బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కంగనా రనౌత్. ఎప్పటికప్పుడు సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. సినీ, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను చెబుతుంటారు. ఇటీవల తాప్సీ తీరుని తప్పుబడుతూ కామెంట్స్ చేసిన కంగనా ఇప్పుడు అమీర్ ఖాన్ – కిరణ్ రావ్ ల విడాకులపై స్పందించారు. అమీర్ ఖాన్ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి. కిరణ్ రావ్ హిందూ కుటుంబంలో జన్మించారు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మతం విషయంలో సెలబ్రిటీలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు కంగనా.
పంజాబ్ లో చాలా వరకు కుటుంబంలో ఒకరిని సిక్కుగా, మరొకరిని హిందువుగా పెంచడానికి ఇష్టపడతారని చెప్పిన కంగనా.. అందరూ అలా ఎందుకు ఉండడం లేదని ప్రశ్నించారు. ముస్లిం మతంలో అసలు ఆ పద్ధతి కనిపించదని మండిపడ్డారు. హిందువు అయిన కిరణ్ రావ్.. అమీర్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న తరువాత ముస్లింగా ఎందుకు మారిపోయారంటూ కంగనా ప్రశ్నించారు. అమీర్ ఖాన్ తో పెళ్లి అయినంత మాత్రానా ఆమె మతం మార్చుకోవాల్సిన అవసరం ఏముందంటూ తన అభిప్రాయాన్ని వెళ్లగక్కారు.
తన కొడుకుని కిరణ్ రావ్ ఎందుకు ఒక హిందువుగా పెంచలేకపోయారంటూ అసహనం వ్యక్తం చేశారు. మతాంతర వివాహం చేసుకుంటే మతం మార్చుకోవాల్సిన అవసరం లేదని.. పిల్లలను ఇతర మతాల్లో పెంచాల్సిన అవసరం అసలు లేదంటూ చెప్పుకొచ్చారు కంగనా. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్- కిరణ్ రావ్ లు తమ కొడుకు విషయంలో ఇద్దరం బాధ్యతలు తీసుకుంటామని చెప్పారు. ఇక వీరి కొడుకు పూర్తిగా ముస్లిం పద్దతిలోనే పెరుగుతాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
This post was last modified on July 6, 2021 10:19 am
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…