బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కంగనా రనౌత్. ఎప్పటికప్పుడు సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. సినీ, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను చెబుతుంటారు. ఇటీవల తాప్సీ తీరుని తప్పుబడుతూ కామెంట్స్ చేసిన కంగనా ఇప్పుడు అమీర్ ఖాన్ – కిరణ్ రావ్ ల విడాకులపై స్పందించారు. అమీర్ ఖాన్ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి. కిరణ్ రావ్ హిందూ కుటుంబంలో జన్మించారు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మతం విషయంలో సెలబ్రిటీలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు కంగనా.
పంజాబ్ లో చాలా వరకు కుటుంబంలో ఒకరిని సిక్కుగా, మరొకరిని హిందువుగా పెంచడానికి ఇష్టపడతారని చెప్పిన కంగనా.. అందరూ అలా ఎందుకు ఉండడం లేదని ప్రశ్నించారు. ముస్లిం మతంలో అసలు ఆ పద్ధతి కనిపించదని మండిపడ్డారు. హిందువు అయిన కిరణ్ రావ్.. అమీర్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న తరువాత ముస్లింగా ఎందుకు మారిపోయారంటూ కంగనా ప్రశ్నించారు. అమీర్ ఖాన్ తో పెళ్లి అయినంత మాత్రానా ఆమె మతం మార్చుకోవాల్సిన అవసరం ఏముందంటూ తన అభిప్రాయాన్ని వెళ్లగక్కారు.
తన కొడుకుని కిరణ్ రావ్ ఎందుకు ఒక హిందువుగా పెంచలేకపోయారంటూ అసహనం వ్యక్తం చేశారు. మతాంతర వివాహం చేసుకుంటే మతం మార్చుకోవాల్సిన అవసరం లేదని.. పిల్లలను ఇతర మతాల్లో పెంచాల్సిన అవసరం అసలు లేదంటూ చెప్పుకొచ్చారు కంగనా. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్- కిరణ్ రావ్ లు తమ కొడుకు విషయంలో ఇద్దరం బాధ్యతలు తీసుకుంటామని చెప్పారు. ఇక వీరి కొడుకు పూర్తిగా ముస్లిం పద్దతిలోనే పెరుగుతాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
This post was last modified on July 6, 2021 10:19 am
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…
బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…
హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…
మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…