ఈ ఏడాది సౌత్ ఇండియాలో కొత్తగా ప్రకటించిన హీరో-డైరెక్టర్ కాంబినేషన్లలో అందరినీ ఎంతో ఎగ్జైట్ చేసింది టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, తమిళ ఏస్ డైరెక్టర్ శంకర్లదే. తమిళ అనువాద చిత్రాలతో తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న శంకర్.. తొలిసారి ఓ తెలుగు హీరోతో సినిమా చేయబోతుండటం.. చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోయే చిత్రమిదే కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది.
దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా మూవీ గురించి ప్రకటన వచ్చి చాలా రోజులైంది. కానీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందో మాత్రం స్పష్టత లేదు. కరోనా సెకండ్ వేవ్ వల్ల కలిగిన ఆలస్యానికి తోడు.. శంకర్కు ఇండియన్-2 నిర్మాతలతో ఉన్న లీగల్ ఇష్యూస్ ఈ సినిమాపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టుపై సందిగ్ధత నెలకొంది.
ఐతే రామ్ చరణ్ అతి త్వరలోనే శంకర్ను కలిసి ఈ ప్రాజెక్టుపై నేరుగా చర్చించబోతున్నాడట. ఇప్పటిదాకా ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకోవడమే తప్ప నేరుగా చరణ్, శంకర్ మాట్లాడుకున్నది లేదు. చరణ్ తీరిక లేకుండా ఉండటంతో పాటు కరోనా కూడా అందుకు కారణమే. ఐతే మరి కొన్ని రోజుల్లో చరణ్.. చెన్నైకి వెళ్లి శంకర్తో సమావేశం కానున్నాడట. దిల్ రాజు కూడా చరణ్ వెంట వెళ్లనున్నాడట.
ఆ సందర్భంగా స్క్రిప్ట్ ఫైనలైజ్ చేయడంతో పాటు కాస్టింగ్ గురించి కూడా చర్చించనున్నారని.. అలాగే శంకర్కు ఇండియన్-2 నిర్మాతలతో ఉన్న సమస్యల గురించి కూడా మాట్లాడి.. ఓ స్పష్టత తెచ్చుకోవాలని.. దాన్ని బట్టి ఈ చిత్రాన్ని ఎప్పుడు సెట్స్ మీదికి తీసుకెళ్లాలన్నది కూడా నిర్ణయించనున్నారని సమాచారం. ఆ మీటింగ్ తర్వాత షూటింగ్ గురించి, కాస్ట్ అండ్ క్రూ గురించి అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
This post was last modified on July 3, 2021 11:31 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…