ఉన్నట్లుండి ఈ మధ్య తమిళ కథానాయకుల మనసు తెలుగు సినిమాల వైపు మళ్లుతోంది. డబ్బింగ్ సినిమాలను ప్రమోట్ చేసి తెలుగులో రిలీజ్ చేసుకోవడం వేరు. కానీ నేరుగా తెలుగు చిత్రాలు చేయడం వేరు. ఒకప్పుడు కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి హీరోలు తెలుగులో నేరుగా సినిమాలు చేశారు కానీ.. తర్వాత ఈ ట్రెడిషన్ మరుగున పడిపోయింది. ఐతే విజయ్, ధనుష్ లాంటి హీరోలు ఇప్పుడు నేరుగా తెలుగు చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారు.
వీరిలో ధనుష్ తెలుగులో చేయబోయే సినిమా ఇప్పటికే ఖరారైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏషియన్ సినిమాస్ వాళ్లు ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఐతే ధనుష్ మరో తెలుగు చిత్రం కూడా చేయనున్నాడని.. యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని ప్రచారం జరగడం తెలిసిందే.
ఈ వార్త నిజమే అనడానికి తాజాగా ఓ రుజువు దొరికింది. ధనుష్-వెంకీ కలయికలో సినిమాను నిర్మించనున్నట్లు చెప్పుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్.. ఈ రోజు ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేసి అతడికి శుభాకాంక్షలు చెప్పింది. ధనుష్ టక్ చేసుకుని ప్రొఫెషనల్గా కనిపిస్తున్న ఒక రేర్ స్టిల్ను సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేసింది. బహుశా తమ బేనర్లో ధనుష్ చేయనున్న సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్ లేదంటే డిస్కషన్ల సమయంలో తీసిన ఫొటో కావచ్చు.
మునుపెన్నడూ లేని విధంగా సితార ఎంటర్టైన్మెంట్స్ ధనుష్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిందంటే కచ్చితంగా అతడితో సినిమా చేయబోతున్నట్లే. వెంకీ చివరి సినిమా ‘రంగ్ దె’ను నిర్మించింది ఈ సంస్థే అన్న సంగతి తెలిసిందే. కాబట్టి ధనుష్-వెంకీ-సితార కలయికలో సినిమా ఖాయం అనుకోవచ్చు. ఇదిలా ఉండగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ చేయనున్న సినిమాకు సంబంధించి ప్రి లుక్తో అతడికి విషెస్ చెప్పగా.. తమిళంలో కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ధనుష్ చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ను కూడా ఈ రోజే రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘మారన్’ అనే టైటిల్ ఖరారు చేశారు.
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…