ఆర్ఆర్ఆర్ నుంచి తొలి పాట విడుదలకు సమయం దగ్గర పడింది. ఆదివారం ఉదయం 11 గంటలకు దోస్తీ పేరుతో ఈ పాటను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను వివిధ భాషలకు చెందిన ఐదుగురు టాప్ సింగర్స్ పాడటం విశేషం. టాలీవుడ్ సింగర్ హేమచంద్రతో పాటు అనిరుధ్ రవిచందర్, అమిత్ త్రివేది, యాసిన్ నజీర్, విజయ్ ఏసుదాస్ ఈ పాటలో భాగమయ్యారు. ఈ పాటపై ఇప్పటికే ఉన్న అంచనాలను దర్శకుడు రాజమౌళి ఇంకా పెంచేశాడు.
సినిమా కథను ప్రతిబింబించేలా లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతంగా ఈ పాటను రాశారని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమా ఎసెన్స్ అంతా ఈ పాటలో ఉంటుందని జక్కన్న చెప్పడం విశేషం.
ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ అగ్గికి ప్రతిబింబంలాంటి పాత్రను పోషిస్తుండగా.. నీటిని ప్రతిరూపం లాంటి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నాడు. పరస్పర విరుద్ధమైన ఈ పాత్రలు ఒక్కటైతే.. వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందో చాటిచెప్పేలా దోస్తీ పాట ఉంటుందని.. ఆ భావాన్ని సీతారామశాస్త్రి అద్భుతంగా తన సాహిత్యంతో వర్ణించారని రాజమౌళి తెలిపాడు.
తారక్, చరణ్ పాత్రల గురించి జక్కన్న వివరించిన తీరు.. ఈ పాట సాహిత్యం గురించి చెప్పిన వైనం చూస్తే సినిమాలో ఇది మేజర్ హైలైట్గా నిలిచే అవకాశముంది. ఈ పాట చిత్రీకరణ గురించి కూడా ఇండస్ట్రీలో పెద్ద టాకే నడుస్తోంది. ఈ సాంగ్ ఎనిమిది నిమిషాల సుదీర్ఘ నిడివితో ఉంటుందని.. దీని మేకింగ్ కూడా ఓ రేంజిలో ఉంటుందని.. థియేటర్లలో గూస్ బంప్స్ ఖాయమని అంటున్నారు.
This post was last modified on August 1, 2021 5:46 am
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…