కరోనా కారణంగా సినిమాల నిర్మాణం ఆగిపోయింది. దీంతో దర్శకనిర్మాతలు, హీరోల ప్లానింగ్ ప్రకారం ఏదీ జరగడం లేదు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కూడా ముందుగా ‘లైగర్’ను పూర్తి చేసి ఆ తరువాత సుకుమార్ తో సినిమా చేయాలనుకున్నారు. కానీ ‘లైగర్’ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ పునః ప్రారంభించనున్నారు. అలానే సుకుమార్ తను రూపొందిస్తోన్న ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నారు.
అంటే ఇప్పట్లో ఆయన ఫ్రీ అయ్యే ఛాన్స్ లేదు. ఎలా లేదన్నా.. వచ్చే ఏడాది చివరి వరకు సుకుమార్ బిజీగా ఉంటారు. అందుకే విజయ్ దేవరకొండ వేరే ఆప్షన్స్ కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో కొందరు దర్శకులు చెప్పే కథలు వింటున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. అలానే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై మరో సినిమా చేయనున్నారు.
ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాకి డైరెక్టర్ ని సెట్ చేసినట్లు సమాచారం. దిల్ రాజు ఆస్థాన దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఫ్యూచర్ లో విజయ్ దేవరకొండ సినిమా చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశల్లోనే ఉంది. విజయ్ కి తగ్గ కథను హరీష్ శంకర్ రెడీ చేయగలిగితే.. ఈ కాంబినేషన్ మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంది.
This post was last modified on July 3, 2021 11:56 am
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…