ఆర్ఆర్ఆర్ నుంచి తొలి పాట విడుదలకు సమయం దగ్గర పడింది. ఆదివారం ఉదయం 11 గంటలకు దోస్తీ పేరుతో ఈ పాటను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను వివిధ భాషలకు చెందిన ఐదుగురు టాప్ సింగర్స్ పాడటం విశేషం. టాలీవుడ్ సింగర్ హేమచంద్రతో పాటు అనిరుధ్ రవిచందర్, అమిత్ త్రివేది, యాసిన్ నజీర్, విజయ్ ఏసుదాస్ ఈ పాటలో భాగమయ్యారు. ఈ పాటపై ఇప్పటికే ఉన్న అంచనాలను దర్శకుడు రాజమౌళి ఇంకా పెంచేశాడు.
సినిమా కథను ప్రతిబింబించేలా లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతంగా ఈ పాటను రాశారని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమా ఎసెన్స్ అంతా ఈ పాటలో ఉంటుందని జక్కన్న చెప్పడం విశేషం.
ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ అగ్గికి ప్రతిబింబంలాంటి పాత్రను పోషిస్తుండగా.. నీటిని ప్రతిరూపం లాంటి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నాడు. పరస్పర విరుద్ధమైన ఈ పాత్రలు ఒక్కటైతే.. వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందో చాటిచెప్పేలా దోస్తీ పాట ఉంటుందని.. ఆ భావాన్ని సీతారామశాస్త్రి అద్భుతంగా తన సాహిత్యంతో వర్ణించారని రాజమౌళి తెలిపాడు.
తారక్, చరణ్ పాత్రల గురించి జక్కన్న వివరించిన తీరు.. ఈ పాట సాహిత్యం గురించి చెప్పిన వైనం చూస్తే సినిమాలో ఇది మేజర్ హైలైట్గా నిలిచే అవకాశముంది. ఈ పాట చిత్రీకరణ గురించి కూడా ఇండస్ట్రీలో పెద్ద టాకే నడుస్తోంది. ఈ సాంగ్ ఎనిమిది నిమిషాల సుదీర్ఘ నిడివితో ఉంటుందని.. దీని మేకింగ్ కూడా ఓ రేంజిలో ఉంటుందని.. థియేటర్లలో గూస్ బంప్స్ ఖాయమని అంటున్నారు.
This post was last modified on August 1, 2021 5:46 am
తెలుగు టీవీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన షోగా జబర్దస్త్ను చెప్పొచ్చు. అందులో డబుల్ మీనింగ్లు, బాడీ షేమింగ్ల గురించి అభ్యంతరాలు…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాను నటించకుండా నిర్మించిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. సుమారు నలభైకి పైగా కొత్తవాళ్లను పరిచయం…
ఆదిత్య ధర్.. గత నాలుగు నెలలుగా దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. దురంధర్, దురంధర్-2 చిత్రాలతో అతను రేపిన సంచలనం అంతా…
ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…
వైసీపీ అధినేత జగన్ను అధికారంలోకి రాకుండా చేస్తానని.. అవసరమైతే.. చంద్రబాబు ఓకే అంటే.. తాను కూడా పాదయాత్రకు రెడీ అంటూ..…
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…