఊపును తీసుకొస్తుందేమో చూడాలి.
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…