ఆర్ఆర్ఆర్ నుంచి తొలి పాట విడుదలకు సమయం దగ్గర పడింది. ఆదివారం ఉదయం 11 గంటలకు దోస్తీ పేరుతో ఈ పాటను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను వివిధ భాషలకు చెందిన ఐదుగురు టాప్ సింగర్స్ పాడటం విశేషం. టాలీవుడ్ సింగర్ హేమచంద్రతో పాటు అనిరుధ్ రవిచందర్, అమిత్ త్రివేది, యాసిన్ నజీర్, విజయ్ ఏసుదాస్ ఈ పాటలో భాగమయ్యారు. ఈ పాటపై ఇప్పటికే ఉన్న అంచనాలను దర్శకుడు రాజమౌళి ఇంకా పెంచేశాడు.
సినిమా కథను ప్రతిబింబించేలా లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతంగా ఈ పాటను రాశారని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమా ఎసెన్స్ అంతా ఈ పాటలో ఉంటుందని జక్కన్న చెప్పడం విశేషం.
ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ అగ్గికి ప్రతిబింబంలాంటి పాత్రను పోషిస్తుండగా.. నీటిని ప్రతిరూపం లాంటి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నాడు. పరస్పర విరుద్ధమైన ఈ పాత్రలు ఒక్కటైతే.. వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందో చాటిచెప్పేలా దోస్తీ పాట ఉంటుందని.. ఆ భావాన్ని సీతారామశాస్త్రి అద్భుతంగా తన సాహిత్యంతో వర్ణించారని రాజమౌళి తెలిపాడు.
తారక్, చరణ్ పాత్రల గురించి జక్కన్న వివరించిన తీరు.. ఈ పాట సాహిత్యం గురించి చెప్పిన వైనం చూస్తే సినిమాలో ఇది మేజర్ హైలైట్గా నిలిచే అవకాశముంది. ఈ పాట చిత్రీకరణ గురించి కూడా ఇండస్ట్రీలో పెద్ద టాకే నడుస్తోంది. ఈ సాంగ్ ఎనిమిది నిమిషాల సుదీర్ఘ నిడివితో ఉంటుందని.. దీని మేకింగ్ కూడా ఓ రేంజిలో ఉంటుందని.. థియేటర్లలో గూస్ బంప్స్ ఖాయమని అంటున్నారు.
This post was last modified on August 1, 2021 5:46 am
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…