Movie News

స్టార్ కపుల్ రిలేషన్ పై కంగనా కామెంట్స్!

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కంగనా రనౌత్. ఎప్పటికప్పుడు సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. సినీ, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను చెబుతుంటారు. ఇటీవల తాప్సీ తీరుని తప్పుబడుతూ కామెంట్స్ చేసిన కంగనా ఇప్పుడు అమీర్ ఖాన్ – కిరణ్ రావ్ ల విడాకులపై స్పందించారు. అమీర్ ఖాన్ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి. కిరణ్ రావ్ హిందూ కుటుంబంలో జన్మించారు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మతం విషయంలో సెలబ్రిటీలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు కంగనా.

పంజాబ్ లో చాలా వరకు కుటుంబంలో ఒకరిని సిక్కుగా, మరొకరిని హిందువుగా పెంచడానికి ఇష్టపడతారని చెప్పిన కంగనా.. అందరూ అలా ఎందుకు ఉండడం లేదని ప్రశ్నించారు. ముస్లిం మతంలో అసలు ఆ పద్ధతి కనిపించదని మండిపడ్డారు. హిందువు అయిన కిరణ్ రావ్.. అమీర్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న తరువాత ముస్లింగా ఎందుకు మారిపోయారంటూ కంగనా ప్రశ్నించారు. అమీర్ ఖాన్ తో పెళ్లి అయినంత మాత్రానా ఆమె మతం మార్చుకోవాల్సిన అవసరం ఏముందంటూ తన అభిప్రాయాన్ని వెళ్లగక్కారు.

తన కొడుకుని కిరణ్ రావ్ ఎందుకు ఒక హిందువుగా పెంచలేకపోయారంటూ అసహనం వ్యక్తం చేశారు. మతాంతర వివాహం చేసుకుంటే మతం మార్చుకోవాల్సిన అవసరం లేదని.. పిల్లలను ఇతర మతాల్లో పెంచాల్సిన అవసరం అసలు లేదంటూ చెప్పుకొచ్చారు కంగనా. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్- కిరణ్ రావ్ లు తమ కొడుకు విషయంలో ఇద్దరం బాధ్యతలు తీసుకుంటామని చెప్పారు. ఇక వీరి కొడుకు పూర్తిగా ముస్లిం పద్దతిలోనే పెరుగుతాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

This post was last modified on July 6, 2021 10:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

3 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

4 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

5 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

5 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

5 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

6 hours ago