సినిమా వాళ్లను బయటి వాళ్లు చూసే కోణమే వేరుగా ఉంటుంది. అందుకే తమను ఈ రంగంలోని వాళ్లే బాగా అర్థం చేసుకుంటారని సినీ జనాలు అనుకుంటారు. అందుకే సినిమా వాళ్లు ఒకరితో ఒకరు ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవడం మామూలే. ఐతే ఇలా ఒక్కటైన జంటలన్నీ కలిసి సాగుతాయని గ్యారెంటీ లేదు. విభేదాలతో కొంత కాలానికే విడిపోయిన జంటలు బోలెడు. ముఖ్యంగా బాలీవుడ్లో విడాకులు తీసుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు.
అర్బాజ్ ఖాన్-మలైకా అరోరాలతో మొదలుపెడితే.. తాజాగా ఆమిర్ ఖాన్-కిరణ్ రావుల వరకు వివాహ బంధానికి మధ్యలో తెరదించిన జోడీలు చాలానే కనిపిస్తాయి. సరిగ్గా ఆమిర్-కిరణ్ విడాకుల నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలో మరో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోకపోవడం తన అదృష్టమని ఆమె వ్యాఖ్యానించింది.
దేవుడి దయ వల్ల తాను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకోలేదని.. అందుకు తాను దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలని సోనమ్ పేర్కొందవి. బాలీవుడ్లో పని చేసే వాళ్ల ప్రపంచం చాలా సంకుచితంగా ఉంటుందని.. అందుకే ఇక్కడి వ్యక్తులను పెళ్లి చేసుకోకూడదని తాను భావించానని ఆమె చెప్పింది. తండ్రి, సోదరుడు, ఇంకా కపూర్ ఫ్యామిలీలో ఎంతోమంది సినీ రంగంలోనే ఉండగా.. ఇక్కడి అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదన్నట్లుగా సోనమ్ వ్యాఖ్యానించడం సంచలనమే.
ఆమె వ్యాపారవేత్త అయిన ఆనంద్ ఆహుజాను పెళ్లాడటం తెలిసిందే. ఆనంద్ తన లాగే ఆలోచిస్తాడని, అతనో ఫెమినిస్ట్ కూడా అని.. అలాంటి వ్యక్తిని పెళ్లాడటం తన అదృష్టమని సోనమ్ పేర్కొంది. ఆనంద్ లండన్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ కావడంతో పెళ్లయ్యాక కొంత కాలం వరకు తమకు ముంబయి-లండన్ ప్రయాణాలకే సమయం సరిపోయేదని.. ఐతే గత ఏడాది నుంచి కరోనా కారణంగా తాను షూటింగ్లకు దూరం కావడంతో లండన్లో ఆనంద్తో విలువైన సమయం గడపడానికి అవకాశం దొరికిందని.. ఈ రోజులు చాలా బాగున్నాయని సోనమ్ చెప్పింది.
జనసేన పార్టీని పుంజుకునేలా చేయాలన్నది పార్టీ అధిపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన. అందుకే ఆయన తరచుగా కమిటీలు…
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…