కరోనా మహమ్మారి మన దేశాన్ని ఎలా పట్టిపీడించిందో అందరికీ తెలిసిందే. ఆ మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించగా.. ఆ సమయంలో వలస కార్మికులు స్వస్థలాలకు చేర్చేందుకు నడుం బిగించాడు.. సినీ నటుడు సోనూసూద్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తనకు తోచిన సేవలు చేస్తూనే ఉన్నాడు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు ఆయన ఎన్నో రకాలుగా సాయం అందిస్తున్నారు.
అడిగింది లేదనకుండా ఆదుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఆయన నేషనల్ రియల్ హీరోగా మారిపోయారు. ఇది ఇలా ఉండగా కరోనా మహమ్మారి సమయంలో ఎంతో మంది ఆపన్నులకు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న స్టార్ నటుడు సోనూసూద్ కు మరో అరుదైన గౌరవం దక్కింది.
వచ్చే ఏడాది జరగబోయే స్పెషల్ ఒలంపిక్స్…. వరల్డ్ వింటర్ గేమ్స్ రియల్ హీరో సోను సోను భారత బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. అయితే దీనిపై స్పందించిన సోనూసూద్… తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ గౌరవం తనకెంతో ప్రత్యేకమని.. స్పెషల్ ఒలంపిక్స్ భారత జట్టు తరఫున నిలబడటం తనకు ఆనందంగా మరియు గర్వంగా ఉందని సోనుసూద్ వెల్లడించారు.
This post was last modified on August 2, 2021 7:13 pm
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…