రామ్ చరణ్తో తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ చేయబోయే సినిమాకు అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టాలనే విషయంలో చిత్ర బృందం ఒక అంచనాకు వచ్చేసినట్లు సమాచారం. జులైలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోందట. ఆదివారం జరిగిన కీలక పరిణామంతో ఈ విషయం ఖరారైనట్లు తెలుస్తోంది.
కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే రామ్ చరణ్, దిల్ రాజు కలిసి శంకర్ను కలిసి సమావేశం అయ్యారట. స్క్రిప్ట్ ఫైనల్ నరేషన్ వినడంతో పాటు షూటింగ్ విషయంలోనూ ముగ్గురూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇండియన్-2 వివాదం నుంచి శంకర్ బయటపడ్డ నేపథ్యంలో వచ్చే నెల నుంచే చరణ్ సినిమాను మొదలుపెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారట. ఈ మేరకు ప్రొడక్షన్ టీం షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కొన్ని రోజుల్లోనే ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు, షూటింగ్ అప్డేట్తో ఒక ప్రకటన ఇవ్వబోతున్నారని సమాచారం. టైటిల్ ప్రకటించి షూటింగ్కు వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఇందులో చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ విదేశీ భామకు కూడా ఇందులో కీలక పాత్ర ఉందని అంటున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత బాధ్యతలు తీసుకుంటున్నాడు.
శంకర్ తరహాలోనే సామాజిక అంశాలతో ముడిపడ్డ కమర్షియల్ ఎంటర్టైటనర్గా ఈ చిత్రం తెరకెక్కనుందని అంటున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లో పాన్ ఇండియన్ సినిమాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. శంకర్కు ఎలాగూ దేశవ్యాప్తంగా పేరుంది. ఆర్ఆర్ఆర్తో చరణ్ సైతం పాన్ ఇండియా స్టార్ కావడం ఖాయం. కాబట్టి ఈ చిత్రం విడుదలయ్యే సమయానికి హైప్ పీక్స్లో ఉంటుందనడంలో సందేహం లేదు.
This post was last modified on July 5, 2021 10:02 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…