ఆర్ఆర్ఆర్ నుంచి తొలి పాట విడుదలకు సమయం దగ్గర పడింది. ఆదివారం ఉదయం 11 గంటలకు దోస్తీ పేరుతో ఈ పాటను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను వివిధ భాషలకు చెందిన ఐదుగురు టాప్ సింగర్స్ పాడటం విశేషం. టాలీవుడ్ సింగర్ హేమచంద్రతో పాటు అనిరుధ్ రవిచందర్, అమిత్ త్రివేది, యాసిన్ నజీర్, విజయ్ ఏసుదాస్ ఈ పాటలో భాగమయ్యారు. ఈ పాటపై ఇప్పటికే ఉన్న అంచనాలను దర్శకుడు రాజమౌళి ఇంకా పెంచేశాడు.
సినిమా కథను ప్రతిబింబించేలా లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతంగా ఈ పాటను రాశారని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమా ఎసెన్స్ అంతా ఈ పాటలో ఉంటుందని జక్కన్న చెప్పడం విశేషం.
ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ అగ్గికి ప్రతిబింబంలాంటి పాత్రను పోషిస్తుండగా.. నీటిని ప్రతిరూపం లాంటి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నాడు. పరస్పర విరుద్ధమైన ఈ పాత్రలు ఒక్కటైతే.. వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందో చాటిచెప్పేలా దోస్తీ పాట ఉంటుందని.. ఆ భావాన్ని సీతారామశాస్త్రి అద్భుతంగా తన సాహిత్యంతో వర్ణించారని రాజమౌళి తెలిపాడు.
తారక్, చరణ్ పాత్రల గురించి జక్కన్న వివరించిన తీరు.. ఈ పాట సాహిత్యం గురించి చెప్పిన వైనం చూస్తే సినిమాలో ఇది మేజర్ హైలైట్గా నిలిచే అవకాశముంది. ఈ పాట చిత్రీకరణ గురించి కూడా ఇండస్ట్రీలో పెద్ద టాకే నడుస్తోంది. ఈ సాంగ్ ఎనిమిది నిమిషాల సుదీర్ఘ నిడివితో ఉంటుందని.. దీని మేకింగ్ కూడా ఓ రేంజిలో ఉంటుందని.. థియేటర్లలో గూస్ బంప్స్ ఖాయమని అంటున్నారు.
This post was last modified on August 1, 2021 5:46 am
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…