జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపై వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. నాలుగేళ్ల కిందట ‘బిగ్ బాస్’ షోతో అతను చిన్నపాటి ప్రకంపనలు సృష్టించాడు. తెలుగు ప్రేక్షకులకు కొత్త అయిన ‘బిగ్ బాస్’ను తొలి సీజన్లో తనదైన శైలిలో హోస్ట్ చేసి అందరి మెప్పూ పొందాడు తారక్. అతను ఆ షోకు హోస్ట్గా తర్వాతి సీజన్లలోనూ కొనసాగుతాడని అంతా ఆశించారు కానీ.. ఒక్క సీజన్తోనే షోకు టాటా చెప్పేసి వెళ్లిపోయాడు. మళ్లీ ఇటు వైపు చూడలేదు.
ఇక మళ్లీ ‘బిగ్ బాస్’లో తారక్ను చూసే అవకాశాలు దాదాపు లేనట్లే. ఐతే ఆ షోకు దూరమైనప్పటికీ.. మళ్లీ బుల్లితెరలోకి మరో షోతో రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించడం తారక్ అభిమానులను అమితానందానికి గురి చేసింది. అతను ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కొత్త వెర్షణ్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’తో పునరాగమనానికి సిద్ధం కావడం తెలిసిందే. కొన్ని నెలల కిందటే జెమిని టీవీలో ఈ షోను ప్రకటించారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ తారక్ను దీని హోస్ట్గా వెల్లడించారు.
ఐతే అప్పుడు కొన్ని రోజుల్లోనే మొదలు కావాల్సిన షో కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ ఏడాదికి ఇక ఈ షో ఉండదేమో అన్న సందేహాలు నెలకొన్నాయి కానీ.. అలాంటిదేమీ లేదని తేలింది. త్వరలోనే షోను మొదలుపెట్టబోతున్నారు. ఇందుకోసం తారక్ కూడా డేట్లు కూడా కేటాయించినట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కానుందట. ముందుగా కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ పూర్తి చేసి టీవీలో ప్రసారం చేస్తారట. తర్వాత తారక్ కొంచెం గ్యాప్ తీసుకుంటాడు.
‘ఆర్ఆర్ఆర్’ టాకీ పార్ట్ మొత్తం పూర్తయిపోగా.. ఇందులో రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. అందులో ఒక పాట తారక్, చరణ్ల మీద తీస్తారు. ఆ పని పూర్తి చేసి ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోలోకి వెళ్లిపోతాడని.. తర్వాత ఈ షో చేస్తూనే కొరటాల శివ చిత్రం షూటింగ్లోనూ పాల్గొంటాడని సమాచారం. ఈ షో ఎప్పుడు మొదలయ్యేది త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on July 2, 2021 11:28 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…