ఒక అమ్మాయి-అబ్బాయి డేటింగ్ అనగానే రొమాన్స్ గురించే ఆలోచనలు మెదులుతాయి చాలామందిలో. అది చాలా తప్పు అంటోంది టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్. డేటింగ్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడమని.. అందులో రొమాన్స్కు తొలి ప్రాధాన్యం ఇవ్వకూడదని ఆమె అంది. డేటింగ్ తొలి రోజు అవతలి వ్యక్తి ముద్దు అడిగితే ఇస్తారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. ఛాన్సే లేదని చెప్పేసింది ప్రగ్యా.
అలా అని డేటింగ్ చేసే వ్యక్తికి అసలు ముద్దే ఇవ్వరా అని అడిగితే.. అలా ఏమీ లేదంది ప్రగ్యా. కొన్ని రోజులు కలిసి జీవించి, ఇద్దరి మనసులు కలిశాక లిప్ కిస్కు ఓకే చెబుతుందట. మరి ప్రస్తుతం ఎవరితోనైనా డేటింగ్లో ఉన్నారా అని అడిగితే.. తనకు ఇప్పుడు అంత టైమ్ లేదని ప్రగ్యా అంది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల మీదే అంది ఈ ఉత్తరాది భామ.
తెలుగులో మొదట్లో చిన్నా చితకా సినిమాలేవో చేసింది కానీ.. ‘కంచె’ సినిమాతో ఆమెకు మంచి పేరే వచ్చింది. ఆ చిత్రంలో అందం, అభినయంతో ఆకట్టుకున్న ప్రగ్యా పెద్ద రేంజికి వెళ్తుందని అనుకున్నారు. కానీ తర్వాత అవకాశాలైతే వచ్చాయి కానీ.. కెరీర్ అనుకున్నంతగా ఊపందుకోలేదు. వరుసగా ఫ్లాపులు ఎదురు కావడం ఆమెకు చేటు చేసింది. దీంతో కెరీర్లో గ్యాప్ వచ్చేసింది. ఐతేనేం గ్లామర్ విందు చేస్తూ ఫొటో షూట్లతో కేక పుట్టిస్తూ సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్లను పెంచుకుంది ప్రగ్యా. కొంచెం గ్యాప్ తర్వాత ఆమె సినిమాల్లో బిజీ అవుతోంది.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ చిత్రం ‘అఖండ’లో ప్రగ్యా ఓ కథానాయికగా నటిస్తోంది. ‘ఎఫ్-3’లోనూ ప్రగ్యా మెరవనుందని అంటున్నారు కానీ.. అదెంత వరకు నిజమో తెలియదు. ‘అఖండ’ విడుదలై మంచి విజయం సాధిస్తే ప్రగ్యా కెరీర్ మళ్లీ ఊపందుకునే అవకాశముంది.
This post was last modified on July 15, 2021 11:35 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…