పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు నెలలకు పైగా హైదరాబాద్ శివార్లలోని తన ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. ఆయన కరోనా బారిన పడటం.. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుంటుండటంతో రాజకీయ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నారు. ఇక షూటింగ్ల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గి గత నెలలోనే ఒక్కో చిత్ర బృందం తిరిగి షూటింగ్ మొదలుపెట్టగా.. పవన్ మాత్రం తన కొత్త చిత్రాలను ఇంకా పున:ప్రారంభించలేదు.
ఐతే ఎట్టకేలకు పవన్ మళ్లీ షూటింగ్ మోడ్లోకి వెళ్లబోతున్నాడు. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఆయన తిరిగి మొదలుపెట్టబోయే చిత్రం ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్. ఈ నెల 12న ఈ చిత్ర కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు. హైదరాబాద్ శివార్లలోనే ఈ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో నిత్యా మీనన్ కూడా సెట్స్లోకి అడుగు పెట్టనుండటం విశేషం.
ఒరిజినల్లో గౌరి నంద చేసిన పాత్రను తెలుగులో సాయిపల్లవితో చేయించాలని ముందు అనుకున్నారు. ఆమె ఈ పాత్రకు ముందు ఒప్పుకుని, తర్వాత డేట్లు ఖాళీ లేక ఈ సినిమా నుంచి తప్పుకుంది. తర్వాత నిత్యా మీనన్ను అడగడం, ఆమె ఓకే చెప్పడం జరిగాయి. ఐతే కరోనా కారణంగా ఆమె ఇప్పటిదాకా చిత్ర బృందంతో కలవలేదు. ఎట్టకేలకు ఈ నెల 12న ఈ సినిమాలోకి అడుగు పెడుతోంది.
పవన్, నిత్యామీనన్ జోడీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటిదాకా వీళ్లిద్దరూ కలిసి నటించలేదు. ఎక్కువగా యువ కథానాయకులతోనే చేసిన నిత్య.. తొలిసారి తెలుగులో ఓ సీనియర్ హీరోతో జోడీ కడుతోంది. పవన్ కొన్ని రోజులు ఈ చిత్రానికి పని చేశాక.. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీర మల్లు’ షూటింగ్ను పున:ప్రారంభిస్తాడు. ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాదే రిలీజ్ చేయాన్నది నిర్మాతల ఆలోచన. ‘హరిహర వీరమల్లు’ను వచ్చే సంక్రాంతికి అనుకుంటున్నారు కానీ.. ఆ డేట్ను అందుకోవడం సందేహంగానే ఉంది.
This post was last modified on July 7, 2021 7:25 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…