బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్.. తన రెండో భార్య కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ముందుగా రీనా దత్తాను 1986లో పెళ్లాడి ఆమెతో ఇద్దరు పిల్లల్ని కన్న ఆమిర్.. 2002లో ఆమె నుంచి విడిపోవడం తెలిసిందే. ఆ తర్వాత మూడేళ్లకు తన ఆలోచనలకు చాలా దగ్గరగా ఉన్న కిరణ్ రావును పెళ్లాడాడు. ఆమెతో కలిసి సినిమాలు తీశాడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు. వీళ్లిద్దరూ విడిపోతారన్న ఆలోచనే ఎవరికీ లేదు. కానీ శుక్రవారం హఠాత్తుగా ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లుగా ఉమ్మడిగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ వార్త బయటికి వచ్చిన కాసేపటికే ట్విట్టర్లో ఫాతిమా సనా షేక్ పేరు ట్రెండ్ అవుతుండటం గమనార్హం.
ముందుగా ఆమిర్ పేరు ట్రెండ్ కాగా.. ఆ తర్వాత ఫాతిమా పేరు అంత కన్నా ఎక్కువగా ట్రెండ్ అవడం మొదలైంది. ఆమిర్తో ఫాతిమాకు ఎఫైర్ ఉన్నట్లు గతంలో గట్టిగా ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని ఫాతిమా తీవ్రంగా ఖండించింది. ఆమె తొలిసారిగా ఆమిర్తో కలిసి దంగల్ సినిమాలో నటించింది. వాళ్లిద్దరూ అందులో తండ్రీ కూతుళ్లుగా నటించడం గమనార్హం. ఆ వెంటనే ఆమిర్ నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్లో ఫాతిమా కీలక పాత్ర చేసింది. అప్పుడు మొదలయ్యాయి వీళ్లిద్దరి బంధం గురించి గుసగుసలు. ఐతే ఫాతిమా ఆ రూమర్లపై తీవ్రంగా స్పందించడంతో రూమర్లు ఆగాయి. కానీ ఇప్పుడు ఆమిర్.. కిరణ్ నుంచి విడాకులు తీసుకోవడంతో మళ్లీ ఫాతిమా పేరు తెరపైకి వచ్చింది. ఆమిర్తో ఆమె ఎఫైర్ వల్లే కిరణ్ విడాకులు తీసుకుందని.. త్వరలోనే ఫాతిమా ఆమిర్ చెంతకు చేరడం ఖాయమని.. వీళ్లిద్దరికీ లైన్ క్లియర్ అయిందని మీమ్స్ వేస్తూ ఫాతిమా పేరును ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on July 4, 2021 11:14 am
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…