Movie News

స్టార్ కపుల్ రిలేషన్ పై కంగనా కామెంట్స్!

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కంగనా రనౌత్. ఎప్పటికప్పుడు సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. సినీ, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను చెబుతుంటారు. ఇటీవల తాప్సీ తీరుని తప్పుబడుతూ కామెంట్స్ చేసిన కంగనా ఇప్పుడు అమీర్ ఖాన్ – కిరణ్ రావ్ ల విడాకులపై స్పందించారు. అమీర్ ఖాన్ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి. కిరణ్ రావ్ హిందూ కుటుంబంలో జన్మించారు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మతం విషయంలో సెలబ్రిటీలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు కంగనా.

పంజాబ్ లో చాలా వరకు కుటుంబంలో ఒకరిని సిక్కుగా, మరొకరిని హిందువుగా పెంచడానికి ఇష్టపడతారని చెప్పిన కంగనా.. అందరూ అలా ఎందుకు ఉండడం లేదని ప్రశ్నించారు. ముస్లిం మతంలో అసలు ఆ పద్ధతి కనిపించదని మండిపడ్డారు. హిందువు అయిన కిరణ్ రావ్.. అమీర్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న తరువాత ముస్లింగా ఎందుకు మారిపోయారంటూ కంగనా ప్రశ్నించారు. అమీర్ ఖాన్ తో పెళ్లి అయినంత మాత్రానా ఆమె మతం మార్చుకోవాల్సిన అవసరం ఏముందంటూ తన అభిప్రాయాన్ని వెళ్లగక్కారు.

తన కొడుకుని కిరణ్ రావ్ ఎందుకు ఒక హిందువుగా పెంచలేకపోయారంటూ అసహనం వ్యక్తం చేశారు. మతాంతర వివాహం చేసుకుంటే మతం మార్చుకోవాల్సిన అవసరం లేదని.. పిల్లలను ఇతర మతాల్లో పెంచాల్సిన అవసరం అసలు లేదంటూ చెప్పుకొచ్చారు కంగనా. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్- కిరణ్ రావ్ లు తమ కొడుకు విషయంలో ఇద్దరం బాధ్యతలు తీసుకుంటామని చెప్పారు. ఇక వీరి కొడుకు పూర్తిగా ముస్లిం పద్దతిలోనే పెరుగుతాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

This post was last modified on July 6, 2021 10:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

7 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

14 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

44 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago