సోషల్ మీడియాలో చాలా అగ్రెసివ్గా ట్వీట్లు వస్తూ.. విమర్శలు చేసే వాళ్లకు చురుక్కుమనిపించేలా జవాబులు ఇస్తుంటాడు తమిళ నటుడు సిద్దార్థ్. చాలామంది ఫిలిం సెలబ్రెటీలు ప్రభుత్వ అధినేతల గురించి చిన్న కామెంట్ చేయడానికి కూడా చాలా భయపడిపోతుంటారు కానీ.. సిద్ధు మాత్రం ప్రధాన మంత్రిని కూడా ఘాటుగా విమర్శించడానికి వెనుకాడడు. ఇక సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే నెటిజన్లను వెతికి వెతికి వాయించేస్తుంటాడతను. అందులోనూ తనకు సంబంధం లేని విషయాల్లో లాగే వాళ్లను సిద్ధు అంత తేలిగ్గా వదలడు.
ఈ మధ్యే ఆంధ్రా భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డికి సిద్ధు ఇచ్చిన పంచ్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఒక నెటిజన్ సిద్ధు ఆగ్రహాన్ని చవిచూశాడు. సంబంధం లేకుండా ఒక వివాదంలోకి సిద్ధు పేరును లాగడమే ఇందుక్కారణం. దీని వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది.
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం ‘నారప్ప’ ఇంకో నాలుగు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాలోంచి ‘ఓ నారప్ప’ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్లో వెంకీతో పాటు అమ్ము అభిరామి ఉంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వెంకీకి జోడీగా నటించిందా అమ్మాయి. ఐతే వెంకీతో పోలిస్తే ఆమెకు మూడో వంతు వయసుంటుందేమో. దీని గురించి ఒక నెటిజన్ ఒక అభ్యంతకర పోస్టు పెట్టింది. మనవరాలి వయసున్న అమ్మాయితో వెంకీ రొమాన్స్ ఏంటి అంటూ వెంకీని టార్గెట్ చేసింది. ఐతే ఇలా ప్రశ్నించిన అమ్మాయి గతంలో సిద్ధార్థ్ను ఫ్లర్ట్ చేస్తున్నట్లుగా ట్వీట్లు వేసింది. దాన్ని కొందరు పట్టుకున్నారు.
40 ప్లస్ వయసున్న, పెళ్లయిన సిద్ధును అమ్మాయిలు ఇష్టపడి, వలపు బాణాలు విసరగా లేనిది.. వెంకీ ఓ చిన్న అమ్మాయితో సినిమా కోసం జోడీ కడితే తప్పేంటి అని ప్రశ్నించాడు. ఐతే సిద్ధును ట్యాగ్ చేసి మరీ అతను ఈ ట్వీట్ వేయడంతో ఈ హీరో లైన్లోకి వచ్చాడు. ‘‘ఈ హీరో వయసు టాపిక్లో నీకు ఫస్ట్ నేనే గుర్తొచ్చానా రా? ట్యాగ్ కూడా చేశావ్. సూపర్ రా దరిద్రం. ఎక్కడి నుంచి వస్తార్రా మెంటలోళ్లు?’’ అంటూ తెలుగులో అతను ట్వీట్ వేయడమే కాక.. నా వయసు నాకు తెలుసు, తెలుగు, దారుణం అనే పదాల్ని హ్యాష్ ట్యాగ్స్గా కూడా పెట్టడం విశేషం.
This post was last modified on July 17, 2021 8:27 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…