Movie News

‘నారప్ప’ ఓటీటీ రిలీజ్ కు కారణమతడే!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో అందరికీ తెలిసిందే. కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. మరికొన్ని ఫస్ట్ కాపీతో రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. కానీ థియేటర్ వ్యవస్థ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.

చిన్న సినిమాలు మాత్రమే కాదు.. భారీ బడ్జెట్ తో నిర్మించిన పెద్ద సినిమాలను సైతం ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళనకు దిగారు. అయినప్పటికీ ఓటీటీ రిలీజ్ లు ఆగడం లేదు.

తాజాగా ‘నారప్ప’ లాంటి పెద్ద సినిమా కూడా ఓటీటీలో రాబోతుంది. ఎగ్జిబిటర్ల రిక్వెస్ట్ ను కన్సిడర్ చేసి సురేష్ బాబు కొన్నాళ్లు ఆగుతారేమో అనుకున్నారు కానీ అలా జరగడం లేదు. ఈ నెల 20న ‘నారప్ప’ అమెజాన్ ప్రైమ్ లో రానుంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి గల కారణాలను తాజాగా ఆయన చెప్పుకొచ్చారు. ‘అసురన్’ సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన వెంటనే నిర్మాత కళైపులి థానుకి ఫోన్ చేసి రైట్స్ అడిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు సురేష్ బాబు.

అయితే ఆ సమయంలో థాను కూడా సినిమా నిర్మాణంలో భాగం అవుతానని చెప్పడంతో.. సినిమా ఓకే అయిందని.. ఆ సమయంలో ఓటీటీకి ఇవ్వాలనే ఆలోచనే లేదని సురేష్ బాబు అన్నారు. అయితే ధనుష్ హీరోగా థాను నిర్మించిన ‘కర్ణన్’ సినిమా పాండమిక్ సమయంలోనే రిలీజ్ చేశారని.. సినిమా బాగానే ఆడినప్పటికీ, రెండు వారాల తరువాత సెకండ్ వేవ్ ప్రభావంతో థియేటర్లు మూతపడ్డాయని.. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి చోటుచేసుకునే ప్రమాదం ఉందని ‘నారప్ప’ను ఓటీటీకి ఇవ్వాలంటూ డీల్ వచ్చిందని థాను చెప్పినట్లు.. ఆయన కూడా నిర్మాత కావడంతో నో చెప్పలేకపోయానని సురేష్ బాబు వివరించారు.

ఈ సినిమా ఓటీటీకి వస్తుందని వెంకటేష్ కి చెప్పినప్పుడు ఆయన కూడా చాలా బాధపడ్డారని కానీ మరో మార్గం కనిపించలేదని చెప్పుకొచ్చారు. చాలా మంది అభిమానులు ఫోన్ చేసి ఎమోషనల్ అయిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తనకు కూడా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కష్టాలు తెలుసనీ.. మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నట్లు సురేష్ బాబు చెప్పుకొచ్చారు.

This post was last modified on July 17, 2021 11:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

3 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

4 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

5 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

5 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

6 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

7 hours ago