నేచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయి చాలా కాలమవుతుంది. నిజానికి సెకండ్ వేవ్ కంటే ముందే ఈ సినిమా విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు సినిమాను రెడీ చేసుకొని మంచి తేదీన విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వచ్చాయి. ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను చిత్రబృందం కొట్టిపారేసింది. సినిమా శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ కి అమ్మడంతో సినిమా థియేటర్లోనే విడుదల అవుతుందని అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు అడ్డుపడేలా మరో పరిస్థితి ఎదురవుతోంది. ఏపీలో థియేటర్లు తీర్చుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చినా.. టికెట్ రేట్ల విషయంలో క్లారిటీ రాకపోవడంతో థియేటర్లను క్లోజ్ చేసే ఉంచారు. రీసెంట్ గా ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన థియేటర్ ఓనర్స్ అసోసియేన్ సంస్థ ఒక స్టేట్మెంట్ ను పాస్ చేసింది. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో విధించిన షరతులను ఎత్తేస్తేనే తప్ప థియేటర్లను తెరవకూడదని నిర్ణయించారు. ఈ ఒక్క జిల్లాలోనే కాకుండా దాదాపు అన్ని జిల్లాలకు చెందిన థియేటర్ యాజమాన్యాలు ఇలానే ఆలోచిస్తున్నాయి.
ఈ విషయంలో గనుక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఇప్పట్లో సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ లేదనిపిస్తుంది. ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్న ‘టక్ జగదీష్’ సినిమాకి ఇదొక అడ్డంకిగా మారింది. ఇదే గనుక కంటిన్యూ అయితే ఎక్కువ రోజులు సినిమాను ల్యాబ్ లో ఉంచే సాహసం చేయరు. ఇక ఆప్షన్ లేనప్పుడు ఇక సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం తప్ప ఇంకేం చేయలేరు. దీంతో మేకర్స్ స్ట్రీమింగ్ కంపెనీలతో చర్చలు మొదలుపెట్టారని సమాచారం. మరి నాని సినిమా ఓటీటీలోకి వస్తుందో.. థియేటర్ లోకి వస్తుందో చూడాలి!
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…