నేచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయి చాలా కాలమవుతుంది. నిజానికి సెకండ్ వేవ్ కంటే ముందే ఈ సినిమా విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు సినిమాను రెడీ చేసుకొని మంచి తేదీన విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వచ్చాయి. ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను చిత్రబృందం కొట్టిపారేసింది. సినిమా శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ కి అమ్మడంతో సినిమా థియేటర్లోనే విడుదల అవుతుందని అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు అడ్డుపడేలా మరో పరిస్థితి ఎదురవుతోంది. ఏపీలో థియేటర్లు తీర్చుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చినా.. టికెట్ రేట్ల విషయంలో క్లారిటీ రాకపోవడంతో థియేటర్లను క్లోజ్ చేసే ఉంచారు. రీసెంట్ గా ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన థియేటర్ ఓనర్స్ అసోసియేన్ సంస్థ ఒక స్టేట్మెంట్ ను పాస్ చేసింది. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో విధించిన షరతులను ఎత్తేస్తేనే తప్ప థియేటర్లను తెరవకూడదని నిర్ణయించారు. ఈ ఒక్క జిల్లాలోనే కాకుండా దాదాపు అన్ని జిల్లాలకు చెందిన థియేటర్ యాజమాన్యాలు ఇలానే ఆలోచిస్తున్నాయి.
ఈ విషయంలో గనుక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఇప్పట్లో సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ లేదనిపిస్తుంది. ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్న ‘టక్ జగదీష్’ సినిమాకి ఇదొక అడ్డంకిగా మారింది. ఇదే గనుక కంటిన్యూ అయితే ఎక్కువ రోజులు సినిమాను ల్యాబ్ లో ఉంచే సాహసం చేయరు. ఇక ఆప్షన్ లేనప్పుడు ఇక సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం తప్ప ఇంకేం చేయలేరు. దీంతో మేకర్స్ స్ట్రీమింగ్ కంపెనీలతో చర్చలు మొదలుపెట్టారని సమాచారం. మరి నాని సినిమా ఓటీటీలోకి వస్తుందో.. థియేటర్ లోకి వస్తుందో చూడాలి!
This post was last modified on July 21, 2021 2:58 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…