Movie News

‘క్షణం’ మొత్తం మార్చేయమన్నారట


అడివి శేష్ కెరీర్లో గేమ్ చేంజర్‌గా నిలిచిన చిత్రం ‘క్షణం’. అప్పటిదాకా శేష్‌కు కెరీర్లో చాలా వరకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. స్వీయ దర్శకత్వంలో తీసిన కర్మ, కిస్ చిత్రాలు దారుణమైన ఫలితాలను అందించగా.. నటుడిగా కూడా అతడికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ‘క్షణం’తో రచయితగా, నటుడిగా అద్భుతమైన పనితనం చూపించి ప్రేక్షకుల మనసు దోచాడు శేష్. కొత్త దర్శకుడు రవికాంత్ పేరెపుతో కలిసి అతను పడ్డ కష్టానికి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితమే దక్కింది. పెద్ద చిత్రాలకు పేరుపడ్డ పీవీపీ.. ఈ చిన్న చిత్రాన్ని ప్రోత్సహించి తన అభిరుచిని చాటుకున్నారు.

ఐతే సినిమా పట్టాలెక్కడానికి ముందు మాత్రం శేష్ చాలానే కష్టపడాల్సి వచ్చిందట. ఒకపట్టాన ఈ కథకు గ్రీన్ సిగ్నల్ లభించలేదట. ఒక టైంలో ‘క్షణం’ కథ మొత్తం మార్చేయాలన్న సూచన పీవీపీ టీంలోని ఒకరి నుంచి వచ్చినట్లు శేష్ తాజాగా ఒక టీవీ కార్యక్రమంలో వెల్లడించాడు.

“క్షణం కథా చర్చలు నడుస్తున్న సమయంలో ఒక రోజు పీవీపీ గారు వచ్చి నా స్నేహితులు కొందరున్నారు. వారికి కథ వినిపించండి. వాళ్లు ఓకే అంటే షూట్‌కు వెళ్లిపోదాం అన్నారు. పీవీపీ గారి ఆఫీసులో వారితో కలిసి నేను, రవికాంత్ కూర్చున్నాం. చాలా ఉత్సాహంగా కథ చెప్పాను. స్క్రీన్ ప్లే వివరిస్తుంటే.. వారిలో కొందరు ఇక్కడ కొంచెం మారిస్తే సరిపోతుంది. ఈ సీన్లో ఇది బాగాలేదు. మిగతా అంతా ఓకే అంటూ అభిప్రాయాలు చెబుతున్నారు. కానీ ఒకతను మాత్రం మొత్తం స్క్రిప్టు మార్చేయాలి అన్నాడు. ఒక్కసారిగా నా గుండె జారిపోయింది.

ఏడు నెలల కష్టం బూడిదలో వేసినట్లయిందని నేను, రవి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం. మా ముఖాలు పాలిపోయాయి. పీవీపీ గారు కూడా ఈ సినిమా మనం చేయాలా అన్నట్లు చూశారు. తర్వాత ఆయన, నిరంజన్ రెడ్డి బయటికి వెళ్లారు. మమ్మల్ని ఎలా బయటికి పంపించాలని అని మాట్లాడుకుంటున్నారేమో అనుకున్నాం. కానీ ఇద్దరూ లోపలికి వచ్చాక ఈ సినిమా చేస్తున్నామని, తాను 50 శాతం పెట్టుబడి పెడతానని నిరంజన్ రెడ్డి అన్నారు. దీంతో ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగొచ్చింది’’ అని శేష్ తెలిపాడు. కోటి రూపాయల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో పది కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడమే కాదు.. తమిళం, హిందీ భాషల్లోనూ రీమేక్ అయింది.

This post was last modified on July 14, 2021 3:14 pm

Share

Recent Posts

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

1 hour ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

2 hours ago

శర్వానంద్ రిలీజులకు కొత్త చిక్కుముడి

శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…

2 hours ago

ఊర్మిళను పెళ్లాడిన వర్మ?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…

2 hours ago

భోగాపురం క్రెడిట్ కోసం వైసీపీ తంటాలు…

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఏపీ ప్ర‌జ‌లు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఊద‌ర గొడుతోంది. అంతేకాదు.. గ‌త…

3 hours ago

స్పైడర్ మ్యాన్ సక్సెస్… ఏ పాఠం నేర్చుకోవాలి

సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…

3 hours ago