కరోనా కారణంగా సినిమాల నిర్మాణం ఆగిపోయింది. దీంతో దర్శకనిర్మాతలు, హీరోల ప్లానింగ్ ప్రకారం ఏదీ జరగడం లేదు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కూడా ముందుగా ‘లైగర్’ను పూర్తి చేసి ఆ తరువాత సుకుమార్ తో సినిమా చేయాలనుకున్నారు. కానీ ‘లైగర్’ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ పునః ప్రారంభించనున్నారు. అలానే సుకుమార్ తను రూపొందిస్తోన్న ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నారు.
అంటే ఇప్పట్లో ఆయన ఫ్రీ అయ్యే ఛాన్స్ లేదు. ఎలా లేదన్నా.. వచ్చే ఏడాది చివరి వరకు సుకుమార్ బిజీగా ఉంటారు. అందుకే విజయ్ దేవరకొండ వేరే ఆప్షన్స్ కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో కొందరు దర్శకులు చెప్పే కథలు వింటున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. అలానే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై మరో సినిమా చేయనున్నారు.
ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాకి డైరెక్టర్ ని సెట్ చేసినట్లు సమాచారం. దిల్ రాజు ఆస్థాన దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఫ్యూచర్ లో విజయ్ దేవరకొండ సినిమా చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశల్లోనే ఉంది. విజయ్ కి తగ్గ కథను హరీష్ శంకర్ రెడీ చేయగలిగితే.. ఈ కాంబినేషన్ మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంది.
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…