నేచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయి చాలా కాలమవుతుంది. నిజానికి సెకండ్ వేవ్ కంటే ముందే ఈ సినిమా విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు సినిమాను రెడీ చేసుకొని మంచి తేదీన విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వచ్చాయి. ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను చిత్రబృందం కొట్టిపారేసింది. సినిమా శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ కి అమ్మడంతో సినిమా థియేటర్లోనే విడుదల అవుతుందని అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు అడ్డుపడేలా మరో పరిస్థితి ఎదురవుతోంది. ఏపీలో థియేటర్లు తీర్చుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చినా.. టికెట్ రేట్ల విషయంలో క్లారిటీ రాకపోవడంతో థియేటర్లను క్లోజ్ చేసే ఉంచారు. రీసెంట్ గా ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన థియేటర్ ఓనర్స్ అసోసియేన్ సంస్థ ఒక స్టేట్మెంట్ ను పాస్ చేసింది. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో విధించిన షరతులను ఎత్తేస్తేనే తప్ప థియేటర్లను తెరవకూడదని నిర్ణయించారు. ఈ ఒక్క జిల్లాలోనే కాకుండా దాదాపు అన్ని జిల్లాలకు చెందిన థియేటర్ యాజమాన్యాలు ఇలానే ఆలోచిస్తున్నాయి.
ఈ విషయంలో గనుక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఇప్పట్లో సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ లేదనిపిస్తుంది. ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్న ‘టక్ జగదీష్’ సినిమాకి ఇదొక అడ్డంకిగా మారింది. ఇదే గనుక కంటిన్యూ అయితే ఎక్కువ రోజులు సినిమాను ల్యాబ్ లో ఉంచే సాహసం చేయరు. ఇక ఆప్షన్ లేనప్పుడు ఇక సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం తప్ప ఇంకేం చేయలేరు. దీంతో మేకర్స్ స్ట్రీమింగ్ కంపెనీలతో చర్చలు మొదలుపెట్టారని సమాచారం. మరి నాని సినిమా ఓటీటీలోకి వస్తుందో.. థియేటర్ లోకి వస్తుందో చూడాలి!
This post was last modified on July 21, 2021 2:58 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…